Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం అరడజనుకు పైగా కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా యాంకర్ గా వరుస కార్యక్రమాలను చేయడమే కాకుండా మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సినిమాలలో కూడా బిజీ అయ్యారు.
ఇలా వెండితెరపై బుల్లితెరపై రాములమ్మ ఓ రేంజ్ లో బిజీగా మారిపోయారని చెప్పాలి. ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి శ్రీముఖికి సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం వల్ల సోషల్ మీడియాలో కూడా శ్రీముఖికి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.
శ్రీముఖి తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా థాయిలాండ్ వెళ్లిన శ్రీముఖి ఫుకెట్ నగరంలో గల జూ పార్క్ సందర్శించారు. అక్కడున్న పెద్ద పులిని తాకుతూ ధైర్యం ప్రదర్శించారు. శ్రీముఖి డేరింగ్ చూసిన జనాలు… ఆమె తలచుకుంటే ఏదైనా లొంగిపోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మరికొందరు ఈ ఫోటోలను చూసి ఎంతైనా శ్రీముఖి ధైర్యానికి సలాం చెప్పాల్సిందే అంటూ తన ధైర్యంపై ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం ఈ ఫోటోలపై స్పందిస్తూ ఏమాత్రం తేడా కొట్టిన అంతే సంగతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…