Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు విష్ణు ప్రియ యాంకర్ గా కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలు చేసిన అనంతరం ఈమె బుల్లితెరకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విష్ణు ప్రియ రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.
ఇకపోతే విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో తన తల్లిని కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన తల్లి మరణించారనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఇలా తన తల్లిని ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ విష్ణు ప్రియ చేసినటువంటి పోస్టులు అందరినీ ఎంతగానో కలిచి వేసాయి. ఇకపోతే మదర్స్ డే సందర్భంగా ఈటీవీలో ప్రియమైన అమ్మకు అనే పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈటీవీతో అనుబంధం ఉన్నటువంటి వారందరినీ వారి తల్లులతో ఆహ్వానించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముఖ్యంగా ఇందులో రాకింగ్ రాకేష్ నూకరాజు ఒక స్కిట్ చేశారు. ఆ కొడుకులు ఇద్దరు నిర్లక్ష్యం చేయడం వల్ల తన తల్లి చనిపోతుంది ఇలా తల్లి చనిపోవడంతో తమవల్లే చనిపోయిందని ఆ ఇద్దరు ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడుస్తారు.
ఈ సన్నివేశం అందరిని కంటతడి పెట్టేలా చేసింది. అయితే ఈ సన్నివేశం చూసినటువంటి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఏకంగా స్టేజ్ పైకి వెళ్లి మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతానమ్మా ఐ లవ్ యు సో మచ్ అమ్మ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే విష్ణు ప్రియని చూసి అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…