అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, కేతికశర్మ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం అక్టోబర్ 29 రేపు విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్ షోను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దంపతులు, బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బొమ్మరిల్లు భాస్కర్, హరీష్ శంకర్,మెహర్ రమేష్ వంటి దర్శకులు ఈ సినిమా ప్రీమియర్ షోను చూశారు.
ఇక ఈ సినిమా చూసిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను ఇప్పుడే చూశాను చాలా అద్భుతంగా ఉంది. రొమాంటిక్ సినిమా గురించి ఏదైనా వంక పెడితే యూత్ గొడవ చేస్తారేమో… ముసలోడు అయిపోయావు.. నీకేం తెలుస్తుందని యువత నాతో గొడవకు దిగుతారు అంటూ రాజమౌళి ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అనిల్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఆకాశ్, కేతిక జంట అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా రాజమౌళి తెలియజేశారు. ఇకపోతే ఆకాష్ బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అతనికి మరొక మెట్టు పైకి ఎక్కించిందని ఇండస్ట్రీకి మరొక టాలెంటెడ్ హీరో దొరికాడని ఆకాష్ పూరి పై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం తనకు ఎంతగానో నచ్చిందని రాజమౌళి సినిమా గురించి తెలియజేశారు. ఇక ఈ సినిమాని పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…