Keerthy Suresh: కోలీవుడ్ స్టార్ జయం రవి, హీరోయిన్ కీర్తీ సురేష్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ సినిమాకు ఆంటోనీ భాగ్యరాజు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో జయం రవి ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్, థ్రిల్లర్, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీని హోమ్ ఫిలిం మేకర్స్ పతాకంపై సుజాత నిర్మించారు. కాగా ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు నటించగా జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్ ఆయన ప్రేయసిగా నటించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా తాజాగా అభిమానులు ఊహించని వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ వార్త ఒకసారిగా షాక్ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి విడుదల చేయనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
నేరుగా అందులో స్ట్రీమింగ్..
ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఈ సినిమాలో థియేటర్లలో విడుదల చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…