Movie News

Keerthy Suresh: డైరెక్ట్ గా ఓటీటీ లోకి విడుదల కాబోతున్న స్టార్ హీరోయిన్ చిత్రం.. ఆ సినిమా ఏదో తెలుసా?

Keerthy Suresh: కోలీవుడ్ స్టార్ జయం రవి, హీరోయిన్ కీర్తీ సురేష్‌, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ సినిమాకు ఆంటోనీ భాగ్యరాజు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో జయం రవి ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌, థ్రిల్లర్‌, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీని హోమ్‌ ఫిలిం మేకర్స్‌ పతాకంపై సుజాత నిర్మించారు. కాగా ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు నటించగా జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్‌గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్‌ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్‌ ఆయన ప్రేయసిగా నటించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా తాజాగా అభిమానులు ఊహించని వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ వార్త ఒకసారిగా షాక్ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి విడుదల చేయనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

నేరుగా అందులో స్ట్రీమింగ్..

ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో అభిమానులు ఈ సినిమాలో థియేటర్లలో విడుదల చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago