Keerthy Suresh: కోలీవుడ్ స్టార్ జయం రవి, హీరోయిన్ కీర్తీ సురేష్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ సినిమాకు ఆంటోనీ భాగ్యరాజు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో జయం రవి ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్, థ్రిల్లర్, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీని హోమ్ ఫిలిం మేకర్స్ పతాకంపై సుజాత నిర్మించారు. కాగా ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు నటించగా జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్ ఆయన ప్రేయసిగా నటించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా తాజాగా అభిమానులు ఊహించని వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ వార్త ఒకసారిగా షాక్ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి విడుదల చేయనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
నేరుగా అందులో స్ట్రీమింగ్..
ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఈ సినిమాలో థియేటర్లలో విడుదల చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…