Star Heroin: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి వివాహం చేసుకున్న సమంత.. పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకే నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అతనికి దూరంగా ఉంటుంది.
తాజాగా ఇండస్ట్రీలో మరొక సీనియర్ హీరోయిన్ సమంత అడుగుజాడల్లోనే వెళ్తూ భర్తకు విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందరికీ సుపరిచితమైన ప్రియమణి.
ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రియమణి తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి.
ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటూ ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ప్రియమణి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తికి ఇదివరకే పెళ్లి జరిగిందని తెలిసిన కూడా ప్రియమణి అతన్ని ఇష్టపడి మరి వివాహం చేసుకుంది. వీరి పెళ్లి సమయంలో ముస్తఫా మొదటి భార్య రచ్చ చేసిన విషయం ఆ సమయంలో తీవ్ర దుమారం రేపింది. ఇదిలా ఉండగా ప్రియమణి తన భర్తతో ఉన్న మనస్పర్ధలు కారణంగా కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రియమణి దంపతులు కూడా విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్తలపై ప్రియమణి స్పందించక పోవటంతో ఈ వార్తలలో నిజం ఉంది కాబట్టే ప్రియమణి స్పందించడం లేదు అంటూ కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత కూడా విడాకులు తీసుకోవడానికి ముందు ఆ వార్తలపై స్పందించలేదని..అలాగే ప్రియమణి కూడా ఆమె బాటలోనే వెళ్తూ విడాకులకు సిద్ధమయ్యారని తెలుస్తోంది .మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ప్రియమణి స్పందించాల్సి ఉంది.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…