తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణిలో ఉన్న వారిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. తన తండ్రి రామానాయుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు. తండ్రి రామానాయుడు బాటలోనే సురేష్ బాబు ఉ ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించాగా, వెంకటేష్ హీరోగా వెండితెరపై సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ నాయుడు ప్రొడక్షన్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో యాక్టింగ్ స్కూల్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, రైటర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రొడ్యూసర్స్ కు స్కూల్స్ ఎందుకు లేవనే ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు సమాధానంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రొడక్షన్ అనేది చాలా మందికి ఒక విసిల్ బిజినెస్ గా మారిపోయింది. ఎక్కడో డబ్బులు సంపాదించి సినిమాలను తెరకెక్కించి నేను ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని చాలామందికి ఉంటుంది.
నేనుప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కి ప్రతిరోజు రెండు గంటల పాటు నేను చెప్పే క్లాస్ వినాలని చెప్పాను. మెంబర్షిప్ తీసుకునే ముందు నా దగ్గరికి వస్తే క్లాసెస్ చెప్తానని చెప్పాను. అలా అన్నప్పుడు చాలామంది మెంబర్షిప్ ఇవ్వండయ్యా.. వీడి దగ్గర ఏంది మనం నేర్చుకునేది.. నా సొమ్ము నా ఇష్టం మీరు ఎవరు చెప్పడానికి.. నీకు మీ నాన్నకి ఎవరైనా నేర్పించారా.. అని అడిగారని ఈ సందర్భంగా సురేష్ బాబు తెలియజేశారు. అలా వారి ధోరణిలో వారికి అది కరెక్ట్ అనిపించిందని సురేష్ బాబు తెలియజేశారు.
అదేవిధంగా దిల్ రాజు గారు ప్రతి ఒక్క జిల్లాలో థియేటర్లు నిర్మిస్తున్నారు. మీరు ఎందుకని థియేటర్లు నిర్మించడం లేదు అన్న ప్రశ్న ఎదురయింది.. ఈ క్రమంలోనే నేను పది పదిహేను సినిమాలు నిర్మిస్తున్నాను అంటే నాకు థియేటర్ అవసరమౌతుంది. కానీ దిల్ రాజు గారు అలా సినిమాలు నిర్మిస్తారు కనుక ఆయనకి థియేటర్లు అవసరం కనుక.. అతను ప్రతి ఒక్క జిల్లాలో థియేటర్లు నిర్మిస్తున్నారని అవి నడిచినన్ని రోజులు నడుస్తాయని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…