తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణిలో ఉన్న వారిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. తన తండ్రి రామానాయుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు. తండ్రి రామానాయుడు బాటలోనే సురేష్ బాబు ఉ ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించాగా, వెంకటేష్ హీరోగా వెండితెరపై సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ నాయుడు ప్రొడక్షన్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో యాక్టింగ్ స్కూల్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, రైటర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రొడ్యూసర్స్ కు స్కూల్స్ ఎందుకు లేవనే ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు సమాధానంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రొడక్షన్ అనేది చాలా మందికి ఒక విసిల్ బిజినెస్ గా మారిపోయింది. ఎక్కడో డబ్బులు సంపాదించి సినిమాలను తెరకెక్కించి నేను ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని చాలామందికి ఉంటుంది.
నేనుప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కి ప్రతిరోజు రెండు గంటల పాటు నేను చెప్పే క్లాస్ వినాలని చెప్పాను. మెంబర్షిప్ తీసుకునే ముందు నా దగ్గరికి వస్తే క్లాసెస్ చెప్తానని చెప్పాను. అలా అన్నప్పుడు చాలామంది మెంబర్షిప్ ఇవ్వండయ్యా.. వీడి దగ్గర ఏంది మనం నేర్చుకునేది.. నా సొమ్ము నా ఇష్టం మీరు ఎవరు చెప్పడానికి.. నీకు మీ నాన్నకి ఎవరైనా నేర్పించారా.. అని అడిగారని ఈ సందర్భంగా సురేష్ బాబు తెలియజేశారు. అలా వారి ధోరణిలో వారికి అది కరెక్ట్ అనిపించిందని సురేష్ బాబు తెలియజేశారు.
అదేవిధంగా దిల్ రాజు గారు ప్రతి ఒక్క జిల్లాలో థియేటర్లు నిర్మిస్తున్నారు. మీరు ఎందుకని థియేటర్లు నిర్మించడం లేదు అన్న ప్రశ్న ఎదురయింది.. ఈ క్రమంలోనే నేను పది పదిహేను సినిమాలు నిర్మిస్తున్నాను అంటే నాకు థియేటర్ అవసరమౌతుంది. కానీ దిల్ రాజు గారు అలా సినిమాలు నిర్మిస్తారు కనుక ఆయనకి థియేటర్లు అవసరం కనుక.. అతను ప్రతి ఒక్క జిల్లాలో థియేటర్లు నిర్మిస్తున్నారని అవి నడిచినన్ని రోజులు నడుస్తాయని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…