బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. ఒకరోజు ఒకరిపై ఒకరు యుద్దం ప్రకటించుకుంటూ అనకూడని మాటలతో అరుచుకుంటారు. మరొక రోజు ప్రేమ కురిపించుకుంటారు. ఎట్టకేలకు కెప్టెన్సీ టాస్క్, ప్రమేకథలతో గురువారం సరదాగా బిగ్ బాస్ సాగిపోయింది. అయితే శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించి మొదటి ప్రోమోలు మళ్లీ ఒకరిపై ఒకరు భగ్గుమన్నారు. ఎప్పటిలాగే హౌస్మేట్స్కు బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో వరెస్ట్ మరియు బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటూ చిచ్చు పెట్టేశాడు.
ఇలా సాఫీగా సాగిపోతుండగా.. ఇలా బిగ్ బాస్ ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ వారి మధ్య దూరాన్ని పెంచేస్తున్నాడు. ఎవరిపై వరెస్ట్ అని చెబితే ఎక్కడ ఎవరు ఫీల్ అవుతారో అని హౌస్ మేట్స్ భయపడిపోతున్నారు. ఈ సందర్భంగా నటరాజ్ తన మాటలతో శివతాండవం చేశారు. బెస్ట్ నాలెడ్జ్, సెన్స్ ఉండదు.. ఎలా ఆడాలి అంటూ కోపంతో ఊగిపోతాడు.
అతడు ఎవరి గురించి అన్నాడో తెలియదు కానీ.. రెండో ప్రోమో బిగ్ బాస్ విడుదల చేసి నటరాజ్ మాస్టర్ కు కన్నీళ్లు పెట్టించాడు. రెండో ప్రోమో చంటి పిల్లాడు ఏడ్చే శబ్దం వస్తుంది. అందరూ ఎవరు అంటూ.. ఒకరి మోహం ఒకరు చూసుకుంటారు. నటరాజ్ కు అప్పుడే అర్థం అయిపోతుంది.. అది తన గురించే అని.. తన కళ్ల వెంట నీళ్లు కారిపోతుండగా.. ప్రియాంక సింగ్ వచ్చి ఓదార్చుతుంది. తర్వాత సోఫాలో అందరూ కూర్చున్న తర్వాత ఆ బిగ్ స్క్రీన్ పై తన భార్య సీమంతంకు సంబంధించి వీడియో కనిపిస్తుంది.
దీంతో కాసేపు నటరాజ్ మాస్టార్ భావోద్వేగానికి గురవుతాడు. ‘‘నైట్ నువ్వు మాట్లాడితే బేబీ కదిలేది కదా.. ఇప్పుడు బిగ్ బాస్ లో నీ మాటలు వింటూ బేబీ డిష్యూం డిష్యూం అంటూ ఫైట్ చేస్తుంది’’ అంటూ చెప్పగానే నటరాజ్ మాస్టార్ వెళ్లి బిగ్ స్క్రీన్ పై ఉన్న తన భార్య ఫొటోకు ముద్దు పెట్టేస్తాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…