దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా కొన్ని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మినహాయింపు ఇవ్వడంతో ఈకామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో పలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో నేటి నుంచి తమ అమ్మకాలు మొదలుపెట్టాయి ఈకామర్స్ సంస్థలు. అయితే కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే వినియోగదారులకు మాత్రమే తమ అమ్మకాలు స్టార్ట్ చేయనున్నాయి. రెడ్ జోన్లలో ఉండే వినియోగదారులకు మాత్రం మరి కాస్త సమయం వేచి చూడక తప్పదు.
ఈ నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు తమ డెలివరీ బాయ్స్ కు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారుడికి వస్తువు డెలివెరీ చేసేందుకు వీలయితే ఇంటి బయటే డెలివరీ చేసేలా పలు సూచనలు చేసారు. ఈ నేపధ్యంలో సాధారణంగా పట్టే డెలివరీ సమయం కంటే.. మరికాస్త ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…