Suddhala Ashok Teja : తెలుగు రచయిత సుద్దాల అశోక్ తేజ తెలుగులో ఫేమస్ రైటర్. నమస్తే అన్న సినిమాతో మొదలైన ప్రస్థానం, నేడు 1250 సినిమాలలో 2200 పాటలను రాసారు. ఇక 2500 ప్రైవేట్ పాటలను కూడా రాసారు. సుద్దాల అశోక్ తేజ మొదట ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు తెలంగాణ ఉద్యమంలో పోరాడారు. ఇక తండ్రి స్ఫూర్తితో గేయాలు, పాటలు రాయడం నేర్చుకున్నారు. సినిమా పాటలను రాయడం కోసం చెన్నైకి వెళ్లిన అశోక్ తేజ కి మేనల్లుడు అప్పటికే ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తేజ్ సహాయం చేసాడు. ఇక నమస్తే అన్న అనే సినిమాకు మొదటిసారిగా పాటలు రాసిన అశోక్ తేజ రాములమ్మ సినిమాలో రాసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది.
శ్రమ దోపిడీ సినిమా ఇండస్ట్రీలో ఉంది, నాకు రెమ్యూనరేషన్ మొదట్లో ఇవ్వలేదు…
ఇక సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తాను పడిన కష్టాలను, అనుభవాలను చెప్పారు. చెన్నైలో ఉన్నప్పుడు పాట రాయించుకుని రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదని, చాలా సార్లు ఇలా జరిగిందని, కొన్నిసార్లు తిండి పెట్టాం, వసతి కల్పించాము ఇక పాటకు డబ్బులు ఇవ్వము అని అనేవారట. ఇక కొన్నిసార్లు పాట రాసిన డబ్బు ఇస్తాము, కాకపోతే పేరు వేరేవాళ్లది వేస్తామని చెప్పేవారట. అలా అన్నప్పుడు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పేరే వేయండి అని అశోక్ గారు చెప్పేవారట. ఒకవేళ పది సినిమాలకు నాకు పారితోషకం ఇవ్వకపోయినా నా పేరు ఉంటుంది కనుక పది సినిమాలు చేసానని నా మార్కెట్ ఉంటుందని దాంతో నేను రాసే నెక్స్ట్ సినిమాలద్వారా సంపాదించుకుంటానని అని భావించేవారట.
ఇక ఠాగూర్ సినిమాకు వచ్చిన నేషనల్ అవార్డు విషయంలో వచ్చిన విమర్శల గురించి స్పందించారు. తనకు పాటలు రాయడంలో గురువుగారైన నారాయణ రెడ్డి గారు ఇలాంటి విమర్శలు మాములే పట్టించుకోవద్దు అంటూ చెప్పారట. శ్రీ శ్రీ గారి రచనను తీసుకున్నారు కనుక అవార్డు ఎలా తీసుకుంటారని అన్నారట, అయితే శ్రీ శ్రీ గారు కూడా గురజాడ గారి రచనల స్ఫూర్తిగా పాటలు రాసారు. అందువల్ల ఇటువంటి విమర్శలకు స్పందించనని చెప్పారు.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…