Suhasini: సినిమా రివ్యూ ఇవ్వడానికి నువ్వెవరు.. ఉమైర్ సందు పై సుహాసిని స్ట్రాంగ్ కౌంటర్?

Suhasini: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియాస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుందంటేనే ఆ సినిమాపై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్.ఈ సినిమా నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ ఉమైర్ సందు ఇచ్చారు.. దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఈ సినిమా గురించి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.సినిమాలో హైలెట్ పాయింట్స్ ఇవే అంటూ సినిమా గురించి ఈయన తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని,సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్, విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని చెప్పారు.

ఈ సినిమా ద్వారా ఐశ్వర్యారాయ్ తిరిగి ఫామ్ లోకి వచ్చిందని చాలా ట్విస్టుల నడుమ ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి చేత క్లాప్స్ కొట్టించేలా ఉందంటూ ఈ సినిమా గురించి ఈయన పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కాకుండానే ఈయన రివ్యూ ఇవ్వడంతో మణిరత్నం భార్య నటి సుహాసిని అసలు నువ్వు ఎవరు? విడుదల కాని సినిమాని మీరు ఎలా చూశారు అంటూ ఈమె కౌంటర్ వేశారు.

Suhasini: రివ్యూయర్ పై మండిపడిన సుహాసిని..

ఈ విధంగా సుహాసిని ఉమైర్ సందు ట్వీట్ కి రిప్లై ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ అంటే ఈయన సినిమా చూడకుండానే ఫేక్ రివ్యూ ఇస్తున్నారా అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఆయన దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు ఆయన సినిమా చూసే అవకాశం ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి సుహాసిని ఈ సినిమాకి ఇచ్చిన రివ్యూ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.