Movie News

తనకు లైఫ్ ఇచ్చింది కూడా ఆ దర్శకులే.. హీరో సందీప్ కిషన్..

సన్నీ నవీన్‌, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్‌ బండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్‌’. ఎస్ ఒరిజినల్స్, ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్‌ కొండెపు, సృజన్‌ యారబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కథానాయకుడు సందీప్‌కిషన్‌, దర్శకులు బుచ్చిబాబు సానా, కిషోర్‌, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కు బెస్ట్ విషేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జయకిషోర్ మాట్లాడుతూ.. తన సినిమా కొవిడ్‌ కారణంగా ఆలస్యం కాలేదని.. ఒక సాంకేతిక నిపుణుడి దగ్గర ఎనిమిది నెలలు ఆగిపోయిందని.. ప్రస్తుతం అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.

మధురానుభూతుల్ని పంచుతూ, అందరినీ మెప్పిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ చిత్ర బృందమంతా షార్ట్ ఫిల్మ్‌ల నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ”అని తెలిపారు.

తనకు హీరోగా లైఫ్ ఇచ్చింది కూడా షార్ట్ ఫిల్మ్ దర్శకులే.. ఈ సినిమ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక తాను హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇది అంటూ సన్నీ పేర్కొన్నాడు. ఇతకు ముందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

2 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

2 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

2 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

3 weeks ago

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్! ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం – కారణాలు చూసి షాక్ అవుతారు

ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…

3 weeks ago