సినిమాలలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్స్ కి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు కామెడీ ద్వారా కూడా ప్రజలను ఆకట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి. అందుకే సినిమాలలో కమెడియన్స్ కదా అంటూ మనం వారిని ఏమాత్రం చులకన చేయకూడదు. ఎందుకంటే కమెడియన్స్ సంవత్సరం పొడవునా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతూనే ఉంటారు. కానీ హీరో హీరోయిన్లు ఏడాదికి ఒక్క సినిమా తీసిన వారు సంపాదించిన దానికి రెట్టింపుగా వీరు కూడా సంపాదిస్తారని చెప్పవచ్చు.
ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ ఉన్నారు. అయితే ఈ స్టార్ కమెడియన్ ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొంటే రోజుకు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏ కమెడియన్ రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయానికి వస్తే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెన్నెలకిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒక రోజు సెట్లోకి అడుగు పెడితే 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం రోజుకు 3 లక్షలు తీసుకోగా, అలీ 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ రోజుకు 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
కమెడియన్ సప్తగిరి కామెడీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా మొత్తం ఎంతో హాస్యాస్పద భరితంగా ఉంటుందని చెప్పవచ్చు.మరి ఒక రోజు సప్తగిరి సెట్ లో అడుగు పెడితే 2లక్షల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తారట. పోసాని 2.5 ఐదు లక్షలు తీసుకోగా, రాహుల్ రామకృష్ణ 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ రోజుకు 2 లక్షల పారితోషికం తీసుకోగా, కమెడియన్ ప్రియదర్శి రోజుకు 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతేకమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రతి రోజుకు 2 లక్షల వరకు చార్జి చేస్తుంటారని సమాచారం.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…