పుష్ప చాలా అంచనాల మధ్య నిన్నినే విడుదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ వచ్చి భారీ మాస్ మసాల మూవీ. రంగస్థలం సక్సెస్ తరువాత సుకుమార్, అల వైకుంఠపురం తరువాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే మూవీ రిలీజ్ కు ముందే సినిమా బిజినెస్ కూడా బాగా నడిచింది.
అయితే పుష్ఫ అనుకున్నంత అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అంటోంది. ముఖ్యంగా చాలా వైవిధ్యంగా ఉంటుందనుకున్న సునీల్ మంగళం శ్రీను పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఎంత శ్రద్ద పెట్టి క్యారెక్టర్ చేసినా.. సునీల్ విలనీజంలో కామెడి తాలూకు ఛాయలే కనిపించాయని సగటు ఆడియన్స్ అనుకుంటున్నారు. విలన్ అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ కు.. చాలా రోజుల తరువాత పుష్ఫ సినిమాలో పర్పెక్ట్ క్యారెక్టర్ పడిందనుకున్నారు జనాలు.
అయితే సినిమాలో చూస్తే సునీల్ క్యారెక్టరైజేషన్ తేలిపోయింది. ముందుగా కమెడియన్ గా ఉన్న సునీల్ ను విలన్ పాత్రలో ఊహించుకోలేకపోయారు ప్రేక్షకులు. ఇక్కడే ముందుగా సునీల్ విలనిజంపై దెబ్బపడింది. సుకుమార్ మాత్రం మంగళం శ్రీను పాత్రకు సునీల్ కరెక్ట్ అనుకున్నప్పటికీ సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాల్లో కమెడియన్ కనిపించాడని అంటున్నారు. సునీల్ ను క్రూరమైన విలన్ గా చూపిద్దాం అని అనుకున్నా… సినిమాలో ఆరేంజ్ లో సునీల్ క్యారెక్టర్ లేదని తెలుస్తోంది.
ముఖ్యంగా ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా పుష్ప రాజ్ ను చేసినప్పుడు.. మంగళం శ్రీను తన బావమరిది శవం పెట్టె మీదే తను ఉన్నాడని తెలిసినప్పడు.. సునీల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ తనలో విలన్ కన్నా కమెడియన్ నే ఎక్కువగా చూపించాయని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు. ఇంతకుముందు కలర్ ఫోటో సినిమాలో సునీల్ ను విలన్ గా చూపించినప్పుడు.. విలన్ క్యారెక్టర్ కు బాగా న్యాయం చేశాడని ఆడియన్స్ అనుకున్నారు. అయితే మంగళం శ్రీను పాత్రలో మాత్రం సునీల్ విఫలమయ్యాడని తెలుస్తోంది. అనవసరంగా సునీల్ ఈ పాత్రను చేసి బ్లేమ్ అయ్యాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…