Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఇదివరకే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన సన్నివేశాన్ని విడుదల చేశారు. ఇక ఈ సన్నివేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు ఎంతో అద్భుతమైన ఈ సీన్స్ డిలీట్ చేయకుండా ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారో తెలియదు కానీ ఇది కనుక సినిమాలో ఉంటే సినిమాకి మరింత హైప్ క్రియేట్ అయ్యేదని పలువురు భావిస్తున్నారు.
ఈ సినిమాలో డిలీట్ చేసిన సన్నివేశంలో పుష్ప తల్లి ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటుంది. అతను వచ్చి అప్పు తిరిగి చెల్లించాలని అందరి ముందు అవమాన పరుస్తారు. ఈ క్రమంలోనే తన కొడుకు మాట వినడం లేదని తన తల్లి బిడ్డ మాట వినదు.. ఈ గొడ్డు మాటవినదు అంటూ తిడుతుంది. ఇక ఆ అప్పు తీర్చడం కోసం పుష్ప ఆ బర్రెను అమ్మి తనకు అప్పు చెల్లిస్తాడు. ఊరందరి ముందు తనని అప్పు అడుగుతూ వారిని అవమానపరిచిన ఈ విధంగా వారందరికీ తన అప్పులు తీర్చినట్టు తెలిసేలా తనని కొట్టుకుంటూ ఊరంతా తిప్పుతాడు. ప్రస్తుతం ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…