Super Star Krishna: నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.ఇలా ఈయన మరణించారనే వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. గుండెపోటు రావడంతో ఈయనని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ కృష్ణ మరణించారు. ఇక ఈయన మరణం గురించి కాంటినెంటల్ వైద్యుడు గురు ఎన్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మరణించడానికి గల కారణాలను తెలియజేశారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు అప్పటికే ఆయన స్పృహ లేకుండా పడిపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు కష్టపడి సిపిఆర్ చేసి ఆయనని స్పృహలోకి తీసుకు వచ్చాము. అయితే అప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని గురు ఎన్ రెడ్డి తెలిపారు.
ఇలా స్పృహలోకి వచ్చిన ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించామని అయితే గంట గంట ఆయన పరిస్థితి విషమంగా మారిందని తెలిపారు.ఇలా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ ఆయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడంతో ఆయనకు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ కూడా చేశామని డాక్టర్ వెల్లడించారు. అయితే గడిచే కొద్ది ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స అందించిన ఫలితం ఉండదని భావించి ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేశాము.
ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చనీ కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వచ్చాము. ఇక అతనికి చికిత్స అందించిన ప్రయోజనం లేదని భావించి చివరి క్షణాలలో తనని ఇబ్బంది పెట్టకూడదనీ భావించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇక ఈయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడమే కాకుండా బ్రెయిన్ లో డామేజ్ కూడా ఉండడంతో ఈయన పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని కృష్ణ మరణం గురించి కాంటినెంటల్ వైద్యుడు మీడియా సమావేశంలో తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…