Surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం తన కూతురు సుప్రీతతో కలిసి జీవిస్తున్నారు. తనని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సురేష్ తేజ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే తన భర్త మృతి చెందినప్పటి నుంచి సురేఖ తన కూతురే జీవితముగా బతుకుతుంది. ఈ క్రమంలోనే ఈ తల్లీ కూతుళ్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.
తరచూ హాలిడే వెకేషన్ వెళ్లడం అలాగే పొట్టి దుస్తులు ధరిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న వీరిద్దరూ తాజాగా యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా నిఖిల్ సురేఖవానికి సంబంధించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.
ఈ క్రమంలోనే సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రశ్నించగా వెంటనే సురేఖవాణి నో అనే బోర్డు చూపించారు. కానీ సుప్రీత మాత్రం ఎస్ అనే బోర్డు చూపించారు. ఇలా ఆ బోర్డు చూపించిన సుప్రీత చేసేద్దాం ఒంటరిగా ఉండి నా బుర్ర తింటుంది అంటూ సమాధానం చెప్పడం ఆసక్తికరంగా మారింది.అయితే సురేఖ వాణి ఈ విషయంపై స్పందిస్తూ అది తన అభిప్రాయమే నాకైతే ఎలాంటి ఉద్దేశం లేదని తెలిపారు.
ఈ విషయం గురించి సురేఖవాణి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు రెండో పెళ్లి చేసుకోవాలని ఎలాంటి ఉద్దేశం లేదని భవిష్యత్తులో చెప్పలేమంటూ సమాధానం చెప్పారు దీన్ని బట్టి చూస్తుంటే సురేఖవాణి ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజులకైనా తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా సుప్రీత తన తల్లికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమైంది.
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! - పురాణపండ శ్రీనివాస్ మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి!వేల…
తెలుగు, తమిళ సినీ ప్రపంచంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ జీవితం…
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్…
తెలుగు సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జేడీ చక్రవర్తి మరోసారి తన వ్యాఖ్యలతో…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల సమయంలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు…