Vigilante Justice in Odisha? Survivors of Sexual Assault Kill Accused, Burn Remains
60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి, దారుణాలకు ఒడిగట్టాడు. నాలుగేళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. కృష్ణారామా అంటూ భక్తి మార్గంలో నడవాల్సింది పోయి, కామ కోరికలతో విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఊళ్లో ఎవరైనా అమాయక మహిళలు కనిపిస్తే చాలు, వారిని వేధించడం, లైంగికంగా అనుభవించడం అతనికి సరదాగా మారిపోయింది.
ఇలాంటి కామాంధుడిని మట్టిలో కలిపేయాలని ఆరుగురు బాధితులు నిర్ణయించుకున్నారు. తమలాగే మరికొంతమంది బాధితులు కూడా ఉండటంతో వారందరూ కలిసి నేరుగా ఆ దుర్మార్గుడి ఇంటికి వెళ్లారు. అతనికి బుద్ధి వచ్చేలా చితకబాదారు. అంతేకాదు, బతికుండగానే తగలబెట్టేసి తమ కళ్లారా చూశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో జరిగింది. 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న అతడు కామాంధుడిగా మారాడు. ఊళ్లో ఏ మహిళ కనిపిస్తే ఆమెపై కన్నేసి, ఎలాగైనా అనుభవించాలని అనుకునేవాడు. ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చాలు, వారి దగ్గర తన కామరూపాన్ని చూపించేవాడు. ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా తాకేవాడు. అర్ధరాత్రిళ్లు ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారని తెలిస్తే చాలు, అక్కడికి వెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఐదుగురు మహిళలను అనుభవించాడు. పరువు పోతుందని భయపడి బాధితులు తమ బాధను లోలోపలే దిగమింగుకున్నారు.
జూన్ 3వ తేదీన 52 ఏళ్ల ఓ వివాహితపై కూడా ఈ కామ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం మిగతా బాధితులకు తెలియడంతో అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారం నిందితుడి ఇంటికి వెళ్లి అతడిపై దాడి చేశారు. దేహమంతా చితకబాదారు. ఆ తర్వాత తమ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి అతడిని తీసుకెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు.
అయితే, ఆ వృద్ధుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. విచారణలో బాధితురాళ్లు నిజం చెప్పేశారు. హత్య చేసిన ఆరుగురు మహిళలతోపాటు వారికి సహకరించిన మరో ఇద్దరు మహిళలు, పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళలు తమపై జరిగిన అన్యాయానికి ఎలా తిరగబడ్డారో ఈ ఘటన తెలియజేస్తుంది.
ఈ కథనం సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వాటి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని తెలియజేస్తుంది. చట్టం తన పని తాను చేసినప్పటికీ, బాధితులు సొంతంగా న్యాయం కోసం ఎలా పోరాడుతున్నారో ఇది చూపిస్తుంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…