Featured

Taapsee: మరో వివాదంలో నటి తాప్సీ… కేసు నమోదు చేసిన పోలీసులు… ఏం జరిగిందంటే?

Published

on

Taapsee: ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి తాప్సీ పలు తెలుగు సినిమాలలో నటించి పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉండటమే కాకుండా, నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.

ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి తాప్సి ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.ఈమె నటించిన గత రెండు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఫోటోగ్రాఫర్లపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వివాదాలలో చిక్కుకున్నారు.అయితే తాజాగా ఈమె మరో వివాదంలో చిక్కుకున్నారు ఈసారి ఏకంగా ఈమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

మార్చి 12వ తేదీ ముంబైలో జరిగిన లాక్ మి ఫ్యాషన్ వీక్ 2023 షోలో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువుల ఆరాధించే లక్ష్మీదేవి లాకెట్ ధరించారు అయితే ఇదే విషయమే పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నటువంటి తాప్సి వేసుకున్న డ్రెస్ కారణంగా పెద్ద ఎత్తున ట్రోలింగుకు గురయ్యారు.

Advertisement

ఈమె లో దుస్తులు ధరించకుండా ఏద అందాలను ఆరబోస్తూ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఇలా ఈమె అభ్యంతర కరమైన దుస్తులను ధరించి లక్ష్మీ లాకెట్ ఉన్నటువంటి దండ వేసుకోవడంతో పలువురు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీసేలా తమని కించపరిచే విధంగా ఈమె ఈ హారం ధరించారు అంటూ మండిపడుతున్నారు.


Taapsee: హిందూ మనోభావాలను దెబ్బతీశారు…

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీపై కేసు నమోదు చేశారు. ఇలాంటి దుస్తులు ధరించి లక్ష్మి హారం వేసుకోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈమెపై ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలిని తనయుడు ఏకలవ్య గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయంపై తాప్సి ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Trending

Exit mobile version