Tag Archives: acharya

Chiranjeevi: చిరంజీవి బ్యాడ్ సెంటిమెంట్ బ్రహ్మాస్త్రను కూడా వదలదా… ఆందోళనలో అభిమానులు!

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో చిరంజీవికి మెగాస్టార్ అనే పేరు వచ్చింది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించడం వల్ల కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. రాజకీయాలు తనకి వర్క్ అవుట్ అవ్వని గ్రహించి మళ్లీ హీరోగా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరోకి సంబంధించిన సినిమా కార్యక్రమాలకు వేరే హీరోలు అతిధులుగా వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా ఇటీవల ఎన్నో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే చిరంజీవి హాజరైన ఆ సినిమాలు అన్ని అనుకోకుండా ఫ్లాప్ అయ్యాయి. దీంతో చిరంజీవిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు గెస్ట్ గా వెళ్లారు. ఎందుకంటే ఈ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి తాను నటించిన ఆచార్య సినిమాకి కూడా నిర్మాతగా ఉండటంవల్ల చిరంజీవి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు.

అయితే తాప్సీ నటించిన ఆ సినిమా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చిరంజీవి అతిథిగా హాజరయ్యాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకి తెలుగులో సమర్పకులుగా చిరంజీవి వ్యవహరించారు. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. ఇక ఇటీవల ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి సందడి చేశాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

Chiranjeevi: వాయిస్ ఓవర్ ఇస్తేనే ఫ్లాప్ అవుతుందా…..

ఇలా ఈ సంవత్సరంలో చిరు అతిథిగా హాజరైన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో చిరంజీవిని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి కూడా చిరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అందువల్ల ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందని సోషల్ మీడియాలో కొందరు నేటిజన్స్ చిరంజీవిని ట్రోల్ మరి కొందరు మాత్రం సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా హిట్ కానీ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల ప్లాప్ అవుతుందని లేదు అంటూ చిరుని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

Acharya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ. రచయితగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈయన సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల అనంతరం శ్రీమంతుడు జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకొని అపజయం ఎరుగని దర్శకుడు గా పేరు సంపాదించుకున్నారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆచార్య. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్ వద్ద విడుదల అయ్యి మొదటి షో తోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు సైతం కోట్లల్లో డబ్బులు ఖర్చు చేసి సినిమాని కొనుగోలు చేశారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈసినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు పెద్దఎత్తున నష్టపోయారు. ఈ విధంగా నష్టపోయిన వారికి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేశారని తెలుస్తోంది. ఇకపోతే వీరందరిలో కెల్లా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను అధిక మొత్తంలో డబ్బును నష్టపోయినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కొరటాల…

ఇలా వరంగల్ శీను ఆచార్య సినిమాని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి కోట్ల రూపాయల నష్టపోవడంతో కొరటాల శివ ముందుకు వచ్చి వరంగల్ శీనుకి ఏకంగా 14 కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30సినిమా మొదలు పెట్టడానికి ముందే ఇదంతా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వరంగల్ శీనుకి 14 కోట్ల రూపాయలను రిటర్న్ చేశారట. ఏది ఏమైనా ఇండస్ట్రీలో అపజయమే తెలియని కొరటాల శివకు ఆచార్య సినిమా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురి చేయడంతో ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi: వీఎఫ్ఎక్స్‌ తో చిరంజీవిని దారుణంగా చూపించారు.. చిరంజీవి లుక్స్ పై మండి పడుతున్న అభిమానులు!

Chiranjeevi:కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం, అలాగే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు కొంతమేర నిరాశ కలిగించిందని చెప్పాలి. ఈ సినిమా చూసిన అభిమానులు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు పర్వాలేదని కామెంట్ చేస్తున్నప్పటికీ మరికొందరు రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే పూజా హెగ్డే ఐరన్ లెగ్ అంటూ తనపై కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ సినిమా కాస్త నిరాశ పరిచిందని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన ఒక సన్నివేశం లీక్ అయింది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఎలా కలుసుకున్నారనే విషయాన్ని చూపించారు.ఇందులో రామ్ చరణ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని యవ్వనంగా చూపించే ప్రయత్నం చేశారు.

అక్కడ చిరంజీవి కానేకాదు…


మెగాస్టార్ చిరంజీవి ఇలా చూపించడం కోసం దర్శకుడు
వీఎఫ్ఎక్స్‌ ఉపయోగించారు. ఇలా వీఎఫ్ఎక్స్‌ ఉపయోగించడం వల్ల మెగాస్టార్ చిరంజీవి మొహం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. చిరంజీవి మామూలుగానే పెద్ద వయసు ఉన్నట్టు కనిపించదు అలాంటి అతనికి ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ వాడటం వల్ల మెగా అభిమానులు దర్శకుడు కొరటాల శివ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే అక్కడ చిరంజీవి కాదు,ఆయన డూప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Acharya: భారీగా ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్… బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?

Acharya: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రేపు (ఏప్రిల్ 29) ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.

ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే థియేటర్ల దగ్గర మెగా అభిమానుల సందడి నెలకొంది.ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటించడం ఈ సినిమాని చూడటం కోసం మరి కొన్ని గంటలు మాత్రమే వేచి ఉండాలి.

ఇక ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ప్రాంతాల వారిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందంటే.. నైజాం 38 కోట్లు, సీడెడ్ 18.50, ఉత్తరాంధ్ర 13, ఈస్ట్ 9.5 కోట్లు, వెస్ట్7.20, గుంటూరు 9 కోట్లు, కృష్ణ 8 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలు 107.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మొత్తం వరల్డ్ వైడ్ ఆచార్య సినిమా 131.20 కోట్ల బిజినెస్ జరుపుతున్నట్లు సమాచారం.

ఆందోళనలో అభిమానులు…

ఈ విధంగా వరల్డ్ వైడ్ 131.20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 132.50 కోట్లు కలెక్ట్‌ చేయాల్సి ఉంటుంది.ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా నటించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇలా ఒక వైపు సినిమా హిట్టవుతుందనే నమ్మకం మెగా అభిమానులలో ఉన్నప్పటికీ మరోవైపు రాజమౌళి సెంటిమెంట్ మెగా అభిమానులకు కొంత ఆందోళన కలిగిస్తుంది. మరి రామ్ చరణ్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Acharya-Chiranjeevi: వివాదంలో ఆచార్య స్పెషల్ సాంగ్..పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు..!

Acharya-Chiranjeevi: మెగస్టార్ చిరంజీవి.. తన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మళ్లీ ఫుల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంతలా అంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా..రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలకు సైన్ లు చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినిమా ఆచార్య.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా.. అనూహ్యంగా ఓ ఘటన చోటు చేసుకుంది. వాళ్లు ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులతో చిక్కుకున్నారు. గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై జనగామకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు ఫిర్యాదు చేశారు.

ఎందుకంటే.. ఇటీవల ఆచార్య సినిమాలోని ఓ ఐటెం సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో చిరంజీవి సరనన ఆడిపాడిన మద్దుగుమ్మ రెజీనా. ఈ సాంగ్ పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టింది.
ఆ పాటలో ఆర్ఎంపీ వైద్య సంఘాన్ని కించపరిచేవిధంగా పదాలు ఉన్నాయని.. వాటిని చెడుగా చూపించే ప్రయత్నం చేశారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కావాలనే మనోభావాలను దెబ్బతీస్తున్నారు..

ఇందులో… “యాదేదో నీమరొచ్చనీ కుర్రాళ్లే RMP లు అవుతున్నారే” అనే సాహిత్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ లైన్ వివాదానికి దారి తీసింది. ఈ లైన్‌లను తప్పుగా పేర్కొని.. వాటిని కావాలనే ఇలా చూపించారని ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ లిరిక్స్ ఉన్నాయని.. రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. ఆచార్య చిత్ర నిర్మాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరి దీనిపై ఆచార్య మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏమైనా వివిరణ ఇస్తారా.. లేదా.. పాటలో ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి. ఆచార్యకి మణి శర్మ సంగీతం అందించగా.. సానా కష్టం పాటను రేవంత్ , గీతా మాధురి ఆలపించారు. చిరంజీవి, రామ్ చరణ్‌లను తొలిసారిగా పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నారు.

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

Acharya: చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ’ఆచార్య‘ కొరటాల శివ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. చిరంజీవితో పాటు మరో క్యారెక్టర్ లో రామ్ చరణ్ తేజ్ నటిస్తుండటంతో భారీ క్రేజ్ నెలకొంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా… చెర్రీ పక్కన పూజా హెగ్డే నటిస్తున్నారు. 

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

2022 ఫిబ్రవరి 4న ఆచార్య సినిమా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ సిద్దమవుతోంది. సైరా తరువాత చిరంజీవి తీస్తున్న సినిమా కావడంతో ఇందులో కమర్షియల్ అంశాలు తగ్గకుండా… దర్శకుడు కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు కొరటాల శివకు కూడా వాటా ఉందని తెలుస్తోంది.

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

దీంతో కొరటాల శివ దగ్గరుండీ మరీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారట. సినిమాకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను కొరటాల శివే తనపై వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆచార్య సినిమాకు నష్టాలు వస్తే కొరటాల శివ చేతి నుంచి ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్.. మరీ ఈ సినిమా….

అయితే ఇప్పటి వరకు కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ వద్ద దమ్మురేపాయి. తీసిన అన్ని సినిమాలు కూడా పెద్ద హిట్లను సాధించాయి. ప్రస్తుతం ఈ అంశమే కొరటాల శివకు సానుకూలంగా మారనుంది. మెగాస్టార్ ఇమేజ్, కొరటాల ట్రాక్ రికార్డ్ ఆచార్య సినిమాకు ప్లస్ కానున్నాయి. దీంతో సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయనేది వాస్తవం. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రం కలెక్షన్లు దుమ్మురేపుతాయి. ఏది ఏమైనా కొరటాల శివ ఖాతాలో మరో హిట్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

ఆచార్యలో రామ్ చరణ్ ఎన్ని నిమిషాల వరకు ఉంటాడు.. దీనిపై క్లారిటీ వచ్చేసింది!

‘ఆచార్య’ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. దీనిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారని తెలిసింది. చరణ్ ‘సిద్ధ’ పాత్రలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే సిద్ధ పాత్రకు సంబంధించి టీజర్ విడుదలైన విషయం విధితమే. టీజర్ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 6.8 మిలియన్ల వీక్షణలను సాధించింది.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీలపై నిరంజన్‌రెడ్డి , రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ‘ఆచార్య’లో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంత..? ఇది అతిథి పాత్రనా లేదా పూర్తి స్థాయి పాత్రా..? ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతడి పాత్ర ఇందులో దాదాపు 45 నిమిషాల వరకు ఉంటుందట.

మొదటి హాఫ్ లో 5 నిమిషాలు.. సెకండాఫ్ లో 40 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ చరణ్‌కి మొదట్లో గెస్ట్ రోల్ మాత్రమే రాశాడట. తర్వాత అతడి నిడివిని పెంచే అవసరం ఏర్పడగా.. 2020లో మళ్లీ కొత్తగా కథను రీ రైట్ చేశారట. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాలో చిరు-చరణ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అభిమానులకు కనువిందు చేస్తాయని అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చివర్లో తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

చిరంజీవికి పోటీగా రంగంలోకి దిగిన సూర్య.. గెలుపెవరిది?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తి అయ్యింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పోటీగా ఎవరు రంగంలోకి దిగటం లేదు.

కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు పోటీగా తమిళ హీరో సూర్య తన సినిమాని ఆచార్యకు పోటీగా పెడుతున్నారు. సూర్య ప్రస్తుతం దర్శకుడు పాండీరాజ్ తో ఎతరక్కుమ్ తునిందవన్ ఆ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీగానే అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫిక్స్ చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా విడుదల రోజునే మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల కానుంది. రెండు మంచి సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండటంతో పోటీ కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో తాజాగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు పోటీగా వెళ్లడం లేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా సూర్య సినిమా పోటీకి రావడం అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

నటుడిగా ఇండస్ట్రీలోకి కాజల్ భర్త..ఇదేం ట్విస్ట్..!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత యేడాది ఈమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయినప్పటికీ ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గకుండా అదే రీతిలో సినిమాలు కొనసాగిస్తోంది. పెళ్లి తర్వాత కూడా అదే జోష్ తో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఆచార్య సినిమాలో నటిస్తూనే మరో రెండు మూడు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ కు సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. కాజల్ కూడా తన భర్తని ఒక నటుడిగా మార్చాలని తాపత్రయపడుతోందట. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలకు గౌతమ్ విషయంలో కాజల్ పలు కండీషన్లు పెడుతున్నట్టుగా సమాచారం. అవి విని దర్శకనిర్మాతలు కూడా ఆశ్చర్య పోతున్నారట.

ఇటీవలే మొదటి యానివర్సరీ జరుపుకున్న కాజల్,గౌతమ్ వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే భర్త విషయంలో కాజల్ అన్నీ తానే ప్రవర్తిస్తున్నారట. అంతే కాకుండా గౌతమ్ వ్యాపార సంస్థల ఉత్పత్తులకు ప్రచారకర్తగా కాజల్ వ్యవహరిస్తున్నారు. అలాగే సినిమాలో కాజల్ తో పాటు తన భర్త గౌతమ్ కి కూడా ఏదో ఒక ప్రాధాన్యం ఉన్న పాత్రను ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట.

చిన్న పాత్ర అయినా కూడా పర్వాలేదు. కీలకంగా ఉంటే చాలు అన్నట్లు తెలుస్తోంది.గౌతమ్ కి కూడా ఒకసారి స్క్రీన్ పై కనిపించాలనే ఉందని భర్త కోరడంతో కాజల్ ఇదంతా చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే కాజల్ భర్త ఎంట్రీ ఇస్తే అతడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుందేమో చూడాలి మరి.

మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫోటోలు వైరల్!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే పేరు మార్మోగిపోతోంది. వరుస హిట్లను అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ ఉంది. ఇటీవలే ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అలాగే ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈమె చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే షూటింగులకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆ విరామ సమయాన్ని ఆస్వాదించే పనిలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే పూజా హెగ్డే మాల్దీవుల పర్యటనకు పయనమైంది. ఇక ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలతో పాటు విమానంలో పయనిస్తున్న వీడియోలతో సహా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది .

ఈ సందర్భంగా పూజ విరామం తీసుకునే సమయం ఇది..ఆ తరువాత ఏంటో చూడండి అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. ఇక మాల్దీవుల దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల సమీపంకు రాగానే విమానం నుంచి మాల్దీవుల ప్రాంతాన్ని స్టన్నింగ్ వీడియో ని సైతం ఆమె పంచుకుంది.

ఒకవైపు అక్కడ ఉన్న వేకెషన్స్ ను ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు, అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలను ప్రతిక్షణం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులకు కూడా కనువిందు చేస్తోంది. ఈ వెకేషన్ పూర్తి అయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలుగు, తమిళ ప్రాజెక్టులను తిరిగి స్టార్ట్ చేయనుందని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. ఇలా పూజా హెగ్డే తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్లో దూసుకుపోతోంది.