ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే పేరు మార్మోగిపోతోంది. వరుస హిట్లను అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బుట్ట బొమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ ఉంది. ఇటీవలే ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అలాగే ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈమె చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే షూటింగులకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆ విరామ సమయాన్ని ఆస్వాదించే పనిలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే పూజా హెగ్డే మాల్దీవుల పర్యటనకు పయనమైంది. ఇక ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలతో పాటు విమానంలో పయనిస్తున్న వీడియోలతో సహా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది .
ఈ సందర్భంగా పూజ విరామం తీసుకునే సమయం ఇది..ఆ తరువాత ఏంటో చూడండి అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. ఇక మాల్దీవుల దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల సమీపంకు రాగానే విమానం నుంచి మాల్దీవుల ప్రాంతాన్ని స్టన్నింగ్ వీడియో ని సైతం ఆమె పంచుకుంది.
ఒకవైపు అక్కడ ఉన్న వేకెషన్స్ ను ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు, అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలను ప్రతిక్షణం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులకు కూడా కనువిందు చేస్తోంది. ఈ వెకేషన్ పూర్తి అయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలుగు, తమిళ ప్రాజెక్టులను తిరిగి స్టార్ట్ చేయనుందని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. ఇలా పూజా హెగ్డే తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్లో దూసుకుపోతోంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…