Tag Archives: anasuya bharadwaj

Anchor Anasuya: నన్నూ అలా చూసినా కూడా నో ప్రాబ్లెమ్…అనసూయ కామెంట్స్ వైరల్!

Anchor Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎల్లప్పుడూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందంతో కుర్రాళ్ళని కట్టిపడేస్తోంది.

ఇలా కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో అనసూయ చేసే గ్లామర్ షో కి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అనసూయ అలా తనని విమర్శించే వారి మీద మండిపడుతూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. మొత్తానికి సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే ఫోటోలు వీడియోలు నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఫొటోలను షేర్ చేస్తూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా అనసూయ స్లీవ్ లెస్ బ్లౌజ్,చీర కట్టుతో మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతూ ఫోటోలు షేర్ చేసింది. అంతే కాకుండా ” ఏ విషయమైనా అనసూయ అస్సలు సైలెంట్ గా ఉండదు. నోరు అదుపులో పెట్టుకోదు అంటుంటారు. అది నాకు నో ప్రాబ్లెమ్.. పైగా నన్ను అలా అంటే చాలా గర్వంగా ఉంటుంది ” అని ఈ ఫోటోలకు ట్యాగ్ లైన్ జత చేసింది .

Anchor Anasuya:గర్వంగా ఉంటుంది…

ఇలా ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈ అమ్మడి మోడ్రన్ సారీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజెన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ నటన మీద ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Anasuya: సెలబ్రిటీలు అయితే మేము మనుషులం కాదా… అనసూయ కామెంట్స్ వైరల్!

Anasuya: జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ వెండితెర రంగమ్మత్తగా అదే స్థాయిలో ఆదరణ అందుకున్నారు. ఇలా వెండితెరపై ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా రంగ మార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఈమె సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలోనే కొందరు పుష్ప 2 సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడగగా తాను ఇంకా షూటింగ్ లోకేషన్ లోకి అడుగు పెట్టలేదని సమాధానం చెప్పారు.మరొక నేటిజన్ ప్రశ్నిస్తూ అభిమానులు అడిగితే మీరు ఎందుకు వారితో కలిసి ఫోటోలు దిగరు వారి వల్లే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Anasuya: చాలామందితో ఫోటోలు దిగాను…

మనుషులన్న తర్వాత కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రిటీలైనంత మాత్రాన మేము మనుషులం కాదనుకుంటే ఎలా?నేను చాలామందితో ఫోటోలు దిగాను మీతో దిగలేదని ఇలా జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు. ఇలా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: ఆ ఎయిర్ లైన్స్ సమస్థ పై మండిపడిన అనసూయ… అసలేం జరిగిందంటే?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ అనంతరం రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై ఈమె నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం వెండితెరకి పరిమితమయ్యారు.

ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. అయితే తనని ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం వారికి తన స్థాయిలో వార్నింగ్ ఇస్తూ అనసూయ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.

ఇలా ఏ విషయం అయినా సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకునే అనసూయ తాజాగా ఒక ఎయిర్ లైన్ సంస్థ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండిగో విమానయాన సంస్థ పై , సిబ్బంది వ్యవహార శైలిపై అనసూయ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


Anchor Anasuya:నాణ్యత లేని సేవలు…

నేను ఇండిగో ఎయిర్ లైన్స్ ను ద్వేషిస్తున్నాను. ఇక్కడ దేశీయ ఎయిర్ లైన్స్ వారు ఆధిపత్యం చెలాయించడం విచారకరం. అసలు నాణ్యతలేని సేవలు అంటూ ఈమె విమానయాల సంస్థపై అలాగే సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేశారు. అయితే ఈమె ఇలాంటి పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఏ విషయంలో ఈమె అసౌకర్యంగా ఫీల్ అయ్యారు అనేది మాత్రం వెల్లడించలేదు మరి ఈమె చేసినటువంటి పోస్టుకు ఇండిగో నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో తెలియాల్సి ఉంది.

Anasuya: థండర్ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయిన అనసూయ… వైరల్ అవుతున్న ఫోటోలు!

Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అనసూయ(Anasuya) ప్రస్తుతం బుల్లితెరకు దూరమైనప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో బిజీగా గడుపుతున్న అనసూయ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈమె థైస్‌ చూపెడుతూ రెచ్చిపోయి సందడి చేశారు. పొట్టి నికర్ ధరించి తన హాట్‌ థై ని ఫోల్డ్ చేస్తూ, బారున చాచుతూ ఉన్న వీడియోని షేర్‌ చేసింది. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఈమె ఒక విచిత్రమైన పోస్ట్ షేర్ చేశారు. థైస్‌ చూపిస్తూ ఇది లెగ్‌ డే అంటూ పోస్ట్ పెట్టడమే కాకుండా, జిమ్‌లో శ్రమిస్తుంటే చాలా బాధగా ఉందట. కానీ సెక్సీగా బూమరాంగ్‌ చేస్తూ కవర్‌ చేసుకుంటున్నా అని పేర్కొంది. 

ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ యదావిధిగా ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అనసూయ సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ అంటూ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. అయితే ఈ సెషన్ లో భాగంగా తిరిగి ఈమెకు ట్రోలర్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా అనసూయ ట్రోలర్స్ గురించి స్పందిస్తూ..

Anasuya:మోటివేట్ చేస్తాయి

నేను సాధారణంగా ట్రోల్స్ ను గుర్తించను. అవి నన్ను బాధిస్తే తప్ప. ట్రోలర్స్ కు నన్ను అణిచివేసే శక్తి లేదు.ట్రోల్స్ నన్ను మరింత దృఢంగా చేయడమే కాకుండా నటనపై మరింత ఆసక్తి కలిగించేలా చేస్తూ నన్ను మోటివేట్ చేస్తుంటాయి అంటూ ఈ సందర్భంగా ట్రోలర్స్ గురించి అనసూయ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anasuya: మేకప్ లేకుండా ఫోటో షేర్ చేసిన అనసూయ… అమ్మమ్మలా ఉన్నావంటూ నేటిజన్స్ కామెంట్!

Anasuya: బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మునపటి కంటే కాస్త తక్కువగానే యాక్టివ్ గా ఉన్నారని చెప్పాలి. ఒకప్పుడు పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిందని చెప్పాలి. అయితే తాజాగా ఈమె మేకప్ లేకుండా క్లోజప్ షాట్ లో ఒక ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోని ఈమె షేర్ చేస్తూ రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవల్‌ అంటూ క్యాప్షన్ పెట్టారు అలాగే ఈ ఫోటోకి నో ఫిల్టర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేస్తూ తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయారని చెప్పుకొచ్చారు అయితే ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి నెటిజన్స్ మేకప్ లేకపోయినా అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నేచురల్ బ్యూటీ అంటూ ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya: కాన్ఫిడెన్స్ లెవెల్…


ఇక మరికొందరు యధావిధిగా అనసూయని ఈ ఫోటోని ఉద్దేశిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మేకప్ లేకపోవడంతో చర్మంపై ఉన్నటువంటి ముడతలు అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అచ్చం అమ్మమ్మ లాగే ఉన్నావు అనసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.అయితే గత కొద్దిరోజుల క్రితమే తన గురించి వచ్చే ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవడంలేదని అంతకన్నా తనకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Anchor Anasuya: మరొకసారి ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ… రచ్చ మళ్లీ మొదలైంది గా..?

Anchor Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయ యాంకర్ గా ఎంత గుర్తింపు పొందిందో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసి పోస్టుల వల్ల కూడా అంతే పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టులకు నేటిజన్స్ నుండి అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అనసూయ మాత్రం వాటిని లెక్కచేయకుండా తనదైన శైలిలో తనని విమర్శించే వారి మీద విరుచుకుపడుతూ ఉంటుంది.

ఇలా ఆమె డ్రెస్సింగ్, ఫోటో షూట్స్ పై ట్రోల్‌ చేస్తూ రచ్చ చేయటమే కాకుండా ఆంటీ అంటూ ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఈ విషయమై అనసూయ కొందరిపై కేసులు కూడా పెట్టింది. అయితే వారికి శిక్ష పడిన విషయాన్ని అనసూయ ఇటీవలే పేర్కొంది. అంతే కాకుండా ఇకపై తాను అలాంటి వాటిపై స్పందించనని, అయితే తనని ట్రోల్ చేస్తే తాను ఏదైనా చేయగలననే సందేశం ట్రోలర్స్ కి రీచ్ అయితే చాలు అని తెలిపింది.

తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్రోలర్స్ మీద ఆంక్షలు విధించారు. మహిళలను కించపరిచేలా, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించారు. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లలో ట్రోలింగ్‌ చేసినా, ఫోటోలు మార్ఫింగ్‌ చేసినా కఠినమైన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అనసూయ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పోస్ట్ చేసింది.

శిక్షలు పడతాయి…

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ బుల్లితెరకు దూరమై ప్రస్తుతం వెండితెర మీద తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలతో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది.

Anasuya Bharadwaj: అలాంటి పనులు చేయలేక జబర్దస్త్ మానేశా… అనసూయ షాకింగ్ కామెంట్స్!

Anasuya Bharadwaj: బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో యాంకర్ గా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ఈ పాపులారిటీతో సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి అనసూయ ఏ ఇతర ఛానల్లోనూ ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించలేదు. అయితే తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడమే కాకుండా ఇతర బుల్లితెర చానల్స్ లో కూడా యాంకర్ గా ఎందుకు వ్యవహరించలేదో తెలియజేశారు.

సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల రేటింగ్స్ కోసం పెద్ద ఎత్తున నిర్వాహకులకు అవమానకర చెత్త టీఆర్పీ స్టెంట్స్ కు పాల్పడతారు.. టెలివిజన్ షోలలో ఇలాంటి వాతావరణం ఎప్పుడైతే ఉండదో తిరిగి అప్పుడే యాంకరింగ్ మొదలు పెడతానని ఈమె తెలియజేశారు. షో రేటింగ్ కోసం వారు చెప్పిన చెత్త పని చేయాల్సి ఉంటుందని ఈమె చెప్పకనే చెప్పేశారు.

Anasuya Bharadwaj: వెబ్ సిరీస్ సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ..

ఇలా వారు చెప్పే పనులన్నింటినీ తాను చేయలేక ఈ బుల్లితెర కార్యక్రమాల నుంచి తాను తప్పుకున్నానని ఈ సందర్భంగా అనసూయ పరోక్షంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.

Anchor Anasuya: మరోసారి నేటిజన్స్ పై ఫైర్ అయిన అనసూయ…. తమ్ముడు అంటూనే చెప్పు చూపించిన యాంకరమ్మ!

Anchor Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటారు. అయితే కొన్నిసార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.

ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులకు నెటిజన్స్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావటం వల్ల ఈమె తన గురించి వచ్చే వ్యతిరేకతపై స్పందిస్తూ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలా ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకున్న అనసూయ తాజాగా మరోసారి నెటిజన్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.ఈ క్రమంలోనే అనసూయ వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ ఫోటోకి చిన్న క్యాప్షన్ ఇచ్చారు.

నీతో లైఫ్ చాలా క్రేజీగా రోలర్ కోస్టర్ రైడర్‌లా ఉంటుందని రాసుకొచ్చింది. దీనికి వెంటనే ఓ నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. అలా ఏం లేదు అక్క. వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే… అంటూ కామెంట్ చేశాడు. ఇక అనసూయకు కోపం వచ్చింది. ఈ క్రమంలోని సదురు నేటిజన్ కి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది. అదేంట్రా తమ్ముడు అలా అనేసావ్ ఎంతుందేంటి డబ్బు అంటూ ప్రశ్నించారు.

Anchor Anasuya: బావను వాడు వీడు అనడం ఏంట్రా…


డబ్బు నా దగ్గర లేదా అయినా మీకు అన్ని తెలుసు కదా ఆయన డబ్బు వేరు నా డబ్బు వేరు అని ఎక్కడైనా ఉంటుందా… అయినా బావగారిని పట్టుకొని వాడు వీడు అనడం ఏంట్రా..అలా అనకూడదు ముందు చంపలేసుకో లేదంటే నేను వేయాల్సి వస్తుంది చెప్పుతో అదే చెంపలు అంటూ ఏకంగా సదరు నెటిజన్ ను చెప్పుతో కొడతా అంటూ ఈమె వార్నింగ్ ఇచ్చారు.ఇలా తమ్ముడు అంటూనే అనసూయ తీవ్రస్థాయిలో ఫైర్ అవడంతో ఇందుకు సంబంధించిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj: జబర్దస్త్ నుంచి తట్టుకోవడానికి వారిద్దరే కారణం… అసలు విషయం బయటపెట్టిన అనసూయ!

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఆ పాపులారిటీతో సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా గతంలో అనసూయ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాడీ షేమింగ్ జరుగుతోందని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గతంలో వెల్లడించారు.

తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాన్ని తెలియజేశారు.ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణం తన ఇద్దరు కుమారులేనని చెప్పేశారు.ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు వెండితెర సినిమాలతోను తాను బిజీగా గడుపుతూ తన సమయాన్ని పిల్లలకు కేటాయించలేకపోతున్నానని తెలిపారు.

Anasuya Bharadwaj: పిల్లలకు సమయం కేటాయించలేకపోవడమే కారణం…

ఇలా సినిమాలలో నటించడం వల్ల తనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే జబర్దస్త్ లో చేసిన మరికొంత ఆదాయం వస్తుంది కానీ పిల్లలతో కలిసి సమయం గడపడానికి కుదరకపోవటం వల్లే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి పూర్తిగా తప్పుకున్నాననీ ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anchor Anasuya: “వందే మాతరం” వివాదం.. నెటిజెన్ సలహాకు శివాలెత్తిన అనసూయ!

Anchor Anasuya: ఇటు బుల్లితెరపై అటు వెండితెర పై తన సత్తా చూపిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాల్లో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయపలు మార్లు దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ గురవుతుంటారు.

“వందే మాతరం” వివాదం.. నెటిజెన్ సలహాకు శివాలెత్తిన అనసూయ!

ఈ క్రమంలోనే నేడు గణతంత్ర దినోత్సవం కావడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా వందేమాతరం పాట పాడారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

“వందే మాతరం” వివాదం.. నెటిజెన్ సలహాకు శివాలెత్తిన అనసూయ!

ఈ నేపధ్యంలోనే ఒక నెటిజన్ స్పందిస్తూ మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్ అయితే నిలబడి పాడాల్సింది అంటూ ఓ నెటిజన్లు కామెంట్ చేస్తూ… మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అంటూ కామెంట్ చేశారు. ఇలా నెటిజన్ చేసిన కామెంట్ పై అనసూయ స్పందించారు.

బుర్ర అద్దెకు తెచ్చుకోండి…

ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ..లేచి నిలబడి పాడటానికి ఇది జాతీయ గీతం జనగణమన కాదు. జాతీయ గేయం వందేమాతరం అని తెలిపారు. వందేమాతరం గేయాన్ని బంకించంద్ర చటర్జీ రచించారు. నేను కూడా ఇండియన్ నాకు కూడా గౌరవం ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ.. మీలోల్లి ఏంటి.. నేషనల్ యాంతం అంటారు గాంధీ కాన్స్టిట్యూషన్ కి సంబంధం ఏంటి అంటారు మరి జనగణమన ఏంటి ఆగస్టు 15 1947 అయితే 26 జనవరి 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి అంటూ ఫైర్ అయ్యారు.