Tag Archives: anasuya bharadwaj

Anchor Anasuya: సెల్ఫీ అడిగితే ఫోన్ పగలగొట్టావంటగా..అంటూ అనసూయను ప్రశ్నించిన నెటిజన్.. అనసూయ రియాక్షన్ ఇదే!

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ అదే గుర్తింపుతో సినిమాలలో అవకాశాలు దక్కించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇలా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఈ యాంకరమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

Anchor Anasuya: సెల్ఫీ అడిగితే ఫోన్ పగలగొట్టావంటగా..అంటూ అనసూయను ప్రశ్నించిన నెటిజన్.. అనసూయ రియాక్షన్ ఇదే!

ఈ క్రమంలోనే అనుసూయ సోషల్ మీడియా వేదికగా తన భర్త భరద్వాజ్ తీసిన కొన్ని ఫోటోలను తన భర్త గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో అనసూయ క్యాజువల్ వేర్ ధరించి ఫోటోలకు హాట్ ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంది నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Anchor Anasuya: సెల్ఫీ అడిగితే ఫోన్ పగలగొట్టావంటగా..అంటూ అనసూయను ప్రశ్నించిన నెటిజన్.. అనసూయ రియాక్షన్ ఇదే!

ఇదిలా ఉండగా తాజాగా ఒక నెటిజన్ పాత లొల్లిని తీసుకొచ్చి మరోసారి అనసూయ ముందు ఉంచారు. ఏంటి సెల్ఫీ అడిగితే ఫోన్ పగలగొట్టారంటగా అంటూ అనసూయను ప్రశ్నించారు. దీంతో అనసూయ స్పందిస్తూ ఎవరు సార్ మీకి చెప్పింది అంటూ ప్రశ్నించారు. ఇంతలో ఆ నెటిజన్ స్పందిస్తూ..ఆ వీడియో మీకు పంపుతాను అందులో ఉన్న కార్ నెంబర్ కూడా మీదే ఇది ఫేక్ అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ తెలియజేశాడు.

కొందరు బ్రతకడం కోసం ఇలా చేస్తారు..

దీనికి స్పందించిన అనసూయ.. మీకు నాదో విన్నపం యూట్యూబ్ ఛానల్ లో వచ్చే వాటిని నమ్మకండి వారు బ్రతకడం కోసం ఏమైనా చేస్తారు… ఇలాంటి వాటిని చూసినప్పుడు మానవత్వం చచ్చిపోయిందనిపిస్తుంది.దయచేసి ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా ఉందాం నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే మరి కొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఇలా పాత వీడియోలను మళ్ళీ తవ్వుకోవడం కరెక్ట్ కాదని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

యాంకర్ అనసూయ ఇంట విషాదం.. తండ్రి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న అనసూయ!

యాంకర్ అనసూయ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ తండ్రి మధుసూదన రావు నేడు మృతి చెందడంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. అయితే ఈయన మరణానికి కారణం అతని అనారోగ్య సమస్య అని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి అనసూయ తండ్రి మధుసూదన రావు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అనసూయ తన తండ్రి మరణవార్త తెలియగానే కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో తన షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన ఈమె తార్నాక బయలుదేరారు. ఈ విషయం తెలిసిన పలువురు విచారం వ్యక్తం చేశారు.

గతంలో అనసూయ తన ప్రేమ గురించి చెబుతూ తనకి భరద్వాజ్ ప్రేమ వివాహానికి తన తండ్రి అడ్డు చెప్పారని ఈ క్రమంలోనే తన తల్లిదండ్రుల అనుమతి కోసం ఐదు సంవత్సరాల పాటు నిరీక్షించారని ఈమె గతంలో తన తండ్రి గురించి తెలిపారు.ఇలా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్నారు.

అనారోగ్యంతో మృతి చెందిన అనసూయ తండ్రి మధుసూదన రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అనసూయ తన తండ్రి భౌతికకాయాన్ని సందర్శించనున్నారు.

డబ్బింగ్ పనుల బిజీలో అనసూయ.. ‘ఫ్లాష్ బ్యాక్’లో పవర్ ఫుల్ పాత్రలో..!

జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ. ఆమె బుల్లితెరలోనే కాదు.. వెండితెరపై కూడా ఓ వెలుగు వెలిగిపోతున్నారు. రంగస్థలం సినిమాతో తాను ఏ పాత్రలో అయినా నటించగలిగే సత్తా అందంటూ నిరూపించింది. దాని ఫలితంగానే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

తాజాగా ఆమె పుష్ప, ఆచార్య, ఖిలాడీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా ‘ఫ్లాష్ బ్యాక్’ చిత్రంతో పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఈ సినిమాకు తాజాగా డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసింది. ప్రభు దేవా, రెజీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ఫ్లాష్ బ్యాక్ చిత్రంలో స్పెషల్ రోల్ పోషిస్తున్న యాంకర్ అనసూయ.. తన రోల్ డబ్బింగ్ పనులు పూర్తి చేస్తోంది.

‘ఫ్లాష్ బ్యాక్’ గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్ లైన్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ డాన్ శ్యాండీ. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పీ.రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న ఈ సినిమాను ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథను నేటితరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

చిత్రంలో చూపించే ప్రతి సన్నివేశం కూడా సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని.. అన్ని వర్గాల ఆడియన్స్ కెనెక్ట్ అయ్యేలా ఈ మూవీ రూపొందించామన్నారు. ఈ సినిమాలో రెజీనా రోల్.. ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్ గా విలక్షణ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనసూయ మరో పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరి రోల్స్‌తో పాటు ప్రభుదేవా క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుందన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందకు తీసుకొస్తామన్నారు.

ఇకపై నా పేరును వాడితే అందరినీ కోర్టుకు ఈడుస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా ఈమె ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతూ ఎన్నికల బరిలో దిగింది. అయితే ఎన్నికలలో అనసూయ గెలిచిందని తరువాత ఈమె ఓడిపోయింది అంటూ విభిన్న రకాలుగా కథనాలు వెలువడ్డాయి.

ఈ క్రమంలోనే అనసూయ స్పందిస్తూ మీడియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే అనసూయ గెలిచిందని మీరు ఎలా బ్రేకింగ్స్ వేస్తారు. అసలు నేను గెలిచానని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి సమాధానం ఎవరు చెబుతారు అంటూ అనసూయ మీడియాని ప్రశ్నించింది.

అనసూయ అడిగిన ఈ ప్రశ్నకు మీడియా వారు మాకు ఇన్ పుట్స్ వచ్చాయని సమాధానం చెప్పడంతో నేను కూడా మీడియా నుంచే ఇక్కడికి వచ్చాను ఇప్పటికీ కూడా నేను మీడియాలో ఉంటే న్యూస్ రిపోర్ట్ చేస్తాను కానీ క్రియేట్ చేయను అంటూ వారిపై ఆగ్రహం తెచ్చుకుంది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో చిరాకు పడుతూ సమాధానం చెప్పిన అనసూయ ఆ తర్వాత తన గురించి ఇకపై ఎవరైనా తప్పుడు రాతలు రాస్తే వారిపై యాక్షన్ తీసుకుంటానని చెప్పింది.

నా ప్రమేయం లేకుండా నా గురించి తప్పుడు వ్యాఖ్యలు రాసే వారిపై, నా పేరును పలు మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ లో ఉపయోగించిన వారిని కోర్టుకు లాగుతా అంటూ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ యాంకరమ్మ.

“తెలుగులో స్టార్ యాంకర్.. ఆమె పిల్లలకు మాత్రం తెలుగు పదాలే తెలియవు..” అంటూ నెటిజన్స్ కామెంట్స్..

బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన యాంకరింగ్ మాత్రమే కాకుండా నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అనసూయ.ప్రస్తుతం ఈమె బుల్లితెరపై కంటే వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

నిత్యం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా అనసూయ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈమె ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన అనసూయను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

తాజాగా అనసూయ షేర్ చేసిన వీడియోలో లేజీ డే అంటూ బెడ్ పై పెరుగు తాగుతున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో తన కొడుకుతో పాటు తను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెట్ కూడా ఉంది. అయితే ఆ పెట్ పెరుగు తాగడానికి అనసూయ దగ్గరకు వస్తుండగా అలా చేయకు అగ్రెసివ్‌గా ఉంటావు, అయినా ఇది పెరుగు అంటూ తన పెట్ కి చెబుతోంది.

ఈ క్రమంలోనే అనసూయ పక్కన ఉన్నటువంటి తన కొడుకు వెంటనే అనసూయను పెరుగు అంటే ఏంటమ్మా అని అడగగా వెంటనే అనసూయ హిందీలో దహీ అని చెబుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు తెలుగు యాంకర్ అయ్యుండి కూడా పిల్లలకు తెలుగు నేర్పించకపోవడం చాలా విడ్డూరం.. అంత పెద్ద అబ్బాయికి పెరుగు అంటే తెలియకపోవడం దారుణం అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

అనసూయ భర్త ఏం చేస్తారో తెలుసా.. అతని గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలివే!

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అటు బుల్లితెర ఇటు వెండితెరలో సమాన క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. రంగస్థలంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఎంతో ఫేమ్ తెచ్చుకున్నారు.

ముప్పై సంవత్సరాల వయస్సులో, ఆమె గొప్ప ఆఫర్‌లను పొందడం ద్వారా హీరోయిన్లతో పోటీపడుతుంది. ఇప్పటికే తమిళం మరియు మలయాళంలో సినిమాలు చేస్తున్న ఈమెకు హీరోయిన్స్ లాగే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు. అయితే అనసూయది ప్రేమ వివాహం అని ఆమె చాలా సార్లు చెప్పింది. అయితే అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు.

ఆమె కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకొని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరువురి కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది అనసూయ. ఇక వారికి శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త ఫైనాన్షియర్ మరియు ఫండింగ్ ప్లానర్ అని ఒక ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది.

గతంలో అనసూయ తన భర్తను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కూడా చేసింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో తాను మొదట్లో బాధపడ్డానని, అయితే తన ఇంటి సహాయంతో, ముఖ్యంగా తన భర్త సహాయంతో వాటిని అధిగమించానని ఆమె పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. అనసూయ పుష్పలో కూడా ఒక పాత్రను పోషిస్తుంది. ఆమె నటుడు సునీల్‌కు భార్యగా కనిపించనుంది. ఇవి మాత్రమే కాదు యాంకర్ అనసూయ మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

పుష్ప సినిమాలో రంగమ్మత్త లుక్ ఇదే…ఫోటో వైరల్!

బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న అనసూయకి పలు సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది.

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కూడా ఈ యాంకరమ్మ సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అనసూయ ఏ పాత్రలో నటిస్తుంది. తన లుక్ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించిన ఫోటో లీక్ అవడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీల్ భార్యగా డీ గ్లామర్ పాత్రలో అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి లీకైన అనసూయ లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అనసూయ పొట్టి జుట్టుతో, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నారు. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే పుష్ప సినిమా మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ ఉమెన్.. కత్తిలా ఉందంటూ కమెడియన్ పంచులు..?

సూపర్ ఉమెన్ అంటే అందరికీ వెంటనే వకీల్ సాబ్ సినిమాలోని కోర్టులో జరిగిన సన్నివేశం మైండ్ లో మెదులుతుంది. ఆ సన్నివేశంలో పోలీస్ పాత్రలో నటించిన లిరిష అనే నటిని అమాంతం ఈ సన్నివేశం పాపులర్ చేసింది. లిరిష గతంలో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు కేవలం వకీల్ సబ్ సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ విధంగా వకీల్ సాబ్ సినిమా ద్వారా సూపర్ ఉమెన్ గా పేరు సంపాదించుకున్న లిరిష తాజాగా జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.

జులై 22న ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల. ఈ ప్రోమోలో భాగంగా రాకెట్ రాఘవ స్కిట్ లో భాగంగా..” ఎక్కడికైనా 15 నిమిషాలలో వెళ్లిపోయే సూపర్ ఉమెన్ రా”… నేను అంటూ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా లిరిష ఈ కార్యక్రమానికి వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

రాకెట్ రాఘవ స్కిట్ లో పాల్గొన్న లిరిష పంచ్ డైలాగులతో అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కత్తిలా ఉందంటూ ఆమె పై కమెడియన్స్ పంచులు వేయగా అదిచూసిన జడ్జి రోజా, యాంకర్ అనసూయ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే వచ్చే వారం వరకు ఎదురు చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ ఉమెన్ చెప్పిన సూపర్ డైలాగులు ఏమిటో మీరు ఓ లుక్కేయండి.

ఆయన ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వరు.. ఇది నా అదృష్టం.. అనసూయ!

ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. వెండితెరపై ఈమె నటించిన పలు పాత్రలు ఎంతో మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఈ క్రమంలోనే వెండితెరపై పలు అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.

తాజాగా అనసూయ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అనసూయ తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో ఇదివరకే తెరకెక్కిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన అనసూయ ప్రస్తుతం “పుష్ప” సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

సినిమా విషయానికి వస్తే ఇందులో తన పాత్ర జీవితాంతం గుర్తుండే విధంగా ఉంటుందని, ఆ పాత్రకు అంత ప్రాధాన్యత ఉందని ఈ సందర్భంగా అనసూయ తెలిపారు. మామూలుగా దర్శకుడు సుకుమార్ ఆర్టిస్టులకు రెండవ ఛాన్స్ ఇవ్వరు. అలాంటిది తన సినిమాలో నాకు రెండో ఛాన్స్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం అంటూ అనసూయ తెలిపారు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక జంటగా సందడి చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

అనసూయ పొట్టిబట్టలపై ప్రశ్న… వాకౌట్ చేసిన అనసూయ!

బుల్లితెరపై అందం, అభినయం, మాట తీరు ఉన్న యాంకర్లలో యాంకర్ అనసూయ ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అనసూయ చాలా చురుకుగా ఉంటారు. తరచూ అనసూయకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే అనసూయ ఎక్కువగా పొట్టి దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఎక్కువగా విమర్శలు పాలవుతుంటారు.

ఈ విధంగా సోషల్ మీడియాలో అనసూయపై నెటిజన్లు చేసే ట్రోలింగ్ కి ఈమె ఘాటుగానే స్పందిస్తూ వారికి సమాధానం చెబుతుంటారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో కూడా అనసూయ అందాల ఆరబోతతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈవారం జరగబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

జబర్దస్త్ కార్యక్రమానికి ప్రతి వారం హైపర్ ఆది కొత్తగా ఎవరో ఒకరిని పరిచయం చేయడం సాధారణమే. ఈ క్రమంలోనే ఈ వారం హైపర్ ఆది యాంకర్ శివను జబర్దస్త్ కార్యక్రమానికి తీసుకువచ్చారు. మామూలుగానే యాంకర్ శివ వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే శివ యాంకర్ అనసూయని ఉద్దేశించి పలు ప్రశ్నలు వేశారు. చాలామంది మీరు పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటారు? అని కామెంట్లు చేస్తుంటారు.నాకు కూడా ఎప్పటినుంచో ఇదే ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది అంటూ అనసూయ అని అడగగా అందుకు అనసూయ ఘాటుగా స్పందించారు..

నా దుస్తుల గురించి వాళ్ళు అన్నారంటే వాళ్లకి ఇండస్ట్రీ గురించి తెలియదు కాబట్టి అలా అన్నారు అనుకోవచ్చు. కానీ మీరు ఇదే ఇండస్ట్రీలో పనిచేస్తూ అడగడం ఏంటి? ఇది నా వ్యక్తిగతం అని అనసూయ సమాధానం చెప్పారు. అప్పుడు శివ వ్యక్తిగతం అయితే మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా? ఇక్కడ ఎందుకు అని అడగగా.. ఒకసారిగా అనసూయ ఆది పై తీవ్రస్థాయిలో కోప్పడ్డారు. ఏంటి అది ఇది.. ఎవరెవరినో తీసుకువస్తారు.. ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా? అంటూ స్టేజిపై నుంచి దిగి బయటకు వెళ్లారు.అయితే ఇదంతా ప్రోమో కోసమే చేశారా? లేక నిజంగానే ? చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియాలంటే ఈ వారం పూర్తి కార్యక్రమం వచ్చే వరకు ఎదురు చూడాలి.