జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ. ఆమె బుల్లితెరలోనే కాదు.. వెండితెరపై కూడా ఓ వెలుగు వెలిగిపోతున్నారు. రంగస్థలం సినిమాతో తాను ఏ పాత్రలో అయినా నటించగలిగే సత్తా అందంటూ నిరూపించింది. దాని ఫలితంగానే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.
తాజాగా ఆమె పుష్ప, ఆచార్య, ఖిలాడీ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా ‘ఫ్లాష్ బ్యాక్’ చిత్రంతో పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఈ సినిమాకు తాజాగా డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసింది. ప్రభు దేవా, రెజీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ఫ్లాష్ బ్యాక్ చిత్రంలో స్పెషల్ రోల్ పోషిస్తున్న యాంకర్ అనసూయ.. తన రోల్ డబ్బింగ్ పనులు పూర్తి చేస్తోంది.
‘ఫ్లాష్ బ్యాక్’ గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్ లైన్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ డాన్ శ్యాండీ. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్పై పీ.రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న ఈ సినిమాను ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథను నేటితరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
చిత్రంలో చూపించే ప్రతి సన్నివేశం కూడా సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని.. అన్ని వర్గాల ఆడియన్స్ కెనెక్ట్ అయ్యేలా ఈ మూవీ రూపొందించామన్నారు. ఈ సినిమాలో రెజీనా రోల్.. ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్ గా విలక్షణ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనసూయ మరో పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరి రోల్స్తో పాటు ప్రభుదేవా క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుందన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందకు తీసుకొస్తామన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…