బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ రోజు ఉత్కంఠగా సాగుతోంది. ఏ రోజు ఏం జరరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రోజులు గడుస్తున్నా కొద్ది హౌస్ లో సభ్యులు తగ్గిపోతున్నారు. నామినేషన్ విషయంలో ట్విస్ట్ లు సాగుతూనే ఉన్నాయి.
ఈ వారం బయటకు వెళ్లే వారిలో సిరి, సన్ని, రవి, కాజల్, మానస్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎక్కువగా కాజల్ ఎలిమినేట్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే.. జెస్సీ తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా హౌస్ వదిలిపెట్టి సీక్రెట్ రూంకి వెళ్లాడు. దీనికి షణ్ముఖ్, సిరి వెక్కి వెక్కి ఏడ్చారు. గత సీజన్లో గంగవ్వ, నోయల్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే.
అతడిని కూడా బయటకు వెళ్తాడని అనుకన్న వారికి.. అనూహ్యంగా అతడిని సీక్రెట్ రూంకు పంపించారు బిగ్ బాస్. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా.. ఉండదా అనేది కొంచెం సందేహంలో ఉన్నారు ప్రేక్షకులు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో జెస్సీ సీక్రెట్ రూంలో ఉండి.. హౌస్ లో జరిగే సన్నివేశాలను వీక్షించాడు.
ముందుగా తనను ఈ గేమ్ లో కంటిన్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పాడు జెస్సీ. వైద్య పరీక్షల నిమిత్తం మిమ్మల్సి బయటకు తీసుకెళ్లాం.. డాక్టర్లు మీకు ఏం కాదని చెప్పడంతో హౌస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇప్పించామని.. నిబంధనల నేపథ్యంలో మీరు క్వారంటైన్ కావాల్సి ఉందంటూ సీక్రెట్ రూంలో ఉంచామన్నారు బిగ్ బాస్. బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాల్సి ఉందని చెప్పారు.ప్రేక్షకులు కూడా నిజంగానే చేసి బయటికి వెళ్తాను అని భావించారు కానీ తనని సీక్రెట్ రూమ్ కి పంపించి అందరిని బిగ్ బాస్ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…