Tag Archives: anchor anasuya

Anchor Anasuya: బెదిరిస్తే భయపడేది లేదు.. చీల్చి చెండాడుతా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిన అనసూయ?

Anchor Anasuya: యాంకర్ గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా సందడి చేసింది. ఇకపోతే ఈమె రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.ఈ పాత్రతో ఎంతో మంచి గుర్తింపు పొందిన అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం ఈమె అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా మొదటిసారిగా అనసూయ యాక్షన్ సన్నివేశాలలో నటించిన దర్జా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేక పోయినందుకు చిత్ర బృందం తనని క్షమించాలంటూ అందరికీ క్షమాపణలు చెప్పారు.ఇక ఈ సినిమాలో మొదటిసారి తను యాక్షన్ సన్నివేశాలలో నటించానని అనసూయ వెల్లడించారు. ఏకంగా చీరకట్టులో యాక్షన్ సన్నివేశాలు చేయించారని ఈమె తెలిపారు. ఎంతో విభిన్నమైన అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు పిఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ కి కృతజ్ఞతలని వెల్లడించారు.

మాస్ డైలాగ్ తో అంచనాలు పెంచిన అనసూయ…

ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అనసూయ ఒక మాస్ యాక్షన్ డైలాగుతో చెప్పేశారు.ఈ సందర్భంగా ఈమె ఈ సినిమాలో డైలాగ్ చెబుతూ నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చునే ఆడదాన్ని అనుకున్నావ్ రా… చీల్చి చెండాడేస్తా నా కొడకా అంటూ ఈ సినిమాలో డైలాగ్ ఎంతో దర్జాగా చెప్పేశారు. ఈ సందర్భంగా అనసూయ చెప్పిన ఈ డైలాగ్ చూస్తుంటేనే ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇలా అనసూయ మాటలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూలై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Darja Review: మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అనసూయ!

యాంకరింగ్ తో బుల్లి తెరపై యూత్ ని అలరించిన యాంకర్ అనసూయ ఇప్పుడు దర్జా గా వెండితెర మీద అలరించడానికి రెడీ అయింది. ఇందులో కమెడియన్ కం హీరో సునీల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. సునీల్ తో పాటు ఈ చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ నిర్మాత రవి పైడిపాటి ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లేడీ ఓరియెంటెడ్ పాత్రకు అనసూయ ఏమాత్రం న్యాయం చేసిందో చూద్దాం పదండి.

కథ: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు హడల్. పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని దందా సాగిస్తుంటుంది. ఈ క్రమంలో గణేశ్ (అరుణ్ వర్మ) తను ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) చేతిలో మోసపోయి ఉరేసుకుని చనిపోతాడు. తన అన్న చావుకి కారణం అయిన పుష్పని… గణేశ్ తమ్ముడు రంగ (షమ్ము) చంపాలని చూస్తుండగా… కొత్తగా వచ్చిన బందరు ACP శివ శంకర్ పైడిపాటి(సునీల్) అడ్డుకుని.. ఆ కేసు విచారణ చేపడతాడు. మరి గణేష్ చనిపోవడానికి కారణం పుష్ప మోసం చేయటం వల్లనేనా? బందరు కనకం ఆగడాలను ACP ఎలా ఆట కట్టించాడు? అసలు ACP శివశంకర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!

కథ… కథనం విశ్లేషణ: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఎప్పుడూ యూత్ ను ఆకట్టుకునే పాత్రల్లో నటించిన యాంకర్ అనసూయ దర్జాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించింది. ఈ పాత్రను హైలైట్ చేయటం కోసం దర్శకుడు ఎంచుకున్న స్టోరీ… దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అనసూయ పాత్ర ఆది నుంచి చివరి దాకా ఎంతో క్రూరంగా సాగి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. అలాగే సునీల్ ఏసీపీ పాత్రలో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఓ వైపు బందర్ కనకం ఆగడాలను చూపిస్తూనే… మరో వైపు గణేష్, పుష్పాల స్వఛ్చమైన ప్రేమను… అలానే రంగ, తీన్ మార్ గీతల చిలిపి ప్రేమను, ఆమని, తన పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్… శకలకశంకర్, థర్టీ ఇయర్స్ పృథ్వీల కామెడి అన్నీ మాస్ ను బాగ ఎంటర్టైన్ చేస్తాయి. చివర్లో వచ్చే మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్ ని అలరిస్తుంది.

అనసూయ పుష్పా తరవాత మంచి రౌద్రం వున్న పాత్రలో నటించి మెప్పించారు. విలనిజం తాలూకు పాత్రలో వచ్చే డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. ACP శివశంకర్ పాత్రలో మాస్ ని మెప్పించేలా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. ఈ చిత్రం కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి డెబ్యూ అయినా… పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. శమ్ము, అరుణ్ వర్మ అన్నదమ్ముల పాత్రల్లో లీనమై నటించారు. అలానే శిరీష, అక్సాఖాన్ అక్కా చెల్లెళ్ళుగా నటించి ఆకట్టుకున్నారు. చివర్లో ఆక్సాఖాన్ చేసిన మాస్ బీట్ సాంగ్ యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. షకలక శంకర్, పృథ్వీ, పాల్ రాము బాగ నవ్వించారు. మహేష్ సిద్ధాంతిగా తన పాత్రకి న్యాయం చేశాడు. విలన్ గా బళ్ళారి పాత్రలో సమీర్ బాగా క్రూరంగా నటించి మెప్పించాడు.

దర్శకుడు సలీమ్ మాలిక్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. డెబ్యూ మూవీ ఆయినా బాగానే హ్యాండిల్ చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. చివర్లో వచ్చే మాస్ సాంగ్ ఆడియెన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ మాస్ ను బాగ ఆకట్టు కుంటాయి. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3/5

Anchor Anasuya : జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై.. ఆమె స్థానంలో మరో హాట్ స్టార్ యాంకర్…?

Anchor Anasuya : ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరి లాగే అనసూయ కూడా జబర్దస్త్ కి దూరం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత 9 సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో అనసూయ కూడా ఉంది.

Anchor Anasuya : జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై.. ఆమె స్థానంలో మరో హాట్ స్టార్ యాంకర్…?

ఈ షో ద్వారా అనసూయ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుకుంది. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పాపులర్ అవ్వటంతో అనసూయకు సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పటికే ఈ అమ్మడు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటి గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనకి పైగా సినిమాలు ఉన్నాయి.

Anchor Anasuya : జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై.. ఆమె స్థానంలో మరో హాట్ స్టార్ యాంకర్…?

ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేసే అనసూయ ఇటీవల ఒక్ నోట్ రాసి పోస్టు చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ద్వార తను జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నట్టు అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే జబర్దస్త్ నుండీ జడ్జ్ లు, ఫేమస్ కమెడియన్లు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు అనసూయ కూడా ఈ షో నుండి వెళ్ళిపోతే జబర్దస్త్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఇదిలా ఉండగా అనసూయ జబర్దస్త్ నుండి వెళ్ళిపోతుందని వార్తలు వినిపించడంతో ఆమె స్థానంలో జబర్దస్త్ కి వచ్చే మరో యాంకర్ గురించి చర్చ మొదలయింది.

అనసూయ స్థానంలో యాంకర్ మంజూష…

ఈ క్రమంలో అనసూయ స్థానంలో జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా ప్రముఖ యాంకర్ మంజూష రాంపల్లిని తీసుకువస్తున్నట్టు సమాచారం. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా మంచి అనుభవమున్న మంజూష ఈ మధ్యకాలంలో గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా మంజుషకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందువల్ల జబర్దస్త్ లో అనసూయ స్థానంలో మంజూష కి స్థానం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

Anasuya -Aadhi: హైపర్ ఆదిని త్వరలో అక్కడ చూస్తారు.. హైపర్ ఆది జబర్దస్త్ను వీడటానికి కారణం చెప్పిన అనసూయ?

Anasuya -Aadhi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు అందరూ ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమాన్ని వదిలి బయటకు వెళ్తున్నారు.ఈ విధంగా బయటకు వెళ్ళిన వాళ్ళు సినిమా అవకాశాలు రావడంతోనే బయటకు వెళ్తున్నాము అంటూ వెల్లడించారు. అయితే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది గత రెండు నెలలుగా ఈ కార్యక్రమంలో కనిపించడం లేదు.

Anasuya -Aadhi: హైపర్ ఆదిని త్వరలో అక్కడ చూస్తారు.. హైపర్ ఆది జబర్దస్త్ను వీడటానికి కారణం చెప్పిన అనసూయ?

ఈ విధంగా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఇతర కార్యక్రమాలలో కూడా కనిపించడం లేదు. అయితే ఈయన ఉన్నఫలంగా ఈ కార్యక్రమానికి దూరం కావడానికి కారణం ఏమిటి అంటూ పలువురు పెద్దఎత్తున సందేహాలను వ్యక్తపరిచారు. అయితే ఇప్పటికీ హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడిపోవడానికి కారణం ఏంటో తెలియడం లేదు.

Anasuya -Aadhi: హైపర్ ఆదిని త్వరలో అక్కడ చూస్తారు.. హైపర్ ఆది జబర్దస్త్ను వీడటానికి కారణం చెప్పిన అనసూయ?

తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు జబర్దస్త్ అభిమానుల నుంచి హైపర్ ఆది గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇలా హైపర్ ఆది ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా అనసూయ హింట్ ఇచ్చారు. హైపర్ ఆది క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ఆయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయనే వార్తలు వినపడుతున్నాయి.

ఆది విషయంలో అభిమానులకు క్లారిటీ..

ఈ క్రమంలోనే ఒకవైపు సినిమాలు మరొకవైపు జబర్దస్త్ కార్యక్రమాన్ని బ్యాలెన్స్ చేయలేక హైపర్ ఆది వెళ్లిపోయారు అంటూ వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే అనసూయ ఆది గురించి మాట్లాడుతూ త్వరలోనే హైపర్ ఆదిని మీరు పలువురు స్టార్ హీరోల సినిమాలలో చూస్తారు అంటూ హింట్ ఇచ్చారు.ఈ విధంగా అనసూయ హైపర్ ఆది సినిమా అవకాశాలు రావడం వల్లే వెళ్లిపోయారని పరోక్షంగా తెలియజేశారు. అనసూయ హైపర్ ఆది గురించి చెప్పడంతో ఆది అభిమానులకు ఈ విషయంలో కొంతమేర క్లారిటీ వచ్చిందని చెప్పాలి.

Anchor Anasuya: రాముడు లాంటి నా భర్తను ఇలా చేసారేంటీ.. ఆపండి లేదంటే వైలెంట్ అవుతుంది.. వార్నింగ్ ఇచ్చిన అనసూయ..

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని సందడి చేశారు.రంగమ్మత్త పాత్ర ద్వారా వెండితెరపై సందడి చేసిన అనసూయ సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం వెండితెరపై, బుల్లితెరపై వరుస సినిమాలు ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Anchor Anasuya: రాముడు లాంటి నా భర్తను ఇలా చేసారేంటీ.. ఆపండి లేదంటే వైలెంట్ అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తన గురించి ఎవరైనా ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేసిన వారి భరతం పడుతుంది. తాజాగా అనసూయ హైపర్ ఆది టీమ్ పై తన విశ్వరూపం చూపించారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Anchor Anasuya: రాముడు లాంటి నా భర్తను ఇలా చేసారేంటీ.. ఆపండి లేదంటే వైలెంట్ అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ?

ఈ ప్రోమోలో భాగంగా దొరబాబు, పరదేశి అనసూయ హోమ్ టూర్ స్కిట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో రైజింగ్ రాజు పాత్రలో నటించగా దొరబాబు అనసూయ భరద్వాజ్ పాత్రలో నటించారు. పరదేశి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే రైజింగ్ రాజు అనసూయ పాత్ర ద్వారా ఎంట్రీ ఇస్తారు.ఇలా తన పాత్రలో రైజింగ్ రాజుని చూసేసరికి అనసూయ గుండె ముక్కలైపోయింది.

నా వైలెన్స్ చూస్తారు….

మేము మీ హోమ్ టూర్ చేయడానికి వచ్చాము అని చెప్పగా వారిని గట్టిగా కసురుకుంటుంది. దీంతో పరదేశి ఇదేమైనా ఫేస్ బుక్ అనుకున్నావా యూట్యూబ్ అంటూ అనసూయ పై సెటైర్ వేస్తారు. ఇక అనసూయ భర్తగా దొరబాబు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అనసూయ షాక్ అవుతుంది. దొరబాబు రావడం చూసిన అనసూయ రాముడు లాంటి నా భర్త పాత్రను దొరబాబు చేశారంటూనే ఇంతటితో స్కిట్ ఆపకపోతే వైలెన్స్ చూస్తారు అంటూ దొరబాబు టీమ్ కి అనసూయ స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

Anchor Anasuya: భర్త ప్రపంచానికి చాలా అవసరం ..అనసూయ ఎమోషనల్ కామెంట్స్!

Anchor Anasuya: స్మాల్ స్క్రీన్ పై తన గ్లామర్ తో, యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ అనసూయ, కొద్ది కాలంలోనే మంచి గుర్తింపును సాధించింది. జబర్దస్త్ షోతో తన పాపులారిటీని పెంచుకొని, తద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. రంగమ్మత్తగా రంగస్థలం సినిమాలో అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దు గుమ్మ, గతేడాది రిలీజ్ అయిన పుష్ప సినిమాలోనూ నెగటివ్ పాత్రలో దాక్షాయణిగా నటించి, పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇన్ని రోజులూ టీవీ షోలకే పరిమితం అయిన అనసూయకు పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇక అదే ఉత్సాహంతో మరికొన్ని సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

Anchor Anasuya: భర్త ప్రపంచానికి చాలా అవసరం ..అనసూయ ఎమోషనల్ కామెంట్స్!

ఇదిలా ఉండగా పలు షోలతో ఇప్పటికే గ్లామర్ అండ్ బ్యూటీఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ లో శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో మెరిసింది. అందులో భాగంగా కంటెస్టంట్స్ పలు స్కట్స్, డాన్స్ లతో అదరగొట్టినట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా అత్తా కోడళ్ళ రిలేషన్ కి సంబంధించి చేసిన ఓ స్కిట్ కి అనసూయా బాగా కనెక్ట్ అయ్యి, ఎమోషన్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా అనసూయ తన భర్త భరద్వాజ్ గురించి చెప్తూ కన్నీటి పర్యంతమైంది. తాను రోజూ తన భర్తతో ప్రేమలో పడుతూ ఉంటానని, తాను చెప్పడం కాదు గానీ, ఆయన లాంటి హస్బెండ్ ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ ఎమోషనల్ అయ్యింది.

కన్నీళ్లు పెట్టిన అనసూయ…

ఎప్పుడూ నవ్విస్తూ, నవ్వుతూ హంగామా సృష్టించే అనసూయ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడి వాతావరణం అంతా నిశబ్దంగా మారినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా పలు ప్రదర్శనలతో ఈ షో ఈ సారి భారీగానే హిట్ కొట్టేలా నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు ఇటీవలే విడుదల చేసిన ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది.

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

Anchor Anasuya: ఈటీవీ మల్లెమాల వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, క్యాష్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పలు రకాల షోలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పండుగ సమయాలలో ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మల్లే మాల వారు నిర్వహించే కార్యక్రమాలు అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా ఒక ఈవెంట్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

ఏప్రిల్ 10వ తేదీన శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా మల్లెమాల వారు మరొక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే ఒక ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు యాంకర్ ప్రదీప్, అనసూయలతో పాటుగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్స్ అందరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఇటీవలే ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు.

Anchor Anasuya: పాపను దత్తత తీసుకున్న అనసూయ .. ఇందులో నిజమెంత..?

అయితే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ ప్రోమోలో అనసూయ ఒక చిన్నారిని ఎత్తుకుని ఎమోషనల్ గా ముద్దాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. అయితే అనసూయకు ఇద్దరు కొడుకులు అన్న విషయం అందరికి తెలిసిందే. ఆమెకు ఒక బిడ్డ లేదు అనే బాధ ఎప్పుడూ ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ. అంతేకాకుండా తన బిడ్డ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పుకొచ్చింది. తాజాగా వదిలిన ప్రోమోలో అనసూయ ఒక చిన్నారిని ఎత్తుకోవడంతో పాటు ముద్దులు పెడుతూ ఎమోషనల్ గా ఆప్యాయంగా మనసుకు హత్తుకుంది.

అనసూయ కల నెరవేరిందా…

దీంతో అనసూయ ఎత్తుకున్న ఆ పాప ఎవరు అన్న చర్చ మొదలయింది. దీంతో చాలామంది ఆ పాపను అనసూయ దత్తత తీసుకుందా? అందుకే స్టేజ్ పై అంత ఎమోషనల్ అయ్యిందా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి అనసూయ చేతిలో ఉన్న ఆ పాప ఎవరు?సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నిజంగానే అనసూయ దత్తత తీసుకుందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరొకవైపు అనసూయ చెప్పిన మాట ప్రకారం అనసూయ మరొక బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారా అనే చర్చలు మొదలయ్యాయి. అంటే త్వరలోనే అనసూయ గుడ్ న్యూస్ చెప్పబోతోందనే రీతిలో కూడా ఆలోచిస్తున్నారు. అనసూయ తనకు బిడ్డ కావాలి అని కోరుకుంటున్నానని అనడంతో అక్కడే ఉన్న యాంకర్ ప్రదీప్ తథాస్తు అని దీవించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాకుండా అనసూయ మాట్లాడిన మాటలకు, ఆమె ఎత్తుకున్న చిన్నారి ఎవరు ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

Anchor Anasuya: మరోసారి తల్లి కావాలనుకుంటున్న అనసూయ మనసులోని కోరికను బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్!

Anchor Anasuya: బుల్లితెరపై జబర్దస్త్‌ అనే కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి, ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. తన హావ భావాలతో, అందంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. దీంతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ, ఇప్పుడు నటి గానూ మారి తన టాలెంట్‌ను నిరూపించుకుంటుంది.

Anchor Anasuya: మరోసారి తల్లి కావాలనుకుంటున్న అనసూయ మనసులోని కోరికను బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్!

ఇటీవల పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన పుష్ప సినిమాలోనూ నెగెటివ్ రోల్‌లో కనిపించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకుంది. నెక్స్ట్ తీయబోయే పుష్ప పార్ట్ 2లోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఈ ఒక్క సినిమా అనసూయ కెరీర్‌ను ఎక్కడికో తీసుకెళ్లి ఆమెకు ఎనలేని డిమాండ్‌ను కూడా తీసుకొచ్చింది.

Anchor Anasuya: మరోసారి తల్లి కావాలనుకుంటున్న అనసూయ మనసులోని కోరికను బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్!

ఇక సినిమాల్లో అవకాశం వచ్చినా అనసూయ మాత్రం టీవీ షోలను కంటిన్యూ చేస్తుండడం విశేషం. ఎందుకంటే నటిగా కంటే ముందు నుంచీ అందరికీ సుపరిచితమైంది యాంకర్‌గానే. కాబట్టి ఎంతో పేరు తెచ్చిన యాంకర్‌ వృత్తిని ఈమె ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దానికి తోడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తన హాట్ పిక్స్‌తో అదరగొడుతూ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.ఆ ఫొటోలకు కూడా లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. అయితే కొన్ని సార్లు ఆమె డ్రెస్సింగ్‌పైనా నెగెటివ్‌గా కామెంట్స్ వచ్చినా, వాటికి ధీటుగా స్పందిస్తూ సమాధానిస్తోంది అనసూయ.

కూతురు కావాలనే కోరిక…

ఇక వివరాల్లోకి వెళితే టెలివిజన్ వచ్చే ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న అనసూయ, అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ ఆకట్టుకుంటుంది. తాజాగా తాను ఓ బాధను అనుభవిస్తున్నానంటూ కన్నీటి పర్యంతమైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించే షోలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో అనసూయ ఓ పాపను ఎత్తుకొని ముద్దాడుతూ , ప్రేమగా లాలించడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ సమయంలోనే అక్కడే ఉన్న యాంకర్ రష్మీ, అనసూయ ఎప్పటినుంచో కూతుర్ని కనాలని ఎదురు చూస్తున్నట్టు చెబుతుంది. దీంతో ఎమోషనల్ అయిన అనసూయ, తాను కచ్చితంగా కూతుర్ని కంటానని ఆశిస్తున్నట్టు చెప్పగానే, యాంకర్ ప్రదీప్ వచ్చి తథాస్తు అనడం కొసమెరుపు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అనసూయలోని కొత్త కోణం చూసిన ఆడియెన్స్ చలించిపోతున్నారు.

Anchor Anasuya: అనసూయ పొట్టి డ్రస్సు పై నెటిజన్ కామెంట్… మగ జాతి పరువు తీస్తున్నావంటూ ఫైర్ అయిన యాంకరమ్మ!

Anchor Anasuya: బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలుసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.

Anchor Anasuya: అనసూయ పొట్టి డ్రస్సు పై నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకరమ్మ!

ముఖ్యంగా అనసూయ వస్త్రధారణపై ఎంతోమంది కామెంట్లు చేసినప్పటికీ వారికి ధీటుగా సమాధానం చెబుతుంది. ఇలా ఎన్నో సార్లు జరిగినప్పటికీ తరుచూ నెటిజన్లు ఈమె వస్త్రధారణపై కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా మరోక నెటిజన్ అనసూయ వస్త్రధారణ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Anchor Anasuya: అనసూయ పొట్టి డ్రస్సు పై నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకరమ్మ!

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సదరు నెటిజెన్ స్పందిస్తూ అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యారు. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి దుస్తులు వేసుకుంటారా… ఇలాంటి దుస్తులు వేసుకొని తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.

మగ జాతి పరువు తీయొద్దు…

ఈ క్రమంలోనే ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ… దయచేసి మీ పని మీరు చేసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి మీరు ఇలా ఆలోచించి మగ జాతి పరువు తీస్తున్నారు అంటూ అనసూయ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇలాంటి కామెంట్లు ఎదుర్కోవడం అనసూయకు కొత్తేమీకాదు. ఇలాంటి వారికి అనసూయ తనదైన శైలిలో సమాధానం చెబుతూ తనపని తాను చేసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Anchor Anasuya: అందరూ చూస్తుండగా అనసూయను పైకెత్తిన యూట్యూబర్ నిఖిల్… రచ్చ చేసిన అనసూయ!

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే వెండితెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపై ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులు వస్తే బుల్లితెర పై ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతాయి.

Anchor Anasuya: అందరూ చూస్తుండగా అనసూయను పైకెత్తిన యూట్యూబర్ నిఖిల్… రచ్చ చేసిన అనసూయ!

ఈ క్రమంలోనే ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మా ఆగట్టునుంటావా.. ఈ గట్టు కొస్తావా అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది కమెడియన్స్, సింగర్స్, యాంకర్స్, బుల్లితెర నటీనటులు పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు.

Anchor Anasuya: అందరూ చూస్తుండగా అనసూయను పైకెత్తిన యూట్యూబర్ నిఖిల్… రచ్చ చేసిన అనసూయ!

ఇక ఈ కార్యక్రమంలో యాంకర్ అనసూయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా ఆటపాటలతో ఎంతో సందడిగా కొనసాగిన ఈ కార్యక్రమంలో యాంకర్ రవి, బిగ్ బాస్ విన్నర్ సన్నీ, యూట్యూబర్ నిఖిల్ అనసూయను టార్గెట్ చేస్తూ తన పై పంచులు వేస్తూ తనని ఆట పట్టించారు.

అనసూయ టార్గెట్ చేస్తున్న నిఖిల్…

ఇక ముక్కు అవినాష్ జ్యోతిష్యుడి గెటప్ లో వచ్చే అందరి జాతకాలు చేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే నిఖిల్ చేతి గీతలు చూస్తూ.. చేతిలో గీతలు అన్ని కనపడకుండా పోయాయని చెప్పడంతో వెంటనే అనసూయ అలా రుద్దుతున్నావ్ అంటూ నిఖిల్ కు సెటైర్ వేసింది.ఇలా అనసూయ నిఖిల్ పై సెటైర్లు వేయడంతో నిఖిల్ కూడా అనసూయ పై సెటైర్ వేశారు. ఇక నిఖిల్ అంతటితో ఆగకుండా ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా అనసూయను పైకి ఎత్తారు. ఇలా పైకి ఎత్తడంతో షాక్ అయిన అనసూయ తనని కిందికి దించాలని అరిచి గగ్గోలు పెట్టారు. అయితే తను చెప్పిన వాటికి ఒప్పుకుంటేనే కిందకు దింపుతానని నిఖిల్ చెప్పారు. దీంతో అక్కడున్న వారందరూ విజిల్స్..క్లాప్స్ తో హోరెత్తించారు.