Anchor Anasuya: యాంకర్ గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా సందడి చేసింది. ఇకపోతే ఈమె రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.ఈ పాత్రతో ఎంతో మంచి గుర్తింపు పొందిన అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం ఈమె అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా మొదటిసారిగా అనసూయ యాక్షన్ సన్నివేశాలలో నటించిన దర్జా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేక పోయినందుకు చిత్ర బృందం తనని క్షమించాలంటూ అందరికీ క్షమాపణలు చెప్పారు.ఇక ఈ సినిమాలో మొదటిసారి తను యాక్షన్ సన్నివేశాలలో నటించానని అనసూయ వెల్లడించారు. ఏకంగా చీరకట్టులో యాక్షన్ సన్నివేశాలు చేయించారని ఈమె తెలిపారు. ఎంతో విభిన్నమైన అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి కృతజ్ఞతలని వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అనసూయ ఒక మాస్ యాక్షన్ డైలాగుతో చెప్పేశారు.ఈ సందర్భంగా ఈమె ఈ సినిమాలో డైలాగ్ చెబుతూ నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చునే ఆడదాన్ని అనుకున్నావ్ రా… చీల్చి చెండాడేస్తా నా కొడకా అంటూ ఈ సినిమాలో డైలాగ్ ఎంతో దర్జాగా చెప్పేశారు. ఈ సందర్భంగా అనసూయ చెప్పిన ఈ డైలాగ్ చూస్తుంటేనే ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇలా అనసూయ మాటలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూలై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…