Anchor Anasuya: యాంకర్ గా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా సందడి చేసింది. ఇకపోతే ఈమె రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.ఈ పాత్రతో ఎంతో మంచి గుర్తింపు పొందిన అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం ఈమె అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా మొదటిసారిగా అనసూయ యాక్షన్ సన్నివేశాలలో నటించిన దర్జా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేక పోయినందుకు చిత్ర బృందం తనని క్షమించాలంటూ అందరికీ క్షమాపణలు చెప్పారు.ఇక ఈ సినిమాలో మొదటిసారి తను యాక్షన్ సన్నివేశాలలో నటించానని అనసూయ వెల్లడించారు. ఏకంగా చీరకట్టులో యాక్షన్ సన్నివేశాలు చేయించారని ఈమె తెలిపారు. ఎంతో విభిన్నమైన అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి కృతజ్ఞతలని వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అనసూయ ఒక మాస్ యాక్షన్ డైలాగుతో చెప్పేశారు.ఈ సందర్భంగా ఈమె ఈ సినిమాలో డైలాగ్ చెబుతూ నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చునే ఆడదాన్ని అనుకున్నావ్ రా… చీల్చి చెండాడేస్తా నా కొడకా అంటూ ఈ సినిమాలో డైలాగ్ ఎంతో దర్జాగా చెప్పేశారు. ఈ సందర్భంగా అనసూయ చెప్పిన ఈ డైలాగ్ చూస్తుంటేనే ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇలా అనసూయ మాటలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూలై 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…