Tag Archives: anchor Rashmi

Anchor Rashmi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ… మా అన్న ఏం కావాలంటున్న సుధీర్ ఫాన్స్?

Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే సుధీర్ రష్మీ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ వీరిద్దరు నిజ జీవితంలో కూడా ఒకటైతే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడంతో ఈ జోడి బాగుందని వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది భావించారు అయితే తాజాగా యాంకర్ రష్మీ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. గత కొద్దిరోజులుగా ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ పెళ్లి వార్తలకు చెక్ పెట్టాలని తన కుటుంబ సభ్యులు భావించారట.

ఇలా రష్మికి పెళ్లి చేయాలి అనే నిర్ణయాన్ని తమ కుటుంబ సభ్యులు తీసుకున్నారని అయితే ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా తమ సొంత రాష్ట్రమైనటువంటి ఒడిస్సాకు చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. ఒడిస్సాలో ప్రముఖ వ్యాపారవేత్తతో రష్మీ పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి త్వరలోనే రశ్మి తన పెళ్లికి సంబంధించిన ఈ విషయాన్ని అధికారకంగా కూడా వెల్లడించనున్నట్లు సమాచారం.

సుధీర్ ని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైన రష్మి…

ఈ విధంగా రష్మీ పెళ్లి చేసుకోబోతుందని ఈమె ఒక వ్యాపారవేత్తకు భార్యగా వెళ్లనున్నారు అనే విషయం తెలియడంతో సుధీర్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా మా అన్నకు అన్యాయం చేసి పెళ్లి చేసుకొని నీ దారి నువ్వు చూసుకుంటే మా అన్న ఏం కావాలి అంటూ పెద్ద ఎత్తున సుధీర్ అభిమానులు డిసప్పాయింట్ అవ్వడమే కాకుండా, సుధీర్ ని వదిలేయడం న్యాయం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మి పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Anchor Rashmi: బర్త్ డే పార్టీలో యాంకర్ రష్మి రచ్చ… వైరల్ అవుతున్న పోస్ట్..?

Anchor Rashmi: అందాల యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. తాజాగా రష్మి తన పుట్టిన రోజుని స్నేహితులతో కలిసి చాలా గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ ఏడాదికి రష్మి 26 పూర్తి చేసుకొని 27 వ వసంతంలో అడుగు పెట్టింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఫ్రెండ్స్ సమక్షంలో ఈ బర్త్ డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేస్తూ రష్మి గౌతమ్‌ రచ్చ చేసింది.

మెడలో గోల్డ్ కలర్‌ దండ ధరించి రెచ్చిపోయింది. పుట్టినరోజు నాడు రష్మి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా చిందులేస్తు, కొంటె పనులు, చిలిపి పనులు చేస్తూ సందడి చేసింది. ఫ్రెండ్స్ తో డాన్సులు, ముద్దులతో నాన్‌ స్టాప్‌గా ఎంజాయ్‌ చేసిందీ. ప్రస్తుతం రష్మి బర్తడే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటోలలో రష్మి మోకాళ్ల పైకున్న బ్లూ కలర్ టాప్‌లో తన థైస్‌ అందాలను చూపించింది.దీంతో ఈ డ్రెస్ లో రష్మి చాలా హాట్‌గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా రష్మి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ‘ ఉండాలనుకునే వారికి కట్టుబడి ఉండండి, వెళ్లాలనుకునే వారిని వదిలేయండి, నా ఉనికికి మరో ఏడాది యాడ్‌ అయ్యింది. దానికి విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తాను.

Anchor Rashmi: వారే నా జీవితంలో ప్రధాన స్తంభాలు…

నా బర్త్ డేని స్పెషల్‌గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. అంతే కాకుండా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాజీవితంలో ప్రధాన స్తంభాలు అని తనకు తాను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకుంది. ఇక రష్మీ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులతో పాటు నేటిజెన్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anchor Rashmi: వాడి లవర్ వాడి ఇష్టం… నాగశౌర్య వీడియో పై స్పందించిన రష్మి… ఆడుకుంటున్న నేటిజన్స్!

Anchor Rashmi: నాగశౌర్య గత రెండు రోజుల క్రితం రోడ్డుపై కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక అబ్బాయి అమ్మాయిపై చేయి చేసుకోవడం చూశారు. దీంతో కారు దిగి వెంటనే ఆయన ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పించారు.ఇలా ఒక అమ్మాయిపై చేయి చేసుకోవడంతో నాగశౌర్య రియల్ హీరోగా మారి ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పించడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో పై కొందరు నాగ శౌర్యను ప్రశంసిస్తూ కామెంట్లు చేయగా మరి కొందరు వాడి లవర్ వాడి ఇష్టం మధ్యలో మీకేంటి అంటూ కామెంట్లు చేశారు. అలాగే మరికొందరు ఈ గొడవ వల్ల ఆ అమ్మాయి ఫ్యామిలీకి మ్యాటర్ తెలిసిపోయింది అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ వీడియో పై నేటిజన్స్ స్పందించిన తీరును చూసి రష్మీ మండిపడ్డారు.

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాడి లవర్ వాడి ఇష్టమట అమ్మాయే ఇలా చెబితే ఏమంటాం… అసలు ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులలో ఉందో మీకు తెలుసా? ఇలాంటి కామెంట్లు చూస్తే సిగ్గేస్తోంది.మీరు మరొక ఆత్మహత్య జరగాలని భావిస్తున్నారా అంటూ ఈమె నేటిజన్ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Anchor Rashmi: అక్కడైతే నవ్వుతావు కదా….

ఇలా రష్మీ ఈ వీడియో పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో నేటిజన్స్ రశ్మిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అసలు రోడ్లపై ఇలాంటి సంఘటనలు జరగడానికి మీ జబర్దస్త్ కారణం అంటూ కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఇలాంటి స్కిట్లు చేస్తే అక్కడ నవ్వుతావు… ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అంటూ రశ్మిని నేటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు ఏది ఏమైనా గత వారం రోజులుగా రష్మీ నేటిజన్ల చేతిలో దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు.

Rashmi Gautam: పిల్లలు పుట్టాలంటే మంచం పక్కన ఉండాలి… బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయిన యాంకర్ రష్మీ!

Rashmi Gautam: బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఎంతో మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న రష్మీ పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం అంటే డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ వారి స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగులు వాడితూ ఉంటారు.

ఇలా బూతు పదాలతో రెచ్చిపోతూ ఉండడంతో కొన్నిసార్లు ఈ కార్యక్రమం పై తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో తరచూ ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులకు ఏమాత్రం కొదువ ఉండదు. అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా భార్యాభర్తల స్కిట్ లో భాగంగా భార్యాభర్తలు మాట్లాడుతూ… పిల్లలు పుట్టాలంటే ఇలా కంచం పక్కన ఉంటే సరిపోదు అంటూ డైలాగ్ చెబుతుంటారు.

Rashmi Gautam: రేటింగ్ కోసం బూతు డైలాగులు….


ఇలా డైలాగ్ చెబుతుండగానే వెంటనే రష్మీ ఈ డైలాగ్ అందుకుని పిల్లలు పుట్టాలంటే మంచం పక్కన ఉండాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.ఇలా రష్మీ ఒక్కసారిగా ఇలాంటి డైలాగు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మల్లెమాలవారు ఎప్పటికీ మారరు టిఆర్పి రేటింగ్స్ కోసం ఇలా బోల్డ్ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rashmi Gautam: పడుకుంటేనే అవకాశాలు వస్తాయి… క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన యాంకర్ రష్మీ!

Rashmi Gautam: సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలోఎంతోమంది అవకాశాలను అందుకొని మంచి స్థానంలో నిలదొక్కుకోవాలి అంటే కెరియర్ మొదట్లో తప్పనిసరిగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ రష్మి గౌతమ్ సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటించారు. అయితే హీరోయిన్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి.

గతంలో ఈమె నటి ఐశ్వర్య రాయ్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అయితే ఐశ్వర్య రాయ్ ఫోటోపై పడుకుంటేనే టాప్ పొజిషన్ వస్తుంది అంటూ రాసి ఉంది. అయితే ఈ విషయంపై రష్మీ స్పందిస్తూ ఇలా మాట్లాడటం చాలా సులభం కానీ పైకి ఎదగడం మాత్రం అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలు పడి పైకి ఎదుగుతాం. ఎదిగిన వారిపై ఇలాంటి నిందలు వేయకూడదు అంటూ రష్మీ ఐశ్వర్యరాయ్ ఫోటోపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Rashmi Gautam: హీరోయిన్ గా సక్సెస్ సాధించలేకపోయిన రష్మి..

ఈ క్రమంలోనే రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈమె ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Anchor Rashmi: నేను హిందూ అయినా ఎప్పటికీ ఆ పని చేయను… యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్!

Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రశ్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటుంది. ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

స్వతహాగా జంతు ప్రేమికురాలు అయినా రష్మి, మూగజీవాల సంరక్షణ కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మూగజీవాలను సంరక్షించమని అందరినీ వేడుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా రోడ్లమీద ఆహారం లేకుండా ఉండే మూగజీవాలకు ఆహారం అందిస్తూ ఉంటుంది. ఇలా తరచూ జంతువుల పట్ల తన ప్రేమను చూపించే రష్మీ తాజాగా సోషల్ మీడియా ద్వారా మరొక పోస్ట్ షేర్ చేసింది.

ఆ పోస్ట్ కి ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ కి రష్మి సరైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల బుల్ ఫైట్ కి సంబంధించిన ట్వీట్ కి రష్మి రిప్లై ఇస్తూ.. ‘ఇలాంటి క్రీడలను ఎంజాయ్ చేస్తూ రాత్రి పూట ఎలా నిద్రపోతారు’ అని రష్మీ ట్వీట్ చేసింది. దీంతో ఒక నెటిజన్.. ‘సినీ పరిశ్రమలో ఉన్న మీరు లెదర్ ఉత్పత్తులను ఎలా వాడతారు? ముందు మీరు వాటిని నిషేధించండి. ఆ తర్వాత ప్రతీది నిషేధించబడుతుంది’ అంటూ కామెంట్ చేశాడు.

Anchor Rashmi: ఎప్పటికీ లెదర్ వస్తువులు వాడను…

నెటిజన్ చేసిన కామెంట్ కి రష్మి స్పందిస్తూ..” నేను సినీ పరిశ్రమ నుంచే వచ్చాను. నేను లెదర్ ఉత్పత్తులు వాడను. ఎక్కడైనా జంతువుల తోలుతో చేసిన ఉత్పత్తులను కొని, వాడకండి. ఎందుకంటే మన దేశంలో లెదర్ అనేది ఎక్కువగా వయోజన ఆవుల నుంచి కూడా వస్తుంది. హిందువునైన నేను అలాంటి క్రూరమైన పని ఎప్పటికీ చేయను అంటూ సరైన సమాధానం ఇచ్చింది. దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులను బ్యాన్ చేయలేరు. ఇదంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. నిషేధించడం, దాన్ని మరింత హైలైట్ చేయడం కంటే లెదర్ ని కొనుగోలు చేయకుండా ఉండడమే మంచిదంటూ రష్మీ ట్వీట్ చేసింది.

Anchor Rashmi: రష్మీ హిందూ వ్యతిరేకన్న నెటిజన్… తన స్టైల్ లో సమాధానం చెప్పిన రష్మీ!

Anchor Rashmi: రష్మి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు బుల్లితెర కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ వెండితెరపై పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా వెండితెరపై నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన ఈమె బుల్లితెరపై తనదైన శైలిలో అందరిని సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా మూగ జంతువులను ఎవరైనా హింసిస్తే తప్పకుండా ఆ ఘటనపై స్పందిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్భంగా ఓ వినాయకుడి ప్రతిమకు ఏనుగుతో గజమాల వేయించారు.

ఈ ఘటనపై స్పందించిన రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వినాయకుడికి గజమాల వేయడం కోసం ఆ ఏనుగు ఎంత బాధ అనుభవించుంటుందో నాకు తెలుసు మన సంతోషం కోసం మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఈమె ట్వీట్ చేశారు.అయితే రష్మీ ఈ విధంగా ట్వీట్ చేయడంతో కొందరు నెటిజెన్లు స్పందిస్తూ నువ్వు హిందూ వ్యతిరేకివి హిందూ పండుగలనే టార్గెట్ చేస్తావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Rashmi: ఆ మూడు రోజులు నొప్పిని భరించలేను…

ఈ విధంగా నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించిన రష్మీ..తాను నంది, గోమాతను పూజిస్తానని అందుకే తాను లెదర్ వస్తువులను అలాగే పాలు పాలతో తయారు చేసిన వస్తువులను తిననని తెలిపారు. ఒక ఆవు పాలు ఇవ్వడం కోసం ఎన్ని సార్లు గర్భవతి అవుతుందనే నిజాన్ని నేను తట్టుకోలేను. అంతెందుకు ఓ మహిళగా రుతుక్రమ సమయంలో వచ్చే మూడు రోజుల నొప్పి కూడా నాకు ఎంతో నరకంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఆమె తన స్టైల్ లో సమాధానం చెప్పుకొచ్చారు ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

Anchor Rashmi: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సుడిగాలి సుదీర్ తో జతకట్టి పలు స్కిట్ లలో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే చాలామంది సుడిగాలి సుధీర్ రష్మీ జోడి ఇష్టపడటమే కాకుండా, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటంతో చాలా మంది వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పెద్దఎత్తున వార్తలు సృష్టించారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

ఈ విధంగా తన గురించి వస్తున్న లవ్ ఎఫైర్స్ గురించి రష్మీ గతంలో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ మరోసారి ఈ వీడియో వైరల్ కావడంతో రష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుతూ తనకు సుడిగాలి సుధీర్ కు ఆ ఫైర్ గురించి ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం సుడిగాలి సుదీర్ తో మాత్రమే కాకుండా, చలాకి చంటితో కూడా తనకు ఎఫైర్ పెట్టారని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.మిగిలిన టీమ్ మెంబర్స్ అందరికీ పెళ్లి కావడంతో వారితో తనకు ఎలాంటి లింక్ పెట్టలేదని పెళ్లి కాని వారు అందరితోనూ తనకు ఎఫైర్స్ పెట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా మా అందరిదీ సేమ్ ఏజ్ కావడంతో చాలా మంది మా మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ భావించారు.

ఇలాంటి వార్తలను సరదాగా తీసుకుంటాను…

ఈ విధంగా తన గురించి వస్తున్న ఎఫైర్స్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, ఇలాంటి రూమర్స్ అన్నింటినీ తాను చాలా సరదాగా తీసుకుంటానని రష్మి తెలిపారు.జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చిన తరువాత తనలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి ఏ విషయమైనా ముందు సీరియస్ గా తీసుకోకుండా చాలా సరదాగా తీసుకోవడం అలవాటు అయింది. అందుకే తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి రూమర్స్ ను కూడా తను పెద్దగా పట్టించుకోలేదని ఈ సందర్భంగా రష్మి తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించారు.

Anchor Rashmi : యాంకర్ రష్మీ ని ఫిలిం ఛాంబర్ గేటుకి కట్టేసి కొడతా అన్న నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

Anchor Rashmi Gautam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై తన యాంకరింగ్ తో, ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. యాంకర్ రష్మీ కి యూత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా రష్మీ కు సహాయం చేసే గుణం ఎక్కువ. మూగజీవాల పై ఎక్కువగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మీ తనను బ్లాక్ మెయిల్ చేసింది అంటూ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు విషయంలోకి వెళితే.. ఇంటర్వ్యూ లో భాగంగా బాలాజీ నాగలింగం మాట్లాడుతూ.. నేను రష్మీ ని ఇచ్చిన మాట నిజమే.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

నేను సాధారణంగా ఎవరిని అంతగా తిట్టను.. కానీ రష్మీ ఎందుకు తింటాను అంటే.. రష్మీ మాతో రాణి గారి బంగ్లా అనే సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఆ సినిమాకు దివాకర్ బాబు దర్శకుడిగా డెబిట్ చేస్తున్నాడు. దీంతో సినిమాలో మెయిన్ రోల్ కోసం రష్మి గౌతమ్ ను అనుకోని ఆ తర్వాత మాట్లాడి రెమ్యునరేషన్ గురించి చెప్పాను అని తెలిపాడు బాలాజీ. అయితే ఆ సినిమాను లిమిటెడ్ బడ్జెట్లో చేయాలి అనుకుంటున్నట్లు, అదేవిధంగా ఆ సినిమా మేకింగ్ కు ఎంత ఖర్చు పెడుతున్నా మన విషయాన్ని చెప్పి అనంతరం ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వగలను అని చెప్పారట బాలాజీ.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

రష్మీ గుంటూరు టాకీస్ సినిమా ఓకే చేసిన తర్వాత సినిమా అంతా పూర్తి అయ్యి చివర్లో కేవలం ఒక సాంగ్ డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉన్నప్పుడు రష్మీ నేను చేయలేను హీరో ని మార్చేయండి అని ఇబ్బంది పెట్టింది అని తెలిపాడు బాలాజీ నాగలింగం. అప్పుడు అతను రష్మీ తో మాట్లాడగా.. అప్పుడు రష్మీ నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి తెలుసు, మిమ్మల్ని టీవీ9 ఎక్కిస్తాను, అది చేస్తాను ఇంత దూరం వెళ్తాను అంటూ బెదిరించి ప్రయత్నం చేసిందట. అప్పుడు బాలాజీ నాకు కూడా నాగబాబు తెలుసు, శ్యాం ప్రసాద్ రెడ్డి గారు కూడా తెలుసు నేను భూమి పుట్టినప్పుడు పుట్టిన వాడిని. 1974లో ఇండస్ట్రీకి వచ్చాను.. అలాంటిది చిన్నాపెద్దా లేకుండా నాతో నువ్వు మాట్లాడిన మాటలు రికార్డింగ్ కూడా ఉన్నాయి.. నిన్ను ఫిలింఛాంబర్ గేటుకి కొట్టేసి కొడతాను అని అన్నారట బాలాజీ.

గొప్ప హీరోయిన్లను చూసాను…

అంతేకాకుండా ఆమెను నిజం చెప్పమని నిజాయితీగా ఉండమని బెదిరించాడట. నా వయసెంత రష్మీ వయసు ఎంత ఒప్పుకున్న అంత రెమ్యూనరేషన్ తీసుకుని చివరిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి చివరకు మూడు నెలల తర్వాత వచ్చి సినిమాల్లో నటించిందని చెప్పుకొచ్చారు బాలాజీ. నేను శ్రీదేవి గారు లాంటి గొప్ప గొప్ప హీరోయిన్స్ ని చూశాను అని తెలిపారు. కానీ నటన పరంగా మాత్రం రష్మీ బాగా నటించింది. అంతేకాకుండా సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారు సమయంలో వన్ మోర్ అని ఎప్పుడూ అడగలేదు.. కానీ మెంటాలిటీ బాగాలేదు అని చెప్పుకొచ్చారు బాలాజీ నాగలింగం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మీ బాలాజీ నాగలింగం వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

పెళ్లి మాత్రమే చేస్తారా.. శోభనం కూడా చూపించండి.. జబర్దస్త్ స్కిట్స్‌పై ఫైర్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో మొదట్లో మంచి ఆదరణ పొందింది. కానీ రాను రాను రేటింగ్ కోసం ఎంతటి దానికైనా దిగజారుతుంది. ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో పై నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అంతేకాకుండా మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ షోని చూసి మరిన్ని బుల్లితెర షోలు కూడా తమ రేటింగ్ కోసం బాగా దిగజారుతుంది.

ఇప్పటికే జబర్దస్త్ లో రేటింగ్ కోసం యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ను జోడిని ముందుంచారు. ఇక వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అన్నట్లు ప్రేక్షకులలో ఆలోచనలు మొదలయ్యేలా చేశారు. అంతేకాకుండా గతంలో వీరి పెళ్లి కూడా బుల్లితెర వేదికగా చేయగా అదంతా నిజం కాదని కేవలం రేటింగ్ కోసమని ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశారు. నిజానికి ఏదైనా ఒక్కసారి చేస్తే కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అదే మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం ఆ షో విమర్శలు ఎదుర్కోక తప్పదు.

jabardasth

ఇదిలా ఉంటే తాజాగా వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక ఇందులో కూడా మళ్లీ పెళ్లి స్కిట్ చేశారు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. ఇందులో వీరికి జంటగా సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి, యాంకర్ రష్మీ పెళ్లి కూతుర్ల గెటప్ లో కనిపించారు. వీళ్లను చూసి సుధీర్, ఆది తమ డైలాగ్స్ తో రెచ్చిపోయారు. సుధీర్ మరింత ఓపెన్ గా మాట్లాడుతూ పదిన్నర అయింది ఏమీ లేదా అని అనడంతో ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. హైపర్ ఆది రాసిన ఈ స్కిట్ కు మల్లెమాల పై కూడా టార్గెట్ పడినట్లు తెలుస్తుంది.

ఇక నెటిజన్లు ఇటువంటివి చూడలేక.. మల్లెమాల అంటే మల్లెలు, మాలలు అర్థం వచ్చేటట్లు.. మల్లెమాలా? పెళ్లిళ్ల బ్రోకరా? అంటూ శోభనం చేసేది కూడా పెట్టండి అని ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. నిజానికి ఫ్యామిలీతో కలిసి చూసే ఈ షో లలో ఇటువంటివి స్కిట్ లను చేయడం సరైనది కాదని గతంలో జబర్దస్త్ కు విమర్శలు ఎదురుగా మళ్లీ అలాంటి స్కిట్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.