Tag Archives: ap government

Mahi v raghav: నేనేమీ 100 ఎకరాలు అడగలేదే.. విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన యాత్ర డైరెక్టర్?

Mahi v raghav: మహీ వి రాఘవన్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు .తాజాగా ఈయన దర్శకత్వం వహించినటువంటి యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ ప్రవేశం గురించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ మహి.

ఇక ఈయన యాత్ర సినిమాకు అంతంత మాత్రమే ఆదరణ వస్తుంది కేవలం వైఎస్ అభిమానులు మాత్రమే ఈ సినిమాని చూస్తున్నారు. ఇక ఈ సినిమా పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా చేసినందుకుగాను ఈయన ఏపీ ప్రభుత్వం నుంచి రెండు ఎకరాల స్థలాన్ని కానుకగా తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. అయితే గతంలోనే డైరెక్టర్ హార్స్లీ హిల్స్ ప్రాంతంలో స్టూడియో నిర్మాణం కోసం తనకు రెండు ఎకరాల స్థలం కావాలి అంటూ సీఎంని కోరిన సంగతి తెలిసిందే.

ఇలా జగన్ యాత్ర సినిమా చేసినందుకు గాను డైరెక్టర్ కు కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని రాసిచ్చారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై డైరెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా మహి ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను మదనపల్లిలో పుట్టి పెరిగాను ఇక్కడే చదువుకున్నాను. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది అని తెలిపారు.

రాయలసీమకు చేసిందేమీ లేదు…

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ రాయలసీమకు మాత్రం ఏ చిన్న సహాయం చేయలేకపోయిందని తెలిపారు. అందుకే నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే హార్స్లీ హిల్స్లో రెండు ఎకరాల స్థలం అడిగానని తెలిపారు. అందరిలా నేను ఏ 100 ఎకరాలు 50 ఎకరాలు స్థలం అడగలేదు ఇక్కడ ఓ మినీ స్టూడియో కట్టడం కోసం కేవలం రెండు ఎకరాలు మాత్రమే అడిగానని గత ప్రభుత్వాలు వాళ్ల వారికి ఇచ్చిన విధంగా నేనేమి అడగలేదు అంటూ ఈయన ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi: అభివృద్ధి వదిలేసి ఇండస్ట్రీపై పడి ఏడుస్తారు ఏంటి…. ఏపీ ప్రభుత్వం పై చిరు కామెంట్స్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఈయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.గత కొద్దిరోజులు క్రితం బ్రో సినిమా విషయంలో వైయస్సీపీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తుంది. అయితే తాజాగా చిరంజీవి ఈ విషయంపై ఏపీ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయ్యి 200 రోజులు పూర్తి కావడంతో చిత్ర బృందం ఒక వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాల్తేరు వీరయ్య చిత్ర బృందంతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అంబటి రాంబాబును టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ… మీలాంటి పెద్దవాళ్లు రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం, రోడ్ల గురించి, ప్రాజెక్టుల గురించి,పేదవారి ఆకలి తీర్చడానికి ఉపాధి ఉద్యోగ కల్పన గురించి మాట్లాడితే మాలాంటి వాళ్లంతా కూడా తలవంచి నమస్కారం చేస్తాము.

Chiranjeevi: పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏంటి…


ఇలా కాకుండా రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీపై ఏడుస్తారు ఎందుకు . ఇదేదో పెద్ద సమస్య లాగా చూడకండి అంటూ ఏపీ ప్రభుత్వం పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Ap Government: వాల్తేరు వీరయ్య…. వీర సింహారెడ్డికి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్….. ప్రీ రిలీజ్ వేడుకలకు నో పర్మిషన్!

Ap Government: సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో పోటీకి సై అంటున్నారు.వీరిద్దరూ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వాల్తేరు వీరసింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడంతో థియేటర్ల సమస్య కారణంగా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మైత్రి నిర్మాతలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సినిమాల పరిస్థితి వివరించి అదనపు షోలు టికెట్ల రేట్లు పెంపుదలపై మాట్లాడినట్టు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారని త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఆశగా ఎదురు చూశారు.ఇలా ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం ఎదురుచూస్తున్న మైత్రి మేకర్స్ కు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో నిర్వహించాలని భావించారు. అలాగే వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా మేకర్ సినిమా ఈవెంట్లను ప్లాన్ చేయడంతో ఈ ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించడానికి ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా సినిమా వేడుకలను ఏర్పాటు చేస్తే బందోబస్తు నిర్వహించడానికి చాలా కష్టతరంగా మారుతుంది.

Ap Government: మైత్రి వారికి షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్…

ఈ విధంగా బహిరంగంగా రోడ్లపై ఇలాంటి వేడుకలను నిర్వహించడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో వారిని కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బహిరంగ వేడుకలకు ఏపీ సర్కార్ అనుమతి తెలుపకపోవడంతో చేసేదేమీ లేక సినిమా ఈవెంట్లను మరొక ప్రాంతంలో నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా వెల్లడించనున్నారు.

Bheemla Nayak: కక్ష్య సాధింపు లేదంటూనే… భీమ్లా నాయక్ ను టార్గెట్ చేసిన ఏపీ ప్రభుత్వం!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన చిత్రం భీమ్లా నాయక్ సినిమా నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులు థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అయితే గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల విషయంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.

Bheemla Nayak: కక్ష్య సాధింపు లేదంటూనే… భీమ్లా నాయక్ ను టార్గెట్ చేసిన ఏపీ ప్రభుత్వం!

అయితే గతంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు అతని భీమ్లానాయక్ సినిమా పై తీవ్రమైన ప్రభావం చూపుతాయని పవన్ అభిమానులు భావించారు ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై స్పందిస్తూ మేము పవన్ కల్యాణ్ సినిమాను ఏ మాత్రం టార్గెట్ చేయడం లేదంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.

Bheemla Nayak: కక్ష్య సాధింపు లేదంటూనే… భీమ్లా నాయక్ ను టార్గెట్ చేసిన ఏపీ ప్రభుత్వం!

ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు చిత్రానికి ఏపీలో ఒక్కో టికెట్ ధర 200 చొప్పున అమ్మారు. ఇదేంటి అని ప్రశ్నించగా ఈ సినిమాకు స్పెషల్ పర్మిషన్ ఉందని థియేటర్ ఓనర్స్ వెల్లడించారు. ఇలా బంగార్రాజు సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధర 200 వరకు అమ్మారు. అదే పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే కేవలం రూ.70 టికెట్ ధర మాత్రమే ఉంది.

పవన్ కళ్యాణ్ మార్కెట్ ఐదు రెట్లు ఎక్కువ….


ఈ విషయం పక్కన ఉంచితే బంగార్రాజు సినిమా మాదిరిగా పవన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా లేవు. అలాగే బెనిఫిట్ షోస్ కూడా లేకపోవడంతో పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కు ఐదు రెట్ల మార్కెట్ ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమా పై ఏ విధమైనటువంటి కక్షసాధింపు లేదంటూనే ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Chiranjeevi: ‘పరువు తీశావయ్యా చిరంజీవి…’ మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి..!

Chiranjeevi: ఏపీలో టికెట్ రేట్లపై, టాలీవుడ్ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో సినీ ప్రముఖులు చర్చించిన విషయం తెలిసిందే. ఏపీలో గత రెండు నెలల నుంచి తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో.. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి, అలీ, పోసాని, కొరటాల శివ వంటి ప్రముఖులు భేటీ అయ్యారు.

Chiranjeevi: పరువు తీశావయ్యా చిరంజీవి అంటూ… మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి..!

ఇండస్ట్రీలో నెలకొని ఉన్న సమస్యలను గురించి ప్రభుత్వానికి వివరించారు. అయితే ఈ భేటీలో టికెట్ ధరలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు కూడా చెప్పారు స్టార్ హీరోలు. అయితే ఇప్పడు ఇదే అంశం చాలా చర్చనీయాంశం అయింది.

Chiranjeevi: పరువు తీశావయ్యా చిరంజీవి అంటూ… మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి..!

స్టార్లు అని చెప్పుకునేవారు ఇలా చేతులు జోడించి అడుక్కోవడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వివాదాస్పద డైరెక్టర్.. ఆర్జీవీ ఈ భేటీపై వ్యంగ్యంగా వరసగా ట్విట్లు చేశారు. సాధారణ ప్రజా ప్రతినిధి జగన్, పేర్ని నాని ముందు మన హీరోలంతా జీరో అయ్యారని వ్యాఖ్యానించారు. మెగా, సూపర్, రెబెల్ స్టార్లంతా… ఓమెగా స్టార్(జగన్) ముందు తక్కువే అన్నట్లు వ్యాఖ్యానించారు. 

టికెట్ రేట్లు పెరగడం వల్ల ట్రిపుల్ ఆర్ సినిమాకు..

ఇదిలా ఉంటే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ అంశంపై మాట్లాడారు. తన యూట్యూబ్ ఛానెల్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి చేతులు జోడించి జగన్ ను వేడుకున్నట్లు ఒక వీడియో లీకైంది. ఆ వీడియో గురించి తమ్మారెడ్డి స్పందిస్తూ టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి తొలి అడుగు వేశారని అన్నారు. చిరంజీవి ఇండస్ట్రీ బిడ్డ అని చెప్పినా మేము ఆయనను ఇండస్ట్రీ పెద్దగా భావిస్తామని తమ్మారెడ్డి తెలిపారు. అయితే మనకంటూ ఆత్మగౌరవం ఉందని.. మనం అడుక్కునే స్థాయికి దిగజారాలా.. ఈ వీడియోని చూస్తే చిరంజీవి అడుకున్నట్లుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. పరువు తీశావయ్యా చిరంజీవి అంటూ వ్యాఖ్యానించాడు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ట్రిపుల్ ఆర్ సినిమాకు మరో రూ. 15 కోట్లు అదనంగా రావచ్చని.. ఆ సినిమా రేంజ్ కు అతి నథింగ్ అని ఆయన అన్నారు. మెగాస్టార్ వంటి పెద్ద హీరో ఇలా అడుక్కోవడం బాధగా అనిపించిందని.. ఆయన అన్నారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bangarraju Movie: బంగార్రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించలేదా.. ఎందుకీ పక్షపాతం!

Bangarraju Movie: గత కొంతకాలం నుంచి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య పెద్ద యుద్ధం నడుస్తోందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిఒక్కరిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గించింది.ఈ క్రమంలోనే సినిమా రేట్లను తగ్గించడం వల్ల చాలామంది నష్టపోతారని టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరొక సారి పునరాలోచన చేయాలని సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Bangarraju Movie: బంగార్రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించలేదా.. ఎందుకీ పక్షపాతం!

ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో కెల్లా బంగార్రాజు సినిమా పెద్ద సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పకపోయినా అబవ్ యావరేజ్ అని చెప్పవచ్చు.

Bangarraju Movie: బంగార్రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించలేదా.. ఎందుకీ పక్షపాతం!

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. మొదటివారం ఎంతో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా దాదాపు 80 శాతం పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఏ సినిమాలో జరగని అద్భుతం బంగార్రాజు సినిమాలో ఎందుకు జరిగింది అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

ఈ సినిమాకు పర్మిషన్ ఉంది..

సాధారణంగా ఏపీ ప్రభుత్వం కేటాయించిన టికెట్ల రేట్లను బట్టి ఏ సినిమాకి కూడా 100 రూపాయలకు పైగా టికెట్లను అమ్మకూడదు. కానీ నాగార్జున బంగార్రాజు సినిమా కోసం ఏపీలో థియేటర్లు 150,200 రూపాయలతో టికెట్లు అమ్మారు.ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ సినిమాకు పర్మిషన్ ఉంది అనే సమాధానం వినబడుతోంది.ఈ క్రమంలోనే ఎంతోమంది ఏపీ ప్రభుత్వానికి బంగార్రాజు సినిమా విషయంలో పేదవారు కనిపించడం లేదా ఎందుకీ పక్షపాతం అంటూ పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Cm Jagan: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..!

Cm Jagan: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే మద్యం అమ్మకాలకు సంబంధించి మొదటి నుంచి కూడా నిబంధనలు జారీ చేస్తు వస్తున్న ప్రభుత్వం.. తాజాగా మద్యం విక్రయ వేళలను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Cm Jagan: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..!

కొత్త నిబంధనల ప్రకారం.. రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆబ్కారీ శాఖ అనుమతిచ్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహించుకొవచ్చని తెలిపింది.

Cm Jagan: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..!

అంతే కాకుండా విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేసే వారు. ఈ సమయాన్ని గంట పొడిగించింది ప్రభుత్వం. మద్యం విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఈ మధ్యకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

సంక్రాంతికి ముందే ఈ నిబంధనలు..

కొన్ని రోజుల కిందట మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసిన ప్రభుత్వం.. వ్యాట్ తో పాటు.. స్పెషల్‌ మార్జిన్‌, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని క్రమబద్ధీకరించింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ వేళలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. సంక్రాంతికి ముందే ఈ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉన్నా.. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోంటారనే ఉద్దేశ్యంతో వాయిదా వేసినట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దానిలో భాగంగానే.. రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను జనవరి 18 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ నైట్ కర్ఫ్యూ జనవరి 31 వ తేదీ వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

Bangarraju: నాగార్జున బంగార్రాజు చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అక్కినేని మల్టీస్టారర్ సంక్రాంతి హిట్‌ని సాధించడానికి గ్రౌండ్ రిలీజ్ కాబోతోంది. పండుగకు పెద్దగా విడుదలయ్యే ఇతర చిత్రాలేవీ లేవు. దీంతో దీనిపై విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల లేకపోవడంతో బంగార్రాజుకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ , ఆక్యుపెన్సీ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

ఈ విషయంపై మంత్రి పేర్ని నాని కూడా సంక్రాంతి సినిమాలను విడుదల తేదీలను వాయిదా వేయమని కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. సినిమాలను వాయిదా వేయమని సూచించిన ప్రభుత్వం ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ , ఆక్యుపెన్సీ పరిమితుల ప్రణాళికలను కూడా వాయిదా వేసింది. జనవరి 18 నుంచి కర్ఫ్యూ అంటూ పేర్కొంది ప్రభుత్వం.


ఇప్పుడు అది అతనికి ఈ మార్గంలో..

దీనిని బట్టి చూస్తే.. ఏపీ ప్రభుత్వం నాగార్జునకు ఫేవర్ గా ఉంటుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
సినీ పరిశ్రమను కలవరపెడుతున్న ఏపీ టిక్కెట్ల సమస్యపై నాగార్జున సినీ పరిశ్రమ వైపు నిలవకుండా.. ఏపీ ప్రభుత్వం వైపు మాట్లాడారు. అంతే కాదు.. టికెట్స్ ను తగ్గించడం కరెక్ట్ అని.. తన సినిమాకు ఏ మాత్రం ప్రాబ్లం లేదు అంటూ.. ఏపీ ప్రభుత్వానికి మద్ధతుగా మాట్లాడారు. అందుకే అతనికి ఈ సహాయాలు లభించాయని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున ఏపీ ప్రభుత్వంతో చాలా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అది అతనికి ఈ మార్గంలో సహాయపడింది. ఇక అంతకముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా సందర్భంలో కూడా.. 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు అని ఏపి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక ఇవన్నీ చూస్తుంటే.. నాగార్జునకు ఏపీ ప్రభుత్వం ఫేవర్ చేస్తుందంటూ.. సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

CVL Narasihma rao: టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చేసేది కరెక్టే…సీవీఎల్‌ షాకింగ్ కామెంట్స్!

CVL Narasihma rao: ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ కు మధ్య టికెట్ ధరలపై వివాదం నడుస్తూనే ఉంది. టికెట్ ధరలను భారీగా తగ్గించడంపై ఇండస్ట్రీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వం, అటు టాలీవుడ్ మధ్య మాటల యుద్దం కూడా జరుగుతోంది.

CVL Narasihma rao: టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చేసేది కరెక్టే…సీవీఎల్‌ షాకింగ్ కామెంట్స్!

అయితే టికెట్ ధరల తగ్గింపు పై ఇప్పటికే పలు మార్లు ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వంతో సమావేశం అయ్యారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై వెనక్కి వెళ్లేలా కనిపించడం లేదు. టికెట్ ధరపై వరసగా ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ అగ్గి రాజేస్తున్నారు. గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు ముందు హీరో నాని.. థియేటర్ల కలెక్షన్లకు, కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ కామెంట్ చేశారు.

CVL Narasihma rao: టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చేసేది కరెక్టే…సీవీఎల్‌ షాకింగ్ కామెంట్స్!

ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్సందించాడు. హీరో నానికి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ, మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్ వార్ జరుగుతోంది. 

పెద్ద సినిమాలు చేస్తామంటున్న నిర్మాతలు..

ఇదిలా ఉంటే కొంతమంది చిన్న నిర్మాతలు, సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రముఖ నటుడు సీవీఎల్ నరసింహరావు అన్నారు. పది మంది ప్రోడ్యూసర్లు సినిమా టికెట్లపై రాద్ధాంతం చేస్తున్నారని అయన అన్నారు. పెద్ద సినిమాలు చేస్తామంటున్న నిర్మాతలు కింది స్థాయి కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మామూలు సినిమా అభిమాని టికెట్ ధర రూ. 1000 ఉంటే ఫ్యామిలీతో ఎలా సినిమా చూడగలుగుతాడని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరల పై ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఈ సందర్భంగా సీవీఎల్ నరసింహ రావు పేర్కొన్నారు.

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ విమర్శలు.. దమ్ముంటే అలా చేసి చూపించండి!

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడు షేర్ చేసిన వీడియోలో.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న టికెట్ల వ్యవహారంపై మాట్లాడారు. దివంగత వైఎస్ రాజ శేఖర్ రెడ్డి కుమారుడు కాకపోతే వైఎస్ జగన్ భారీ సంఖ్యలో ఓట్లను సాధిస్తారా అని ప్రశ్నించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న భావన వల్లనే ప్రజలు వైఎస్ జగన్‌కు ఓట్లు వేశారని అన్నారు. వినియోగదారుల(సినిమా టికెట్ల) సంతృప్తిపై ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టిన ప్రజలు తమ పాలనపై నిస్సహాయత వ్యక్తం చేస్తే మీరు దిగిపోతారా..? సినిమా రేట్ల వ్యవహారంలో మీ విధానం అలాగే ఉందని విపర్శలకు దిగాడు.

ఉత్పత్తికి, వినియోదారుడికి మధ్య ప్రభుత్వం జోక్యం ఎందుకు?. బాహుబలిని రూ.50 కోట్లతో తీస్తే.. నేను ఐస్ క్రీమ్ ను రూ.5లక్షలతో తీస్తాను. రెండిటికి ఒకటే మూవీ రేట్ అంటే అది మొత్తం మార్కెట్ ని నాశనం చేస్తోంది. టికెట్లు కొనే వినియోగదారుడు ఇబ్బంది పడకూడదని.. ప్రభుత్వం అంటుంది.. కదా.. ఏదో ఒక సినిమాను మీరు తీసి.. థియేటర్లలో ఫ్రీగా వేసేయండి అంటూ విరుచుకుపడ్డాడు.

మీకు అంత కెపాసిటీ లేనప్పుడు.. అదే కెపాసిటీ ఉన్న వ్యక్తులు తీసే సినిమాలకు ఇలాంటివి పెట్టడం సరికాదన్నారు. ఇటీలవల పేర్నీ నాని మాట్లాడుతూ.. సినిమా నచ్చకపోతే ఎవరి డబ్బులు వాళ్లకి ఇస్తారా అని అన్నారు..? మనం ఏదైనా హోటల్ కి వెళ్లి.. ఇష్టం వచ్చింది తిని.. బిల్ నచ్చలేదని కట్టకుండా బయటకు వస్తే ఎలా ఉంటుంది.. సేమ్ సినిమాలో కూడా అంతే అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

ప్రతీ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి కానీ..

ఏదైనా కూర వండినప్పుడు ఆ కూరగాయ చూసి బాగాలేదు అని చెప్పడానికి.. ఆ కూర రుచి చూసి బాగాలేదు అని చెప్పడానికి చాలా తేడా ఉంటుందని లాజికల్ గా మాట్లాడారు. ప్రభుత్వం అంటే ప్రతీ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి కానీ.. సమస్యల్లోకి నెట్టోద్దు అంటూ చెప్పుకొచ్చాడు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే.. కేవలం ఐదు నిమిషాల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కానీ హీరో నాని ఎదో అన్నాడని.. సిద్ధార్థ్ ఏదో అన్నాడని.. ఎవరికి వచ్చినట్లు వాళ్లు మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని అన్నాడు. అతడు మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.