Featured

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ విమర్శలు.. దమ్ముంటే అలా చేసి చూపించండి!

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడు షేర్ చేసిన వీడియోలో.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న టికెట్ల వ్యవహారంపై మాట్లాడారు. దివంగత వైఎస్ రాజ శేఖర్ రెడ్డి కుమారుడు కాకపోతే వైఎస్ జగన్ భారీ సంఖ్యలో ఓట్లను సాధిస్తారా అని ప్రశ్నించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న భావన వల్లనే ప్రజలు వైఎస్ జగన్‌కు ఓట్లు వేశారని అన్నారు. వినియోగదారుల(సినిమా టికెట్ల) సంతృప్తిపై ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టిన ప్రజలు తమ పాలనపై నిస్సహాయత వ్యక్తం చేస్తే మీరు దిగిపోతారా..? సినిమా రేట్ల వ్యవహారంలో మీ విధానం అలాగే ఉందని విపర్శలకు దిగాడు.

ఉత్పత్తికి, వినియోదారుడికి మధ్య ప్రభుత్వం జోక్యం ఎందుకు?. బాహుబలిని రూ.50 కోట్లతో తీస్తే.. నేను ఐస్ క్రీమ్ ను రూ.5లక్షలతో తీస్తాను. రెండిటికి ఒకటే మూవీ రేట్ అంటే అది మొత్తం మార్కెట్ ని నాశనం చేస్తోంది. టికెట్లు కొనే వినియోగదారుడు ఇబ్బంది పడకూడదని.. ప్రభుత్వం అంటుంది.. కదా.. ఏదో ఒక సినిమాను మీరు తీసి.. థియేటర్లలో ఫ్రీగా వేసేయండి అంటూ విరుచుకుపడ్డాడు.

మీకు అంత కెపాసిటీ లేనప్పుడు.. అదే కెపాసిటీ ఉన్న వ్యక్తులు తీసే సినిమాలకు ఇలాంటివి పెట్టడం సరికాదన్నారు. ఇటీలవల పేర్నీ నాని మాట్లాడుతూ.. సినిమా నచ్చకపోతే ఎవరి డబ్బులు వాళ్లకి ఇస్తారా అని అన్నారు..? మనం ఏదైనా హోటల్ కి వెళ్లి.. ఇష్టం వచ్చింది తిని.. బిల్ నచ్చలేదని కట్టకుండా బయటకు వస్తే ఎలా ఉంటుంది.. సేమ్ సినిమాలో కూడా అంతే అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

ప్రతీ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి కానీ..

ఏదైనా కూర వండినప్పుడు ఆ కూరగాయ చూసి బాగాలేదు అని చెప్పడానికి.. ఆ కూర రుచి చూసి బాగాలేదు అని చెప్పడానికి చాలా తేడా ఉంటుందని లాజికల్ గా మాట్లాడారు. ప్రభుత్వం అంటే ప్రతీ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి కానీ.. సమస్యల్లోకి నెట్టోద్దు అంటూ చెప్పుకొచ్చాడు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే.. కేవలం ఐదు నిమిషాల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కానీ హీరో నాని ఎదో అన్నాడని.. సిద్ధార్థ్ ఏదో అన్నాడని.. ఎవరికి వచ్చినట్లు వాళ్లు మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని అన్నాడు. అతడు మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

9 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago