Hero And Villians : వాళ్లు హీరోలే కానీ.. ఇక్కడ మాత్రం విలన్లు.. ఎందుకో ఇలా?
Hero And Villians : సీని పరిశ్రమలో ఒక దగ్గర క్యారెక్టర్ ఆర్టిగా చేశారంటే.. కొన్ని రోజుల తర్వాత అతడి యాక్టింగ్ స్కిల్ మంచిగా ఉంటే.. హీరో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ కొనసాగుతోంది.
తమిళం, మళయాళం, కన్నడలో సూపర్ స్టార్ హీరోలుగా..తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు తెలుగులో మాత్రం విలన్ అవతరాం ఎత్తుతున్నారు. దానికి గల కారణం తెలుగులో అక్కడ ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఇస్తుండటమే అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇలా హీరో అవతరామెత్తి.. ఇటు విలన్ గా రాణిస్తున్న వాళ్లు ఎవరో ఓ సారి చూసేద్దాం..
అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో భారీ విజయం సాధించి ఉప్పెన సినిమా విలన్ గురించి చెప్పుకోవాలి. దీనిలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన విజయ్ సేతుపతి తమిళంలో పెద్ద హీరో. అక్కడ అతడు తీసే ప్రతీ సినిమా హిట్ గా నిలుస్తోంది. ఇలా అతడు తెలుగులో మాత్రం విలన్ అవతారమెత్తాడు.
ఇక రెండో స్థానంలో ఉన్న వ్యక్తి సుదీప్ . ఇతడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడు. కానీ కన్నడంలో సుదీప్ పెద్ద స్టార్. అంతే కాదు అతడి విజయ్ హీరోగా నటించిన పులి, సల్మాన్ హీరోగా నటించిన దబాంగ్ 3లో కూడా విలన్ అవతారమెత్తాడు.
రేసుగుర్రంలో హీరో పాత్రకు ఎంత ప్రాధన్యం ఉందో విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. అందులో బోజ్ పురికి చెందిన రవి కిషన్ విలన్ గా యాక్ట్ చేశాడు. బోజ్ పురిలో అతడు నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.
తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆర్య. ఇతడు కూడా అల్లు అర్జున్ సినిమా వరుడులో విలన్ అవతారమెత్తి.. మెప్పించాడు. తాజాగా మలయంలో స్టార్ హీరోగా ఉన్న ఫహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో విలన్ గా నటించాడు. పుష్ప పార్ట్ 2లో ఇతడి పాత్ర ఎక్కువగా ఉండనుంది. తాజాగా కన్నడ దునియా విజయ్ కూడా విలన్ అవతారమెత్తాడు. నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా అధిక రెమ్యూనరేషన్ కోసం ఆశపడి వాళ్లు ఇలా.. విలన్ అవతారమెత్తుతున్నారనేది టాక్.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…