Tag Archives: aswini

Aswini: కాబోయ భర్త నల్లగా ఉన్న పర్లేదు.. అది మాత్రం ఉండాలంటున్న బిగ్ బాస్ అశ్విని!

Aswini: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి అశ్విని ఈ కార్యక్రమానికి రాకముందు ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన పెద్దగా గుర్తింపు లేదు కానీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ ద్వారా అశ్విని ఎంతో ఫేమస్ అయ్యారు.

బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా అశ్వినికి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈమె తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాల గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తనకు కాబోయే భర్త అందంగా ఉండాలి బాగా డబ్బు ఉండాలి అనే ఉద్దేశం తనకు లేదని తన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు తను అందంగా లేకుండా నల్లగా ఉన్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు కానీ తనకు మాత్రం మంచి మనసు ఉంటే చాలు నన్ను మంచిగా చూసుకుంటే చాలని అశ్విని తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ తెలిపారు.

మంచి మనసు ఉండాలి..

మనం ఎలాగో తనని బాగా చూసుకుంటాం అలాగే నన్ను కూడా బాగా చూసుకునేవాడు వస్తే చాలు అంటూ ఈమె తెలిపారు. ఇక ఈమెకు కాబోయే భర్త గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వెంటనే యాంకర్ అంటే మీరు ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నారా అనే ప్రశ్న వేశారు. దీంతో ఈమె మన వెంట చాలామంది పడుతుంటారు కానీ మనకంటూ కొందరు నచ్చాలి కదా అంటూ తాను ఇప్పటికీ సింగిల్ అనే విషయాన్ని తెలిపారు.

Aswini: దయచేసి నా తమ్ముడిని బయటకు తీసుకురండి… ప్రశాంత్ అరెస్టుపై అశ్విని కామెంట్స్!

Aswini: బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి గ్రాండ్ ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసినటువంటి రచ్చ ఆయన మెడకే చుట్టుకుంది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహం కనబరిస్తూ ర్యాలీలు చేయడం ఇతరుల కారులపై దాడి చేయడం గవర్నమెంట్ బస్సుల అద్దాలు పగలగొట్టడం వంటివి చేయటంతో ఏకంగా పల్లవి ప్రశాంతను పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టారు.

ఇలా అభిమానులు అత్యుత్సాహం కనబరుస్తూ ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ పై పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే బోలె ఏకంగా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే..అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ కి లా అండ్ ఆర్డర్ కూడా ఏమీ తెలియదు.

గెలిచాను అన్న సంతోషంతో ఆయన ర్యాలీ చేశారని, ఆయన ఎంతో జెన్యూన్ పర్సన్ కానీ అభిమానులు చేసిన పనికి తనని అరెస్టు చేయడం సరైంది కాదని చెప్పారు. ఈ క్రమంలోని అశ్విని కూడా ఈ ఘటన పై స్పందించారు పల్లవి ప్రశాంత్ అరెస్టు అయిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది అంటూ ఈమె ఈ అరెస్టు విషయంపై స్పందించారు.

ప్రశాంత్ కు మద్దతుగా అశ్విని..


పల్లవి ప్రశాంత్ కు ఇలాంటివన్నీ పెద్దగా తెలియదు తను చాలా మంచివాడు, తనని అరెస్టు చేశారని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యారని దయచేసి మా తమ్ముడిని బయటకు తీసుకురండి అంటూ ఈమె కూడా పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించారు.అయితే అదే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు అశ్విని కారుపై కూడా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈమె పల్లవి ప్రశాంత్ కు మద్దతుగా నిలిచారు.

Aswini: బోర్ కొట్టిన ప్రతిసారి పవన్ సార్ నన్ను కారవాన్ లోకి పిలిచేవారు.. ఆయన దేవుడు: అశ్విని

Aswini: ప్రస్తుతం ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అశ్విని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె తన ఆటతీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అశ్వినికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అశ్విని నటిగా ఇదివరకు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో కూడా చిన్న పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనతో ఎలా ఉండేవారో చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పవన్ కళ్యాణ్ సార్ కేరవాన్ లోనే ఎక్కువగా ఉండే దానిని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి బోర్ కొట్టిన ప్రతిసారి నన్ను కేరవాన్ లోకి పిలిపించుకొని మంచి పాట పాడమ్మా అంటూ నాతో పాట పాడించుకునేవారని ఇక ఆయన తీసుకునే స్నాక్స్ ఫుడ్ కూడా నేను కూడా తినేదానినని ఎక్కువగా తనతో పాటే కారవాన్ ఉండే దానిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాతో పాట పాడించుకునేవారు…

ఇక ఈ సినిమాలో ఆడెవడన్న ఈడెవ్వడన్నా అనే పాట దాదాపు 800 మందితో షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో నేను కారులోనే ఉండిపోయాను చాలా ఆలస్యం అవ్వడంతో నన్ను తిడతారని చాలా భయపడ్డాను అప్పటికే కో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారని ఆలస్యంగా అక్కడికి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏమీ అనకుండా నువ్వేమీ కంగారు పడకు చిల్ అవ్వు అంటూ మాట్లాడారని అశ్విని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు చూసి అందరూ ఆయనని దేవుడితో సమానంగా భావిస్తారు అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Bigg Boss 7: కెప్టెన్సీ టాస్క్ విషయంలో అతి చేసిన కంటెస్టెంట్లు… కెప్టెన్సీ రద్దుచేసి షాక్ ఇచ్చిన బిగ్ బాస్!

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ కార్యక్రమం 12వ వారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో కెప్టెన్సీ టాస్కుల పెద్ద ఎత్తున పోటీపడుతూ కెప్టెన్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేశారు. ఇక ఈ టాస్క్ కూడా చివరికి రాగా కేవలం కంటెస్టెంట్ల ఈగో ప్రాబ్లం వల్ల ఏకంగా ఈ వారం కెప్టెన్సీనే బిగ్ బాస్ రద్దు చేసి షాక్ ఇచ్చారు.

చివరిలో కెప్టెన్సీదారుల పోటీలో గౌతమ్ అమర్ ఉన్నారు. అయితే వీరిలో ఎవరో ఒకరిని ఎంచుకొని మరొకరి ఫోటో కాల్చి వేయాలని చెప్పారు. ఈ నిర్ణయం శోభాశెట్టికి శివాజీకి ఇవ్వగా శివాజీ గౌతమ్ కృష్ణను సపోర్ట్ చేయగా, శోభ అమర్ ను సపోర్ట్ చేస్తుంది. వీరిద్దరిలో ఎవరే ఒకరిని మాత్రమే ఎంచుకోవలసి ఉండగా వీరిద్దరూ కూడా కాంప్రమైజ్ కాలేదు చివరికి అమర్ తనని ఎలాగైనా కెప్టెన్ చేయాలి అని చాలా దీనంగా వేడుకున్నారు. అయినప్పటికీ ఎవరూ కూడా తగ్గడం లేదు. ఇక శోభ శెట్టి అన్న మాటలకు గౌతమ్ కూడా హర్ట్ అయ్యాడు.

ఇలా గౌతమ్ హర్ట్ కావడంతో తాను కూడా తగ్గేదేలే అన్నట్టు పంతానికి ఉన్నారు. అప్పటికి బిగ్ బాస్ హెచ్చరిస్తూ సరైన సమయం ఇచ్చాడు కానీ ఆ సమయం పూర్తి అయినప్పటికీ కూడా ఎవరు కాంప్రమైస్ కాకపోవడంతో బిగ్ బాస్ చేసేదేమీ లేక గౌతమ్ అలాగే అమర్ ఇద్దరి ఫోటోలను కాల్చివేసి ఈ వారం కెప్టెన్సీ రద్దు చేశారని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వీరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేసుకొని ఉంటే సరిపోయేదని ఈగో ప్రాబ్లం వల్ల కెప్టెన్సీని రద్దు చేసుకున్నారని చెప్పాలి.

డేంజర్ పొజిషన్లో రతిక, అశ్విని…

మరి వీకెండ్ లో భాగంగా నాగార్జున వచ్చినప్పుడు ఈ వారం కెప్టెన్ గా ఎవరినైనా ఎంపిక చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా శోభ శెట్టి ప్రియాంక తప్ప మిగిలిన 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే డేంజర్ పొజిషన్లో అశ్విని రతిక ఉన్నారని చెప్పాలి. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. గతవారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది.

పునీత్ మరణంపై తొలిసారి స్పందించిన భార్య.. ఏం చెప్పారంటే?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేడు,రాడు మరణ వార్త విని ఇప్పటికి 12 మంది అభిమానులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ ఘటనలో పునీత్ కుటుంబాన్ని కలిచివేస్తున్నాయి. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక మరణం తర్వాత మొదటిసారిగా తన భార్య అశ్విని స్పందించింది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిసింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ మరణం తన కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె తెలిపింది.పునీత్ ఇక లేడు అన్న విషయం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె తెలిపింది. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమ కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అంటూ ఆమె తెలిపింది.

అలాగే పునీత్ మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరు ఆత్మహత్యకు పాల్పడిన మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు అని తెలిపింది అశ్విని. అశ్విని తో పాటు హీరో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర లు కూడా అభిమానులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

అదేవిధంగా అంత్యక్రియల దృశ్యాలను పదే పదే ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పునీత్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ ని కడసారిగా చూసుకునేందుకు కంఠీరవ స్టూడియో కి లక్షలాదిగా అభిమానులు తరలి వచ్చారు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు సైతం అతని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.