కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం భారత సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేడు,రాడు మరణ వార్త విని ఇప్పటికి 12 మంది అభిమానులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ ఘటనలో పునీత్ కుటుంబాన్ని కలిచివేస్తున్నాయి. ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక మరణం తర్వాత మొదటిసారిగా తన భార్య అశ్విని స్పందించింది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిసింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ మరణం తన కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆమె తెలిపింది.పునీత్ ఇక లేడు అన్న విషయం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె తెలిపింది. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమ కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అంటూ ఆమె తెలిపింది.
అలాగే పునీత్ మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరు ఆత్మహత్యకు పాల్పడిన మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు అని తెలిపింది అశ్విని. అశ్విని తో పాటు హీరో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర లు కూడా అభిమానులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.
అదేవిధంగా అంత్యక్రియల దృశ్యాలను పదే పదే ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పునీత్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ ని కడసారిగా చూసుకునేందుకు కంఠీరవ స్టూడియో కి లక్షలాదిగా అభిమానులు తరలి వచ్చారు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు సైతం అతని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…