Tag Archives: balakrishna

NTR: ఎన్టీఆర్ కి అందని పిలుపు..కావాలనే తొక్కేస్తున్నారంటు అభిమానులు ఆందోళన..?

NTR: నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ నటన విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కేవలం మన భారతీయ సినీ దర్శకులు మాత్రమే కాకుండా హాలీవుడ్ దర్శకుడు కూడా ఎన్టీఆర్ నటన మీద ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఆశపడుతున్నట్లు కూడా వెల్లడించారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో తాత వారసత్వాన్ని నిలబెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ని కావాలని తొక్కేస్తున్నారంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

నందమూరి కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవని అందరికీ తెలిసిన విషయమే. నందమూరి కుటుంబంలో ఎన్ని గొడవలు అయినా ఉండవచ్చని.. అయితే ఆ గొడవల వల్ల ఎన్టీఆర్ ను అవమానించడం సరికాదని ఫాన్స్ మండిపడుతున్నారు. తాజాగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ ను ఆహ్వానించకపోవడం చాలా అన్యాయం అని. అలా చేయడం ముమ్మాటికీ తప్పేనని నందమూరి కుటుంబ సభ్యుల మీద తారక్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

NTR: నందమూరి వారసత్వాన్ని నిలబెడుతున్న తారక్….

నందమూరి కుటుంబం నుండి బాలయ్య తప్ప మిగిలిన హీరోలు ఎవరూ కూడా తన తాత వారసత్వాన్ని నిలబెట్ట లేకపోతున్నారని కానీ తారక్ మాత్రం ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా నందమూరి కుటుంబం కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నాడు. అలాంటి తారక్ ను తొక్కేయడానికి ప్రయత్నించవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.ఈ పరిస్థితి రిపీట్ కాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.

Balakrishna -Chiranjeevi: బాలయ్యకు గెస్ట్ హౌస్ ఇచ్చిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..?

Balakrishna -Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి మద్య అనుబంధం గురించి రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారు మాత్రం తమ మద్య ఏలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. సినిమాల పరంగా వీరిమధ్య గట్టి పోటీ ఉన్న సంగతి వాస్తవమే. వీరిద్దరూ నటించిన ఎన్నో సినిమాలు థియేటర్లలో పోటీపడ్డాయి. కొన్ని సందర్భాలలో ఎవరో ఒకరు హిట్టు కొడితే మరి కొన్ని సందర్భాలలో ఇద్దరు నటించిన సినిమాలు కూడా హిట్ అందుకునేవి.

తాజాగా సంక్రాంతి కానుకగా మరొకసారి వీరిద్దరూ కూడా థియేటర్లలో పోటీపడ్డారు. వీరసింహారెడ్డి సినిమా ద్వారా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాగా.. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే వీరిద్దరూ నటించిన సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి. అయితే వీరిద్దరిని కలిసి ఒకే స్క్రీన్ మీద చూడాలని ఇరువురి అభిమానులు ఆశపడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బాలయ్య బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. చిరు, బాలయ్యల మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపే ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణ కోసం చిరు తన గెస్ట్ హౌస్ ని వాడుకోమని ఇచ్చాడు.

Balakrishna -Chiranjeevi: బాలయ్య 50వ సినిమా…

నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా షూటింగ్ కోసం చెన్నైలోని వెల్లిచ్చెరి ప్రాంతంలో ఉన్న హనీ హౌజ్ అనే గెస్ట్ హౌస్ ని వాడుకోమని చిరు తన గెస్ట్ హౌస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 90 శాతం ఈ గెస్ట్ హౌస్ లో బాలయ్య సినిమా షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 25 1990లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇది. ఎందుకంటే ఇది బాలకృష్ణ 50వ సినిమా. ఇలా చిరు, బాలయ్య మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.

Gopichand: ఇండస్ట్రీకి వచ్చి నువ్వేం పీకావ్… హీరో గోపీచంద్ సూటిగా ప్రశ్నించిన డైరెక్టర్?

Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి గోపీచంద్ ఈ మధ్యకాలంలో వరుస ఫెయిల్యూర్ సినిమాలను చవిచూస్తున్నారు అయితే తాజాగా ఈయన లక్ష్యం లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా డైరెక్టర్ తేజ గారితో కలిసి గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తేజ గారు ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ గోపీచంద్ నుంచి సమాధానం రాబట్టారు.

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తేజ ప్రశ్నిస్తూ రామబాణం సినిమా టైటిల్ బాలయ్యతో అనౌన్స్ చేయించారు. ఎందుకు అంటూ ప్రశ్నలతో మొదలుపెట్టారు.నాతో సినిమా చేస్తానని హీరోయిన్ సెట్ కాకపోతే వేరే సినిమాకు వెళ్ళవు తర్వాత నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అని ప్రశ్నించగా అందుకు గోపీచంద్ వివరణ ఇచ్చుకున్నారు.

Gopichand: మీ నాన్న ఎంతో గొప్పోడు…


ఇక రామబాణం డైరెక్టర్ తో గొడవలు గురించి కూడా ఈ సందర్భంగా తేజ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఇక గోపీచంద్ తండ్రి ఇండస్ట్రీలో ఓ గొప్ప డైరెక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇక తన తండ్రి గురించి ప్రశ్నిస్తూ…మీ నాన్న ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మరి నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఏం పీకావ్ అంటూ సూటిగా గోపీచంద్ ను ప్రశ్నించారు.మరి ఈ ప్రశ్నలన్నింటికీ ఈయన ఎలాంటి సమాధానాలు చెప్పారు అనే విషయం తెలియాలి అంటే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాలి.

Sukumar: సుకుమార్ ఇంట్లో చిరు బాలయ్య ఫోటోలు… ఆ ఫోటోలు పెట్టడానికి కారణం అదేనా?

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంతకాలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా గతంలో బాలకృష్ణ ,చిరంజీవి గురించి సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ తన ఇంట్లో ఒకవైపు చిరంజీవి ఫోటోని మరొకవైపు బాలకృష్ణ ఫోటోని పెట్టినట్లు ఒక షో లో వెల్లడించాడు. అయితే అందుకు పెద్ద కారణం ఉందని తెలిపాడు.

సుకుమార్ కుటుంబంలో ఉన్న నలుగురు అన్న దమ్ములలో పెద్దన్నయ్య బాలకృష్ణకి ఫ్యాన్ కాగా.. రెండు, మూడవ అన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్స్. పెద్దన్నయ్యకు ఇష్టం కాబట్టి బాలయ్య ఫోటో ఓవైపు.. మిగతా ఇద్దరు అన్నయ్యల కోసం మరోవైపు చిరంజీవి ఫోటో ఇంట్లో పెట్టుకున్నాడని తెలిపాడు. ఇక వీరిద్దరిలో ఎవరీ సినిమా రిలీజ్ అయిన ఆరోజు ఇంట్లో పెద్ద సందడి ఉంటుందని సుకుమార్ తెలిపాడు.

Sukumar: పుష్ప 2 పనులలో బిజీగా సుకుమార్…

ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో సుకుమార్ బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమా మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవటంతో పుష్ప 2 మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల అంచనాలకు చేరువయ్యేలా సుకుమార్ మొదటి పార్ట్ కన్నా రెండవ పార్ట్ కోసమే ఎక్కువ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Balakrishna: సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటూ బాలయ్య పోస్టర్…. చిరంజీవిని టార్గెట్ చేస్తూ వేసారా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి పోటీగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 100 డేస్ పూర్తి చేసుకుని రికార్డు సాధించింది.

ఈ సినిమా 8 సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఓటిటిల హవా నడుస్తున్న సమయంలో ఒక సినిమా ఇలా 8 సెంటర్లలో 100 రోజులు ఆడటం గొప్ప విషయం . హిందూపురం, చిలకలూరిపేట, ఆలూరు, గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈనెల 23వ తేదీ 100 డేస్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ ఈవెంట్ గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని ఆ పోస్టర్ లో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో పాటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

Balakrishna: చిరంజీవి రవితేజ నటించడమే కారణమా…

రెండు సినిమాలు మంచి హిట్ అందుకోగా.. వీరసింహారెడ్డి సినిమా మాత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ లో సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని ఉండటం చిరంజీవి పై సెటైర్ వేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించాడు. వీరసింహారెడ్డి లో మాత్రం బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు. దీంతో బాలయ్యా సింగిల్ గా రికార్డ్ సాధించాడని ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Siddu Jonnalagadda: తన మనిషి అని భావిస్తే ఎంత దూరమైనా వెళ్తాడు… బాలయ్య పై డిజె టిల్లు కామెంట్స్!

Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమా ద్వారా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈయన ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం డీజే టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ సినిమా డైరెక్టర్ తో సిద్దుకి పడటం లేదని అందుకే డైరెక్టర్ మారిపోయారని వార్తలు వచ్చాయి.

హీరో సిద్దు జొన్నలగడ్డ కారణంగా హీరోయిన్స్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమా గురించి వస్తున్నటువంటి వివాదాలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరితోనూ మనస్పర్ధలు లేవని ఈ సినిమా కోసం ముందుగా అనుపమను సంప్రదించాము అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు జొన్నలగడ్డ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా బాలకృష్ణ చాలా ఆవేశపరుడని ఆయనను చూస్తే చాలామంది దూరంగా ఉంటారని ఆయనతో మాట్లాడటానికి భయపడతారని చెబుతూ ఉంటారు.కానీ అతనితో పని చేసిన వారిని కనుక బాలయ్య గురించి అడిగితే తన మంచి మనస్తత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతారు.

Siddu Jonnalagadda:చిన్నపిల్లాడి మనస్తత్వం….

ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ సైతం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ఒక విశాలమైన హృదయం కలిగిన వారని తెలిపారు. ఆయన ఒక మనిషిని తన మనిషిగా భావిస్తే వారికోసం ఎంత దూరం వెళ్లడానికైనా వెనకాడరని,అందమైన దయ కలిగిన చిన్నపిల్లాడి మనస్తత్వం బాలకృష్ణ గారిది అంటూ ఈ సందర్భంగా బాలయ్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

AP Politics: జగన్ కు పబ్జి ఆడటం తప్ప ఏమీ రాదు… మరోసారి సైకో రెడ్డి గెలిస్తే వలస పోవాల్సిందే!

AP Politics: తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం యువగలం పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ పాదయాత్రకు ముందు బాలకృష్ణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇలా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం పరిశ్రమలు రావడం లేదు… ఉపాధి కల్పన జరగలేదు రాష్ట్రం మొత్తం ల్యాండ్ సాండ్ మైనింగ్ జరుగుతుంది.

ఈ రాష్ట్రంలో జగన్ అనుచరులు వారి కుటుంబీకులు మాత్రమే బ్రతకగలరు సామాన్య ప్రజలు బతకలేని దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి జగన్ ముఖ్యమంత్రి అయితే సైకో పాలన అవుతుందని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వలస వెళ్లిపోవాలని ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక మారిపోతుంది అంటూ బాలకృష్ణ మాట్లాడారు.


AP Politics: అభివృద్ధి శూన్యం…

జగన్ పనితీరు నచ్చక ఇప్పటికే ఎంతోమంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని వారంత తమ పార్టీతో అటాచ్మెంట్ అవుతున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి పబ్జి ఆడటం తప్ప ఏమీ తెలియదని ప్రస్తుతం ఆయన పార్టీ ఓటమి అంచులలో ఉందనే విషయం జగన్ కి తెలుసు అంటూ బాలకృష్ణ తెలిపారు.వైసిపి అరాచక పాలనను ఎదిరించి ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కొనసాగుతుందని బాలయ్య వెల్లడించారు.

Balakrishna: కాళీమాత భక్తుడిగా బాలయ్య..
సినిమాపై అంచనాలను పెంచేస్తున్న అనిల్ రావిపూడి!

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా NBK 108 వర్కింగ్ టైటిల్ తో శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ అలాగే మరొక హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఈ పోస్టర్ కి అనుహ్యమైన స్పందన లభించింది.ఇకపోతే తాతగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు ఏ పాత్రలో నటించబోతున్నారనే కుతూహలం అందరిలోనూ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలకృష్ణ కాళీమాత భక్తుడిగా కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుందట. ఈ సినిమాలో బాల్యయ తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్పబోతున్నారనీ సమాచారం.

Balakrishna: విభిన్న పాత్రలో బాలయ్య…

ఈ సినిమాలో బాలకృష్ణ చేయబోయే ఈ పాత్ర ఇదివరకు ఎప్పుడు ఆయన చేయలేదని ఈ పాత్రలో బాలయ్య సరికొత్తగా ప్రేక్షకులను సందడి చేయడానికి రాబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎప్పుడు తన కామెడీ సినిమాలతో అందరిని నవ్విస్తున్నటువంటి అనిల్ రావిపూడి ఈసారి మాత్రం బాలయ్యతో విభిన్నంగా భారీ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Honey Rose: పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత… పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హనీరోజ్!

Honey Rose: మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలలో నటించారు.ఇలా పలు తెలుగు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు భార్య పాత్రలో ఈమె నటించారు.

ఇలా వీర సింహారెడ్డి సినిమా ఈమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకులకు ఫిదా కావడంతో ఈమెకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా విజయవాడలో ఒక బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నటి హనీ రోజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పెళ్లి గురించి నటన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలియజేశారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత అని ఈమె తెలియజేశారు. ఇక ఆ బాధ్యతను తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

Honey Rose: పెళ్లి చేసుకోబోతున్న హనీ రోజ్…


వివాహ బంధం బలంగా ఉండడం కోసం తాను ఏం చేయడానికి అయినా సిద్ధమేనని హాని రోజ్ పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే ఈమె పెళ్ళికి సిద్ధమైందని తెలుస్తోంది. కానీ తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలి ఏం చేస్తుండాలి అనే విషయాలను గురించి మాత్రం వెల్లడించలేదు.

Balakrishna: ఒక్కసారి మూడో కన్ను తెరిచానా అంతే…. ఆ ఎమ్మెల్యేకు బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఏ విషయాన్ని మనసులో దాచుకోరు. అది మంచైనా చెడైనా కోపం అయినా ప్రేమైనా మొహం మీద చెప్పేయడం బాలకృష్ణ నైజం.ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల ఈయన పలుమార్లు వివాదాలలో కూడా చికుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇలా ఏ విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడే బాలకృష్ణ తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలోఎన్టీఆర్ శతజయంతి దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె అలాగే నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మహానటి సావిత్రి గురించి అలాగే నాగిరెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తనదైన స్టైల్ లో వారిని ఇచ్చారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో భాగంగా వైయస్సార్సీపి కార్యకర్త భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాట పెట్టడంతో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి బాలయ్య పాట పెడతావా అంటూ తనని అవమానించారు దీంతో మనస్థాపానికి గురైన భాస్కర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అతనికి అందరూ నచ్చజెప్పి పంపించారు.

Balakrishna: చిటికేస్తే చాలు… జాగ్రత్తగా ఉండు

నరసరావుపేటలో నా పాట వేసారని వైసీపీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థిని చానా ఇబ్బందులకు గురి చేశాడు. రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టద్దు.. సినిమాలను అన్ని పార్టీల వారు ఆదరిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు సినిమా చూస్తున్నారు అంటూ మాట్లాడటమే కాకుండా మధ్యలో ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా…నా అభిమానులు ఒక్క చిటిక వేస్తే చాలు జాగ్రత్తగా ఉండు అంటూ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి పేరు ప్రస్తావించకుండా బాలయ్య తనదైన స్టైల్ లో తనకు వార్నింగ్ ఇచ్చారు.