Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఏ విషయాన్ని మనసులో దాచుకోరు. అది మంచైనా చెడైనా కోపం అయినా ప్రేమైనా మొహం మీద చెప్పేయడం బాలకృష్ణ నైజం.ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల ఈయన పలుమార్లు వివాదాలలో కూడా చికుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇలా ఏ విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడే బాలకృష్ణ తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలోఎన్టీఆర్ శతజయంతి దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె అలాగే నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మహానటి సావిత్రి గురించి అలాగే నాగిరెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తనదైన స్టైల్ లో వారిని ఇచ్చారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో భాగంగా వైయస్సార్సీపి కార్యకర్త భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాట పెట్టడంతో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి బాలయ్య పాట పెడతావా అంటూ తనని అవమానించారు దీంతో మనస్థాపానికి గురైన భాస్కర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అతనికి అందరూ నచ్చజెప్పి పంపించారు.
నరసరావుపేటలో నా పాట వేసారని వైసీపీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థిని చానా ఇబ్బందులకు గురి చేశాడు. రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టద్దు.. సినిమాలను అన్ని పార్టీల వారు ఆదరిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు సినిమా చూస్తున్నారు అంటూ మాట్లాడటమే కాకుండా మధ్యలో ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా…నా అభిమానులు ఒక్క చిటిక వేస్తే చాలు జాగ్రత్తగా ఉండు అంటూ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి పేరు ప్రస్తావించకుండా బాలయ్య తనదైన స్టైల్ లో తనకు వార్నింగ్ ఇచ్చారు.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…