Tag Archives: comment

Actress Suchitra: కన్న కూతురే నన్ను డేటింగ్ చేయమని బలవంతం పెట్టింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సుచిత్రా కృష్ణమూర్తి..

Actress Suchitra: నటి సుచిత్రా కృష్ణమూర్తి 1991లో వచ్చిన మలయాళ చిత్రం ‘కిలుక్కింపెట్టి’తో జయరామ్‌ సరసన నటించి వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళ శివరంజని సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ఈమె షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్‌బాత్‌ ఆగ్‌, రోమియో అక్బర్ వాల్టర్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

Actress Suchitra: కన్న కూతురి నన్ను డేటింగ్ చేయమని బలవంతం పెట్టింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సుచిత్రా కృష్ణమూర్తి?

ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా పేరు సంపాదించుకున్నారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్‌ భులయా 2’, అదేవిధంగా ‘గిల్టీ మైండ్స్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించింది.తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న సుచిత్ర తన గురించి తన కూతురు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

Actress Suchitra: కన్న కూతురి నన్ను డేటింగ్ చేయమని బలవంతం పెట్టింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సుచిత్రా కృష్ణమూర్తి?

నటి సుచిత్ర దర్శకుడు శేఖర్‌ కపూర్‌ను వివాహం చేసుకున్న ఎనిమిదేళ్లకు తన భర్తకు విడాకులిచ్చి విడిపోయారు. వీరిద్దరికీ కావేరి కపూర్ అనే కూతురు కూడా ఉన్నారు. ఇలా తన కూతురుతో కలిసి ఒంటరిగా గడుపుతున్న నటి సుచిత్రను ఇతరులతో డేటింగ్ చేయమని తన కూతురు తనని బలవంతం చేసిందని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ న్యూస్ చెప్పారు. కన్న కూతురే డేటింగ్లో పాల్గొనమని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఎన్నో అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చేవి…

తనకు తెలియకుండా తన కూతురు డేటింగ్ యాప్ లో తన డీటెయిల్స్ నమోదు చేసి డేటింగ్ చేయమని బలవంతం చేస్తుంది. అయితే తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉండగా అతను కూడా తనని మోసం చేశాడని, ఇప్పుడు తాను ఉన్నది ఇతరులతో డేటింగ్ చేయడం కోసం కాదు అని తన కూతురుకు అర్థమయ్యేలా వివరించానని తెలిపారు. ఈ క్రమంలోనే డేటింగ్ యాప్ లో తన వివరాలు నమోదు చేయడం వల్ల తనకు ఎన్నో అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చేవి దీంతో తన కూతురే స్వయంగా తన డీటెయిల్స్ అన్ని తొలగించిందని ఈ సందర్భంగా సుచిత్ర కృష్ణమూర్తి వెల్లడించారు.

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

Samantha: నటి సమంత పై ప్రముఖ గురువు సద్గురుజగ్గీ వాసుదేవ్ సెటైర్లు వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.తాజాగా హైదరాబాదులో జరిగిన సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సద్గురు హాజరయ్యారు. ఈ కాలుష్యం నుంచి మట్టిని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి అవగాహన చేపట్టారు. ఇక ఈ కార్యక్రమానికి సమంత కూడా హాజరయ్యారు.

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

ఈ కార్యక్రమంలో భాగంగా సమంత సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ఇంటర్వ్యూ చేశారు. సమంతను చూసిన వెంటనే ఆయన తనపై పెద్దఎత్తున సెటైర్లు వేస్తూ నవ్వించారు. సమంత ఈ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా హాజరయ్యారు.సమంత ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి అని చెబుతూనే నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని తెలిసిన వెంటనే కూడా పసుపు రంగు చీర కట్టుకొని రావడానికి ఆలస్యం అయ్యింది అంటూ ఆయన తన పై సెటైర్ వేశారు.

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

ఈ విధంగా సమంత పై సద్గురు కామెంట్స్ చేయడంతో సమంత బిగ్గరగా నవ్వేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు సమంత సద్గురును ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా తాను ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే ఏ విధమైనటువంటి నోట్స్ లేకుండా వస్తానని,కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చానని తెలిపారు.

మిమ్మల్ని చూస్తే నా పేరు కూడా మర్చిపోతాను…

మిమ్మల్ని చూస్తే ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలియదని, మిమ్మల్ని చూసేసరికి నా పేరును కూడా నేను మర్చిపోతానని అందుకే ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అంటూ సమంత సద్గురుతో సరదాగా ముచ్చటించారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

Agneepath Scheme: అగ్నిపథ్ గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా యువతను సైన్యంలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ పథకంలో భాగంగా 17.5 నుంచి 21 సంవత్సరాలు వయస్సున్న యువకుల ను ఈ పథకం ద్వారా సైన్యంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చే అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉంచుతారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్ లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ పథకం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయానని,దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఏదైనా ఒక పథకం గురించి అధికారపక్షం నిర్ణయం తీసుకుని ఆ పథకం గురించి ప్రతిపక్షం మరుక్షణమే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయడం సర్వసాధారణం అయింది.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో రాజకీయాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత దేశ సైనిక దళాలను పెంచడం కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే మనకు ఎంత సైన్యం ఉన్నారు అనేది ముఖ్యం కాదు ఆ సైన్యం ఎంత సమర్థవంతంగా ఉన్నారనేది ముఖ్యం అని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా అధిక మొత్తంలో సైన్యాన్ని తీసుకొని వారికి అధిక స్థాయిలో జీతభత్యాలు చెల్లిస్తూ సరైన శిక్షణ లేకపోతే కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల కోసమే ఉద్యోగ ప్రకటనలు…

అమెరికా వంటి దేశాలలో సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వారి దగ్గర అధునాతనమైన సాంకేతిక శక్తిని కలిగి ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు ఉండటం వల్ల దేశ భద్రత మరింత పటిష్టంగా ఉంది. మనదేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను విడుదల చేస్తూ వారికి నెలవారి జీతాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఏ స్థాయిలో ఉద్యోగుల అవసరం అనే విషయం గుర్తించలేదు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల కోసం ఆలోచన చేస్తూ ఇలాంటి ధోరణిని ఎంపిక చేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఒక పై అధికారికి డ్రైవర్ బంట్రోతు అందరూ ఉన్నారు అధికారికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేశ ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేరని తెలిపారు.

మన దేశంలో సరైన విద్య, సరైన ఆరోగ్యం లేదు. కొన్ని ప్రాంతాలలో శాంతి భద్రత కూడా లేదు.వీటిపై దృష్టి పెట్టకుండా కేవలం వచ్చే ఎన్నికలపై దృష్టి పెడుతూ ప్రధాన మంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకు ఎంతమేర సైన్యం అవసరం అనే విషయాన్ని ఆలోచించకుండా ఒకేసారి లక్షలు ఉద్యోగ ప్రకటన ఇస్తే వారికి తదుపరి ఎన్నికలలో ప్రయోజనకరంగా ఉంటుందనేది వారి ఉద్దేశమని ఈయన ఈ అగ్నిపథ్ స్కీమ్ గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.

Konda Surekha: వైయస్ కుటుంబ సభ్యులతో అనుబంధం లేదు.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్?

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ మురళి దంపతుల జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా అనే సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొండ సురేఖ విజయవాడలో పర్యటించారు.

Konda Surekha: వైయస్ కుటుంబ సభ్యులతో అనుబంధం లేదు.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్?

ఈ క్రమంలోనే కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కేవలం మా నిజ జీవితంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. నిజజీవితంలో నక్సల్స్ ఉద్యమం, రాజకీయ ప్రయాణం మా ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు.

Konda Surekha: వైయస్ కుటుంబ సభ్యులతో అనుబంధం లేదు.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్?

కేవలం ఈ సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, ఈ పర్యటనలో ఏ విధమైనటువంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని తెలిపారు. ఇక ప్రస్తుతం తాము రాజకీయాల్లో కొనసాగుతున్నాము అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అని మాత్రమే చెప్పాలి. ఆయనవల్లే రాజకీయాలలో ఎదిగామని తెలిపారు.

రాజశేఖర్ రెడ్డి గారితో మాత్రమే పరిచయం…

ఇక ప్రస్తుత రాజకీయాలలో విలువలు ఏమాత్రం లేదని ఆవేదన చెందారు. ప్రజల అభివృద్ధి కోసమే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుత రాజకీయాలలో ప్రజల అభివృద్ధి కరువైందని ఈమె ఆవేదన చెందారు. ఇక తనకు కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారితో మాత్రమే అనుబంధం ఉందని ఆయన కుటుంబ సభ్యులతో పెద్ద అనుబంధం లేకపోవటం వల్లే వారిని కలవలేకపోయానని ఈమె తెలిపారు. ఇక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఒక కేసు విషయంలో విజయమ్మ షర్మిలతో కలిసి కోర్టు వాయిదాలో మాత్రమే కలిశామని తెలిపారు.

Geetha Krishna : కమల్ హాసన్ కి చచ్చు తెలివితేటలు ఎక్కువ.. విక్రమ్ సినిమా విషయంలో అదే చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్?

Geetha Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ప్రస్తుతం నటీనటుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ నటుడు కమల్ హాసన్ గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Kamal Haasan: కమల్ హాసన్ కి చచ్చు తెలివితేటలు ఎక్కువ.. విక్రమ్ సినిమా విషయంలో అదే చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్?

ఇప్పటివరకు గీతాకృష్ణ విక్రమ్ సినిమా చూడలేదని త్వరలోనే ఈ సినిమా చూస్తానని తెలిపారు. అయితే ఈయన కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం, సాగరసంగమం వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ వ్యక్తిత్వం గురించి గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత కృష్ణ మాట్లాడుతూ కమల్ హాసన్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే రెండు లక్షల రూపాయల కెమెరాతో సినిమా చేసి నష్టాల పాలయ్యారు. ఆయన డబ్బు విషయంలో కాస్త కక్కుర్తిగా ఉంటారని గీత కృష్ణ వెల్లడించారు.

Kamal Haasan: కమల్ హాసన్ కి చచ్చు తెలివితేటలు ఎక్కువ.. విక్రమ్ సినిమా విషయంలో అదే చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్?

కమల్ హాసన్ కి చచ్చు తెలివితేటలు అధికంగా ఉన్నాయి. ఈయన వన్ మ్యాన్ షో లాగా అన్నీ తానే చేసుకుంటే మనకే మంచి పేరు వస్తుందనే అతి తెలివి తేటలు ప్రదర్శిస్తారు.ఇలాంటి విషయాలలో కమల్ హాసన్ చాలా ఇంటిలిజెంట్ అంటూ ఆయన గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాజాగా విడుదలైన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరొక నటుడు విజయ్ సేతుపతి సూర్య కూడా ఉన్నారు. కానీ ఈ వీరిద్దరిని ప్రమోషన్ లో ఎక్కడ కూడా కమల్ హాసన్ ఉపయోగించుకోలేదు.

తనని తాను హైలెట్ చేసుకున్నారు..

ఇక మీరు ప్రస్తావన కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో తీసుకురాలేదు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు వీరిని హైలెట్ చేశారని, ప్రతి ప్రమోషన్ కార్యక్రమాలలోనూ కమల్ హాసన్ తనని తాను హైలెట్ చేసుకున్నారని గీతాకృష్ణ తెలిపారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి కూడా ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సినిమా కోసం అన్ని ముందుగా అరేంజ్ చేసుకుని సొంతంగా విడుదల చేశారు కనుక కలెక్షన్లు కూడా వచ్చి ఉంటాయని తెలిపారు.ఇకపోతే డైరెక్టర్లకు హీరో సూర్యకు అసిస్టెంట్ డైరెక్టర్లకు కానుకగా ఇచ్చారు ఇలా ఇది వరకు ఎప్పుడైనా కమల్ హాసన్ చిత్ర బృందానికి కానుకలు ఇచ్చారా అని ప్రశ్నించగా ఇస్తే తీసుకుంటారు కానీ ఆయన ఎప్పుడూ ఇవ్వలేదంటూ గీతాకృష్ణ వెల్లడించారు.

Kamal Hassan: కమల్ హాసన్ కి మరి ఇంత కోపమా.. వేదికపై నుంచే అభిమానికి వార్నింగ్ ఇచ్చిన హీరో?

Kamal Hassan: కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ ఎంతో సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా అంచనాలకు మించి ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో స్వయంగా కమల్ హాసన్ తన అప్పును మొత్తం తీరుస్తానని తెలిపారు. ఇలా సినిమా మంచి విజయం కావడంతో కమల్ హాసన్ ఎంతో చురుగ్గా ‘మక్కల్‌ నీది మయ్యం’పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

kamal-haasan-he-get-very-angry-and-given-a-warned-the-fans-on-the-stage

ఈ క్రమంలో పార్టీ తరఫున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై ఒక నేత రక్తదానం గురించి మాట్లాడుతూ ఉండగా వెనుక నుంచి ఓ అభిమాని పెద్ద ఎత్తున విక్రమ్ విక్రమ్ అంటూ అరిచారు.

kamal-haasan-he-get-very-angry-and-given-a-warned-the-fans-on-the-stage

ఈ విధంగా అభిమాని వేదికపై పెద్ద ఎత్తున కమల్ హాసన్ అతనికి వేలు చూపిస్తూ సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఇలా వేదికపైనే కమల్ హాసన్ సీరియస్ అయ్యారు. ఇక తాను ఎందుకు వద్దని చెప్పాను అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా ఏకంగా 4 లక్షల లీటర్ల రక్తాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాము.ఇదే రక్తాన్ని బయట కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. అలా కాకూడదనే మనం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసాము.

విక్రం అంటే అమ్మటం అని అర్థం…
ఈ విధంగా రక్తదానం గురించి ఒక నేతమాట్లాడుతున్న సమయంలో విక్రమ్ అంటూ అరవగా మనం కూడా రక్తాన్ని అమ్ముతున్నామని భావిస్తారు. తమిళంలో విక్రమ్ అంటే అమ్మడం అని అర్థం వస్తుంది. ఇలా మనం రక్తదానం గురించి మాట్లాడేటప్పుడు విక్రమ్ అంటే మనం కూడా ఈ రక్తం అమ్ముతున్నామని అనుకుంటారు అందుకే అరవద్దని చెప్పాను అంటూ కమల్ హాసన్ అనంతరం వివరణ ఇచ్చారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తన పని తాను చూసుకుంటూ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర తారగా పేరు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందిన సాయిపల్లవి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.ఈమె నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ కశ్మీర్ పండిట్ల హత్య, గో హత్యల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీర్ పండిట్లను ఎలా హత్య చేశారో చూపించారు. మనం దానిని మతఘర్షణలు చూస్తే ఎలా?మొన్నటికి మొన్న ఒక బండిలో ఆవును తీసుకొని ఒక ముస్లిం వ్యక్తి వెళ్తుంటే తనని కొంతమంది కొట్టి చంపి జైశ్రీరామ్ అన్నారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

ఇక అప్పట్లో జరిగిన దానికి ప్రస్తుత జరిగిన దానికి పెద్ద తేడా లేదు.ఇక్కడ సమస్య వస్తున్నది మతాల వల్ల కాదు మనం మంచితనంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావని ఈమె కాశ్మీర్ ఫైల్స్ ఘటన గురించి మాట్లాడారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కొంతమంది తనకు మద్దతు తెలపగా మరికొంతమంది తన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సాయి పల్లవి వ్యాఖ్యలు విరాటపర్వం పై ప్రభావం చూపనున్నాయా…

అలాగే సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా చూసేది లేదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ విధంగా సాయి పల్లవి విరాటపర్వం సినిమా విడుదలకు ముందు ఈ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాను పూర్తిగా ఇబ్బందులలోకి నెట్టేశారని తెలుస్తోంది. మొత్తానికి సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Prudhvi Raj: వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

Prudhvi Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి మనకు తెలిసిందే.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయిన ఈయన ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఇక ఈయన సేవలను గుర్తించిన వైసీపీ ప్రభుత్వం పృథ్వీరాజ్ కి ఎస్వీబీసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించారు.

Prudhvi Raj: వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా ఎస్వీబీసీ చైర్ పర్సన్ బాధ్యతలను తీసుకున్న పృథ్వీరాజ్ ఒక మహిళతో ఎంతో అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆడియో బయటకు రావడంతో ఆయనపై చర్యలు తీసుకుని అతని తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా
పృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు.అయితే ఈయన వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.

Prudhvi Raj: వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో ఇమడ లేకపోయిన పృథ్వీరాజ్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ కుటుంబం పై ఈయన ప్రశంసలు కురిపిస్తూ పలు వ్యాఖ్యలు చేయడమేకాకుండా తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపోటముల గురించి జోస్యం చెప్పారు.

అధికారం లేకపోయినా ప్రజల కోసం సేవ….

తాజాగా ఒక న్యూస్ చానల్ తో మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారని చాలామంది కామెంట్లు చేశారు అయితే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 40 నుంచి 50 వరకు గెలు పొందుతారని,పృథ్వీరాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారని తాను రాసిస్తానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని ఆయన అతని పై ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Dhavala Satyam : ఆ విషయంలో నాకు దాసరి కి మధ్య పెద్ద గొడవ జరిగింది.. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

Dhavala Satyam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఎన్నో వందల సినిమాలకు పనిచేసి ఇండస్ట్రీ పెద్దగా గుర్తింపు పొందిన దాసరి నారాయణరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఈయన స్నేహితుడిగా శిష్యుడిగా ధవళ సత్యం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధవళ సత్యం ఇండస్ట్రీలో తనకు దాసరి గారికి మధ్య జరిగిన గొడవ గురించి వెల్లడించారు.

Dasari Narayana Rao: ఆ విషయంలో నాకు దాసరి కి మధ్య పెద్ద గొడవ జరిగింది.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

తాను రామాపురంలో సీత అనే సినిమా షూటింగ్ చిత్తూరులో చేస్తున్నాను. అక్కడ కొందరు యూనియన్ లీడర్స్ వచ్చి ఇక్కడ కార్డులు ఉన్న వారు ఒక వైపు రండి లేని వారు ఒక వైపు రండి అంటూ పెద్ద ఎత్తున గొడవ చేశారు. నాకు సినిమా షూటింగ్ సమయంలో మధ్యలో ఎవరైనా ఇలా పనికి అడ్డు పడితే చాలా కోపం వస్తుంది. ఇలా యూనియన్ లీడర్స్ సినిమా షూటింగ్ మధ్యలో ఇలా చేయడంతో నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను.

Dasari Narayana Rao: ఆ విషయంలో నాకు దాసరి కి మధ్య పెద్ద గొడవ జరిగింది.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

చిత్తూరు డిఎస్పీ గారు వచ్చి నాతో మాట్లాడారు మరి వీరిపై కేసు పెడతారా అంటే పెడతాను అని చెప్పాను. అలా వారిపై కేసు పెట్టడంతో యూనియన్ లీడర్స్ అందరినీ తీసుకెళ్లి జైలులో పెట్టారు. ఈ విధంగా యూనియన్ అనే విషపురుగు కారణంగా మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అయితే అప్పట్లో యూనియన్ ప్రెసిడెంట్ గా దాసరిగారు ఉండేవారు. విషయం తెలియగానే ఆయన ఫోన్ చేసి ఒక్క క్షణంలో వాళ్ళందరూ బయట ఉండాలి అని చెప్పారు.

మా ఇద్దరి జర్నీలో ఇదొక పెద్ద మచ్చ…

వాళ్లు నా సినిమాని డిస్టర్బ్ చేశారు.. అందుకే ఇలా చేశాను అని నేను ఆయనతో చెప్పాను. వాళ్లు యూనియన్ లీడర్స్.. వాళ్లు ఏమైనా చేస్తారు ముందు వాళ్లు బయటకు రావాలి అన్నారు.ఆ విషయంలో నేను వినకపోయేసరికి నువ్వంటున్నది ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకో ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా మా ఇద్దరి జర్నీలో మాకు ఇది ఒక పెద్ద మచ్చగా ఏర్పడిందని ధవళ సత్యం దాసరితో తనకు జరిగిన గొడవ గురించి తెలిపారు.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi: సాయిపల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందారు.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా మొదటి సినిమా అద్భుతమైన విజయం కావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్నారు.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఇకపోతే సాయిపల్లవి తాజాగా విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు తనకు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఆలోచన కూడా లేదని తెలిపారు. ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో కూడా తాను ఎంతో అసంతృప్తిగా సినిమాల్లో నటించానని అయితే ఈ సినిమా మంచి విజయం అందుకొని అవకాశాలు రావడంతో సినిమాలపై దృష్టి పెట్టానని తెలిపారు.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఇక తనకు సినిమా అవకాశాలు రాకపోతే తన చేతిలో ఎలాగో డాక్టరేట్ ఉందని తాను వైద్య వృత్తిలో స్థిరపడతానని తెలియజేశారు.ఇక సాయి పల్లవి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనకు డబ్బుకు లోటు లేకుండా పెంచారని అయితే డబ్బును ఎలా పొదుపుగా ఖర్చు చేయాలో కూడా నేర్పించారని తెలిపారు.

ఇప్పటికీ తల్లిచాటు బిడ్డనే..

ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది మనకు ఎంతవరకు అవసరం అవుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంటానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపారు.ఇకపోతే చిన్నప్పటినుంచి తాను ఏ వస్తువు కొన్నా తల్లి చేతుల మీదుగా కొనడం తనకు అలవాటు అని ఇప్పటికీ తను ఏం కొన్నా కూడా తన తల్లికి ఓటీపీ ద్వారా తెలిసిపోతుందని సాయి పల్లవి తెలియజేశారు. ఈ విధంగా తను అగ్రనటిగా కొనసాగుతున్నప్పటికీ తల్లిచాటు బిడ్డ నేనంటూ సాయి పల్లవి ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ విధంగా ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.