Tag Archives: comment

Geetha Krishna : చరణ్ కు నటన రాదనడం కోట తప్పు.. అలా మాట్లాడితే అవకాశాలు ఎవరిస్తారు..? డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Geetha Krishna : కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పలువురి హీరోల గురించి చేసే కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టిస్తానని చెప్పడంతో ఆయన ఆ విషయం పై విమర్శలు చేశారు. అదేవిధంగా మెగాస్టార్ తనయుడిగా చరణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని ఆయనలో పెద్దగా నటుడు లేడు అంటూ కామెంట్ చేశారు.

Kota Srinivasa Rao: కోటా చరణ్ కు నటన రాదనడం తప్పు.. అలా మాట్లాడితే అవకాశాలు ఎవరిస్తారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు మెగా కుటుంబం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు తమదైన శైలిలో వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇకపోతే డైరెక్టర్ గీతాకృష్ణ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Kota Srinivasa Rao: కోటా చరణ్ కు నటన రాదనడం తప్పు.. అలా మాట్లాడితే అవకాశాలు ఎవరిస్తారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి హాస్పిటల్ కట్టడం నచ్చని కోట, చిరంజీవి ఏ పని చేస్తే బాగుంటుందో చెబితే సరిపోయేది. అలా కాకుండా అతని మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఇలా మాట్లాడటం చాలా తప్పు. ఇక షూటింగ్ సమయంలో కోట శ్రీనివాసరావు అసిస్టెంట్ డైరెక్టర్లతో బాగా గొడవ పెట్టుకునే వారని అలా ఒక సినిమా విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ని తిడితే నేనే వార్నింగ్ ఇచ్చాను అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

అతని క్యారెక్టర్ మంచిది కాదు…

ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఉగాది సినిమాని సమాధి అంటూ ఈయన డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దగ్గర ప్రస్తావించారట. కోట శ్రీనివాసరావు మంచి నటుడే అయినప్పటికీ స్త్రీలను ఆయన చాలా నీచంగా చూస్తారని, అందుకే అతనిని నీచుడు అంటారని గీతా కృష్ణ కామెంట్ చేశారు. కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మంచిది కాదు అంటూ ఆయన తెలిపారు. ఇక రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పు.ఇలా చరణ్ కు నటన రాదు అని మాట్లాడితే ఇతను అవకాశాలు ఎవరిస్తారు. కెమెరా ముందు నిలబడి నటించే ప్రతి ఒక్కరూ శ్రామికుడేనని కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించారు. ప్రస్తుతం ఈయన కోట గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్!

Karate Kalyani: కరాటే కళ్యాణి గత మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున వివాదంలో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డితో గొడవ కారణంగా ఈమె హాట్ టాపిక్ గా మారారు. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత కరాటే కళ్యాణి ఫోన్ స్విచాఫ్ కావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ గొడవ జరిగిన సమయంలో కరాటే కళ్యాణి చేతిలో చిన్న పాప ఉండటం గమనార్హం.

Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి చిన్నపిల్లలను దారుణంగా అమ్ముతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటిని సోదా చేశారు. ఈ క్రమంలోనే తన ఇంటిలో ఉన్న చిన్నారి ఎవరు ఏంటి అని ఆరా తీశారు.ఈ విధంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తన ఇంటిపై దాడి చేశారన్న విషయం తెలుసుకున్న కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు.

Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ నేను చిన్నపిల్లలను సినీ సెలబ్రిటీలకు అమ్ముతున్నానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. తాను బిజెపి పార్టీలో ఉండటం వల్ల కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఈమె తన గురించి వస్తున్న వార్తలను ఖండించారు. ఇక పోతే తాను భయపడి ఎక్కడికీ పారి పోలేదని, పారిపోయే రకం కాదని పరిగెత్తించి కొట్టే రకం అని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

మనస్ఫూర్తిగా దత్తత ఇచ్చాం…

ఇక తన దగ్గర ఉన్న పిల్లల గురించి ఆమె మాట్లాడుతూ ఆ బాబు తనకు దొరకడంతో తనని పెంచుకుంటున్నారని అలాగే తనకు పిల్లలు లేకపోవడంతో ఆడపిల్లలు అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల ఆ చిన్నారిని చట్టపరంగా దత్తత తీసుకున్నానని వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ తనకు ముగ్గురు కూతుర్లు జన్మించారని అయితే తన భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కరాటే కల్యాణికి మనస్ఫూర్తిగా తన కూతురిని ఇచ్చామని చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించారు. దత్తత కార్యక్రమం అంటే ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయని అందుకే కరాటే కళ్యాణి తమ వద్దే ఉండాలని సూచించడంతో ప్రస్తుతం మేం కూడా తన వద్దే ఉంటున్నామని చిన్నారి తల్లిదండ్రులు ఈ సందర్భంగా తెలియజేశారు.

Nataraj Master: బిగ్ బాస్ విన్నర్ నేనే … నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Nataraj Master: ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం నటరాజ్ మాస్టర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఇక అందరూ ఊహించిన విధంగానే ఈ వారం హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.

Nataraj Master: బిగ్ బాస్ విన్నర్ నేనే … నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

ఈయన ఎలిమినేట్ కాగానే ఎంతోమంది ఈయనతో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా నట్రాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్ చేశారు.

Nataraj Master: బిగ్ బాస్ విన్నర్ నేనే … నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ బిగ్ బాస్ విన్నర్ తానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో నిజాయితీగా ఆడాను. కానీ నాకు ఎవరు ఓట్లు వేయలేదు. బయటకి వచ్చి చూడగా సోషల్ మీడియాలో అందరూ తప్పుడు ఓట్లు వేసుకుని ఇంకా హౌస్ లో కొనసాగుతున్నారు.

దొంగ ఓట్లతో ఆడుతున్నారు…

ఇలా నిజాయితీగా ఆడిన తను హౌస్ నుంచి బయటకు వచ్చానని, దొంగ ఓట్లతో ఆడేవారు ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నారంటూ నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్ చేశారు. ఇలా దొంగ ఓట్లతో హౌస్ లో కొనసాగే వారు నిజమైన విన్నర్స్ కాదు. నిజాయితీగా ఆడిన తానే బిగ్ బాస్ విన్నర్ అంటూ నటరాజ్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Karate Kalyani: లైవ్ లో శ్రీకాంత్ పై తిట్ల పురాణం మొదలు పెట్టిన కరాటే కళ్యాణి… వాడికి అర్హత లేదంటూ కామెంట్స్!

Karate Kalyani: నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. వీరి మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతుంది. శ్రీకాంత్ రెడ్డి మహిళల పట్ల అసభ్యకరంగా ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య మొదలైన ఈ ఘర్షణ ఎన్నో వివాదాలకు కారణమవుతోంది.

Karate Kalyani: లైవ్ లో శ్రీకాంత్ పై తిట్ల పురాణం మొదలు పెట్టిన కరాటే కళ్యాణి… వాడికి అర్హత లేదంటూ కామెంట్స్!

ఇకపోతే కరాటే కళ్యాణి తాజాగా ఒక డెబిట్ లో పాల్గొని లైవ్ లోనే అతనిపై తిట్ల పురాణం మొదలుపెట్టింది. నేను వాన్ని అసలు వదలను, వెళ్లి వాన్ని తంతా, రేయ్ నీకు దమ్ముంటే నువ్వు ఏమన్నావో నీ మాటపై నిలబడు నా కాలి వెంట్రుక కూడా పీకలేవు. ఈ కేసులో గెలవడం కోసం చావడానికైనా సిద్ధమే. బాబి అనేది ఒక సినిమా క్యారెక్టర్ మా సినిమాకు నీ ఫ్రాంక్ వీడియోలకు పోలిక ఏంటి అంటూ పెద్దఎత్తున కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Karate Kalyani: లైవ్ లో శ్రీకాంత్ పై తిట్ల పురాణం మొదలు పెట్టిన కరాటే కళ్యాణి… వాడికి అర్హత లేదంటూ కామెంట్స్!

ఇలా రోడ్డుపై వెళ్లే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ చేసే వీడియోల వల్ల సమాజానికి ఏం తెలియచేయాలి అనుకుంటున్నావు అని భారీ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధంగా టీవీ లైవ్ లో పాల్గొన్న ఈమె శ్రీకాంత్ రెడ్డి పై బూతులు మాట్లాడింది.

సినిమాని అంటే ఒప్పుకోను..

ఇక శ్రీకాంత్ రెడ్డి కూడా ఒక వీడియో ద్వారా ఈమె నటించిన సినిమాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి కరాటే కళ్యాణి మాట్లాడుతూ సినిమా పరిశ్రమను అంటే ఒప్పుకునేది లేదు. సినిమా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ శ్రీకాంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన ఈ గొడవ రోజురోజుకు పెరిగి పెద్దది అవుతుంది మరి ఈ వివాదం ఎక్కడ వరకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేకుండా పోయింది.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

Murali Mohan:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేదు.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

ఈ విధంగా వ్యాపార రంగంలో ఎంతో మంచి గుర్తింపు పొందిన మురళీమోహన్ నిర్మాతగా సొంత బ్యానర్ ఏర్పాటు చేసి తన బ్యానర్ లో సుమారు 25 చిత్రాలను తెరకెక్కించారు.ఈ విధంగా తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75శాతం మంచి విజయాలను అందుకున్నాయని మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేదు.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ క్రమంలోని సినిమాలలో కొనసాగుతూనే నిర్మాతగా అడుగు వేయడం ఎంతవరకు సబబు అని ఆలోచించి నిర్మాణ రంగం వైపు వచ్చామని వెల్లడించారు. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75% మంచి విషయాలను అందుకున్నాయని మురళీమోహన్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

సినిమాలకు విరామం ఇచ్చాము…

ఇకపోతే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాని కూడా మురళీమోహన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే ఈ సినిమా అతనికి నష్టాలను తేవటం వల్లే అనంతరం తన బ్యానర్లో సినిమాలు చేయలేదని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. అతడు సినిమా తనకు ఎలాంటి నష్టాలను తేలేదని అయితే ఈ కథ విన్న తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని ముందుగానే భావించాము. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా ఫలానా టైంకు షూటింగ్ పూర్తి కావాలి అనుకున్న తేదీకే విడుదల కావాలని ఉంటుంది. ఈ సినిమా ఆరు నెలలలో పూర్తి అవుతుంది అనుకుంటే సంవత్సరం సమయం పట్టిందని, బడ్జెట్ కూడా మా కంట్రోల్ తప్పిందని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలలో నష్టాలు రావడం వల్ల సినిమాలు చేయడం మానేయలేదు కానీ వ్యాపార రంగంలో బిజీ కావడం వల్లే సినిమాలకి కొన్ని రోజులు విరామం ఇచ్చామని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు.

Adivi Sesh: అక్కడ భారతీయులను టెర్రరిస్టులుగా చూపిస్తారు… హాలీవుడ్ సినిమాల గురించి అడివి శేష్ కామెంట్స్!

Adivi Sesh: అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా ద్వారా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మహేశ్‌ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Adivi Sesh: అక్కడ భారతీయులను టెర్రరిస్టులుగా చూపిస్తారు… హాలీవుడ్ సినిమాల గురించి అడివి శేష్ కామెంట్స్!

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ విశేషంగా ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అడివి శేష్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఇకపోతే తన తల్లిదండ్రులు అమెరికాలోనే స్థిరపడ్డారని అడవిశేషు వెల్లడించారు.

Adivi Sesh: అక్కడ భారతీయులను టెర్రరిస్టులుగా చూపిస్తారు… హాలీవుడ్ సినిమాల గురించి అడివి శేష్ కామెంట్స్!

అమ్మనాన్నలు అమెరికాలో స్థిర పడ్డారు, నువ్వు కూడా ఎంతో అందంగా ఉన్నావు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావ్ మరి అక్కడ సినిమాల్లో ఎందుకు నటించలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ హాలీవుడ్ సినిమాలలో ఇండియన్స్ అని చాలా దారుణంగా చూపిస్తారు. అక్కడి సినిమాలలో ఇండియన్స్ కి టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులలో పని చేసే వ్యక్తుల పాత్రలను ఇస్తారు.

ఇప్పటికీ కమెడియన్స్ పాత్రలే…

ఇప్పటికి హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయిన వారు కూడా అక్కడ హీరో కాలేరు. కేవలం కమెడియన్స్ పాత్రలలో నటిస్తున్నారు. అందుకే తాను హాలీవుడ్ సినిమాలలో కాకుండా తెలుగు సినిమాలు చేస్తున్నానని అడివి శేష్ తెలిపారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా మేజర్ సినిమా గురించి కూడా ఈయన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Adivi Sesh: సొంతం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. పెద్ద రోల్ అన్నారు చివరికి ఇలా!

Adivi Sesh: విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్ తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్3 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Adivi Sesh: సొంతం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. పెద్ద రోల్ అన్నారు చివరికి ఇలా!

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో అడవి శేష్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అడివి శేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

Adivi Sesh: సొంతం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. పెద్ద రోల్ అన్నారు చివరికి ఇలా!

ఈ క్రమంలోనే తను ఫస్ట్ సినిమా సొంతం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంతం సినిమా షూటింగ్ సమయంలో తన పాత్ర చాలా పెద్దదని షూటింగ్ కి వస్తే అర్థం అవుతుందని చెప్పారు. దీంతో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. తీరా సినిమాలో తన పాత్ర ఐదు సెకన్లు మాత్రమే ఉందని ఈ సందర్భంగా సొంతం సినిమా గురించి అడివి శేష్ వెల్లడించారు.

నవదీప్ పాత్రలో…

ఇకపోతే నవదీప్,శివ బాలాజీ హీరోలుగా తెరకెక్కిన చందమామ సినిమాలో కూడా ముందుగా తానే నటించాల్సి ఉందని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు. చందమామ సినిమాలో కొన్ని రోజుల పాటు షూటింగ్ కి కూడా వెళ్లానని అనంతరం తన పాత్రలో హీరో నవదీప్ ను తీసుకున్నారని వెల్లడించారు.జూన్ మూడో తేదీ విడుదల కాబోతున్న మేజర్ సినిమా గురించి ఈయన ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక ఈ సినిమాని
మహేశ్‌ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంయుక్తంగా నిర్మించగా శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారు… యండమూరి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: యండమూరి వీరేంద్రనాథ్ ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో విషయాల గురించి బయట పెడుతున్నారు.ఇప్పటికే చిరంజీవి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన యండమూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిన్నప్పటి నుంచి తను ఎలా పెరిగాడు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారు… యండమూరి కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే తనకు దేవుడు పై నమ్మకం లేదని దేవుడి గురించి మనసులో తలచుకుంటాను కానీ ఎప్పటికీ విగ్రహారాధన చేయనని ఈ సందర్భంగా యండమూరి వెల్లడించారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఈయన ఎంతో మంది హీరోల దగ్గర దర్శకుల దగ్గర పనిచేశారు. ఈ క్రమంలోనే చాలామంది దగ్గర పలు మనస్పర్ధలు రావడం జరిగి ఉంటాయి.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారు… యండమూరి కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే మీకు ఎవరి దగ్గరైనా మనస్పర్థలు వచ్చాయా అంటూ ఈయనను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు యండమూరి సమాధానం చెబుతూ తనకు ఇండస్ట్రీలో ఎంతో మందితో మనస్పర్థలు వచ్చాయని అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరికీ ఎవరితో మనస్పర్ధలు లేవు చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నించారు.

ఎన్నో మనస్పర్ధలు ఉన్నాయి…

ఇక మీరే కొంతమంది సెలబ్రిటీల పేర్లు చెప్పండి వారికి ఎవరితో మనస్పర్ధలు వచ్చాయో, ఎవరిని ఎవరు అపార్థం చేసుకున్నారు చెబుతానంటూ యండమూరి ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి పేరును తీసుకురాగా చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకోలేదా… అంటూ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, అపార్థాల గురించి యండమూరి వెల్లడించారు. ఇక మోహన్ బాబు చిరంజీవి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ఎన్నో అపార్ధాలు ఉన్నాయని యండమూరి వెల్లడించారు.

Murali Mohan: ‘మా’ బిల్డింగ్ కట్టాలనుకున్నాం కానీ కుదరలేదు.. సొంత డబ్బులతో విష్ణు కడతా అన్నాడుగా కడతాడో లేదో చూద్దాం : మురళి మోహన్

Murali Mohan: మురళీమోహన్ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగిన మురళీమోహన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

ఈ క్రమంలోనే మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంది అవార్డుల గురించి ప్రస్తావించారు. నంది అవార్డుల విషయంలోఇప్పటికీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయంలేదని ఇది పూర్తిగా కమిటీ మెంబర్స్ సూచించిన విధంగా అవార్డులను ప్రకటిస్తారని మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

అదేవిధంగా మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను అయ్యప్ప మాల దీక్ష తీసుకోవడం గురించి వెల్లడించారు.ఇప్పటివరకు తాను ముప్పై మూడు సార్లు అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నానని ఇంకా మూడుసార్లు తీసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. తనకు చిన్నప్పటి నుంచిఎక్కువ భక్తి ఉండటం వల్ల ప్రతి రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా పూజ చేసుకునే వెళ్తానని ఈ సందర్భంగా మురళీ మోహన్ తెలిపారు.

మా అసోసియేషన్ అప్పుడు జీరో…

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మా బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. మేము మా అసోసియేషన్ స్థాపించినప్పుడు జీరో. “మా” నుంచి మేము వైదొలగినప్పటికి మూడు కోట్ల రూపాయల మూలధనం సేకరించి పెట్టామని, మా తర్వాత వచ్చిన వారు కూడా కొంత డబ్బు సమకూర్చారని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గురించి కూడా మురళీమోహన్ మాట్లాడారు. మేము మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మా బిల్డింగ్ కట్టాలని చాలా ప్రయత్నాలు చేశాము. కానీ కుదరలేదు అయితే ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎన్నికల సమయంలోనే మా బిల్డింగ్ కట్టిస్తానని మాట ఇచ్చారు. అది కూడా తన సొంత డబ్బులతో కడతాం అని మాట ఇచ్చారు. చాలా సంతోషం అంటూ మురళీమోహన్ మా ప్రెసిడెంట్, మా బిల్డింగ్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించారు.

Kota Srinivasa Rao: జగన్ ని గెలిపించారు ఇప్పుడు అనుభవిస్తున్నారు : కోట శ్రీనివాసరావు కామెంట్స్

Kota Srinivasa Rao: తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాస రావు గురించి అందరికీ పరిచయమే. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఈయన ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తున్నాడు. ఈయన సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు నాటకాలు వేసేవాడు.

Kota Srinivasa Rao: జగన్ ని గెలిపించారు ఇప్పుడు అనుభవిస్తున్నారు: కోట శ్రీనివాసరావు కామెంట్స్

ఇక ఇండస్ట్రీలో అడుగు పెట్టాక తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1970 లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కోట శ్రీనివాసరావు దాదాపు 250 సినిమాలకు పైగా నటించారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తండ్రి, తాత, మామయ్య వంటి పలు సహాయ పాత్రలలో నటించారు. అంతేకాకుండా నెగటివ్ పాత్రలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Kota Srinivasa Rao: జగన్ ని గెలిపించారు ఇప్పుడు అనుభవిస్తున్నారు: కోట శ్రీనివాసరావు కామెంట్స్

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి తాజాగా కోట శ్రీనివాస్ రావు కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్ లు కూడా వైరల్ గా మారాయి. తాజాగా కోట శ్రీనివాస్ రావు ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు సినిమాల గురించి కొన్ని విషయాలు పంచుకోవడమే కాకుండా రాజకీయ పరంగా కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఆ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కి ఒలిచి పెట్టిన అరటిపండును ఇచ్చాడని కాస్త వెటకారంగా స్పందించాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి కూడా వెటకారం గానే
స్పందించాడు.

వైయస్ జగన్ పై అలా కామెంట్ చేసిన కోట..

ఆంధ్రప్రదేశ్ లో ఆకులు పోగుచేసి విస్తరాకులు కుట్టుకోవాలి అని అంటూ ఆ జ్ఞానం వాళ్ళకి ఉండాలి అని.. అప్పుడు గెలిపించి ఇప్పుడు అనుభవిస్తున్నారు అని కామెంట్ చేశాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం గురించి కూడా కొన్ని విషయాలను తెలిపాడు కోట శ్రీనివాస రావు.