Adivi Sesh: సొంతం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. పెద్ద రోల్ అన్నారు చివరికి ఇలా!
Adivi Sesh: విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్ తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్3 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో అడవి శేష్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అడివి శేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.
ఈ క్రమంలోనే తను ఫస్ట్ సినిమా సొంతం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంతం సినిమా షూటింగ్ సమయంలో తన పాత్ర చాలా పెద్దదని షూటింగ్ కి వస్తే అర్థం అవుతుందని చెప్పారు. దీంతో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. తీరా సినిమాలో తన పాత్ర ఐదు సెకన్లు మాత్రమే ఉందని ఈ సందర్భంగా సొంతం సినిమా గురించి అడివి శేష్ వెల్లడించారు.
ఇకపోతే నవదీప్,శివ బాలాజీ హీరోలుగా తెరకెక్కిన చందమామ సినిమాలో కూడా ముందుగా తానే నటించాల్సి ఉందని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు. చందమామ సినిమాలో కొన్ని రోజుల పాటు షూటింగ్ కి కూడా వెళ్లానని అనంతరం తన పాత్రలో హీరో నవదీప్ ను తీసుకున్నారని వెల్లడించారు.జూన్ మూడో తేదీ విడుదల కాబోతున్న మేజర్ సినిమా గురించి ఈయన ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక ఈ సినిమాని
మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించగా శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…