Geetha Krishna : కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పలువురి హీరోల గురించి చేసే కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టిస్తానని చెప్పడంతో ఆయన ఆ విషయం పై విమర్శలు చేశారు. అదేవిధంగా మెగాస్టార్ తనయుడిగా చరణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని ఆయనలో పెద్దగా నటుడు లేడు అంటూ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు మెగా కుటుంబం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు తమదైన శైలిలో వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇకపోతే డైరెక్టర్ గీతాకృష్ణ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి హాస్పిటల్ కట్టడం నచ్చని కోట, చిరంజీవి ఏ పని చేస్తే బాగుంటుందో చెబితే సరిపోయేది. అలా కాకుండా అతని మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఇలా మాట్లాడటం చాలా తప్పు. ఇక షూటింగ్ సమయంలో కోట శ్రీనివాసరావు అసిస్టెంట్ డైరెక్టర్లతో బాగా గొడవ పెట్టుకునే వారని అలా ఒక సినిమా విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ని తిడితే నేనే వార్నింగ్ ఇచ్చాను అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఉగాది సినిమాని సమాధి అంటూ ఈయన డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దగ్గర ప్రస్తావించారట. కోట శ్రీనివాసరావు మంచి నటుడే అయినప్పటికీ స్త్రీలను ఆయన చాలా నీచంగా చూస్తారని, అందుకే అతనిని నీచుడు అంటారని గీతా కృష్ణ కామెంట్ చేశారు. కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మంచిది కాదు అంటూ ఆయన తెలిపారు. ఇక రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పు.ఇలా చరణ్ కు నటన రాదు అని మాట్లాడితే ఇతను అవకాశాలు ఎవరిస్తారు. కెమెరా ముందు నిలబడి నటించే ప్రతి ఒక్కరూ శ్రామికుడేనని కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించారు. ప్రస్తుతం ఈయన కోట గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…
తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…