Tag Archives: director

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

Rajamouli: దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. కోవిడ్ కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. దీంతో సినిమాపై ఎన్నో ఆశలు పట్టుకున్న అభిమానులు నిరాశకు లోనయ్యారు. సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

దీంతో అభిమానులు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా ట్రిపుల్ ఆర్ సినిమాపై తెగ ట్రోలింగ్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

Rajamouli: రాజమౌళిపై విమర్శల జల్లు.. జక్కన్న ఎంటి ఇలా చేస్తున్నాడంటూ..!

ఇదిలా ఉంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా రాజమౌళిపై గుర్రుగా ఉన్నారు. రాజమౌళి ఎంతసేపు తన సినిమా, కలెక్షన్లు, లాభాల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఇండస్ట్రీ మంచి కోసం, ఇతర ఇండస్ట్రీ వ్యక్తుల కోసం ఆలోచించడం లేదని ఫైర్ అవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లీడ్ క్యారెక్టర్లలో అలియాభట్, ఒలివియా మోరిస్ వీరికి జోడీగా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ ను దాదాపు రూ. 450 కోట్లతో నిర్మించారు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.

మరోవైపు బాలీవుడ్ స్టార్ అజమ్ దేవ్ గన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేద్దాం అని ముందుగా అనుకున్నప్పటికీ.. కరోనా మరోసారి దెబ్బ తీసింది. కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాల్సిన పరిస్థితి దీంతోొ సినిమాను మరోసారి వాయిదా వేశారు.

సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని..

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమా కోసం పవన్ భీమ్లానాయక్ విడుదల పోస్ట్ పోన్ అయింది. శివరాత్రి కానుకగా విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు భీమ్లా నాయక్ టీం. అయితే ప్రస్తుతం వాయిదా పడిన ఆర్ ఆర్ఆర్ సినిమాను సమ్మర్ సీజన్ లో విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు. అయితే సమ్మర్ లో రాజమౌళి సినిమా వస్తే మళ్లీ మూవీల షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అవుతుందని సినీ ఇండస్ట్రీ అనుకుంటుంది. ఆర్ ఆర్ఆర్ దెబ్బకు పలు మూవీలు వెనక్కి వెళ్లాల్సి వస్తుండటంతో ట్రిపుల్ ఆర్ టీం పై.. మొత్తం సినిమా ఇండస్ట్రీ కొంత అసహనంతో కనిపిస్తుంది. అయితే నార్త్ మాట ఎలా ఉన్నా.. తెలుగు, తమిళం భాషల్లో సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురైంది. నార్త్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా వాయిదా వేసుకోండని చెప్పడంతోనే మూవీ యూనిట్ తలొగ్గిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

RRR Movie: ఆర్ఆర్ఆర్ విషయంలో బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న జక్కన్న.. సెంటిమెంట్పండుతుందా?

RRR Movie: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే పలు నగరాలలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ విషయంలో బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న జక్కన్న.. సెంటిమెంట్పండుతుందా?

ఈ క్రమంలోనే త్వరలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫ్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా తిరుపతిలో నిర్వహించారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ విషయంలో బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న జక్కన్న.. సెంటిమెంట్పండుతుందా?

ఈ క్రమంలోనే రాజమౌళి బాహుబలి సెంటిమెంట్ తోనే
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో ప్లాన్ చేస్తున్నారు. మరి బాహుబలి సినిమాకు వర్కవుట్ అయిన విధంగానే ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదు..

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ,రోజురోజుకు కరోనా కేసులు కూడా అధికమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై రాజమౌళి స్పందిస్తూ సినిమాని ఎట్టిపరిస్థితులలోనూ అనుకున్న తేదీలోగా విడుదల చేయాలని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

Rajamouli-Ajith: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుండగా… ఎన్టీఆర్ సరసన ఓలీవియా మోరిస్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ ప్రమోషన్లను ముందుండి నడిపిస్తున్నారు.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, కొచ్చిల్లో ప్రమోషన్లు నిర్వహించారు. ఇటీవల చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తమిళంలో వాలిమైకి పోటీగా RRR రానుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా వాలిమై తెరకెక్కింది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో అజిత్ ప్రస్తావన రాగానే కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు రాజమౌళి.

నాకు ఆశ్చర్యం వేసింది..రాజమౌళి..

ఒకసారి రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుతున్న సమయంలో అజిత్ తో మరిచిపోలేని అనుభవం ఎదురైందని గుర్తు చేసుకున్నారు రాజమౌళి. ఓసారి రామోజీ ఫిలిమ్ సిటీలో భోజనం చేసేందుకు సితార రెస్టారెంట్ వెళ్లానని.. అక్కడే భోజనం చేస్తూ అజిత్ కనిపించారని.. ఎవరో నేను వచ్చానిని చెబితే భోజనం మధ్యలో ఆపేసి నాదగ్గరకు వచ్చి లోపలికి తీసుకెళ్లారని.. అంత పెద్ద స్టార్ ఇలా వ్యవహరించడం నాకు ఇబ్బందిగా అనిపించిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. తరువాత నాభార్య రమ వస్తుందని తెలిసి.. తనను తాను పరిచయం చేసుకుని లోపలికి తీసుకెళ్లారని అజిత్ సింప్లిసిటీ గురించి చెప్పుకొచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇంత పెద్ద స్టార్ ఇంత సింపుల్  గా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపించిందని ఆయన అన్నారు.ఇటీవల తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి అజిత్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇకపై తన పేరు ముందు ‘తల’ అని పిలవద్దని ఫ్యాన్స్ కు సూచించారు. అజిత్ లేదా ఏకేగా పిలవాలని కోరిన సంగతి మనకు తెలిసిందే.

Vishwak Sen: ‘‘విశ్వక్ పోస్టు చదవగానే నాకు దగ్గొస్తోంది’’.. తరుణ్ భాస్కర్.. విశ్వక్ సేన్ రిప్లై హైలైట్ !

Vishwak Sen-Tharun Bhasker: దేశంలో మరోసారి కరోనా వైరస్ భయాందోళనలను గురిచేస్తోంది. తగ్గినట్లే తగ్గి చాప కింద నీరులో ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. దీంతో సెలెబ్రిటీల దగ్గర నుంచి సామన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మరికి గురి అవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ తో వ్యాప్తి చెందిన ఈ కరోనా కొత్తగా.. ఒమిక్రాన్ లా రూపాంతరం చెంది.. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలా కుతలం చేసేస్తోంది.

ఈ మహమ్మారి ఇండియాలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలతో సహా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అటు బాలీవుడ్ తో పాటు ఇటు దక్షిణాది చిత్రసీమల్లోని కొందరు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విశ్వక్ సేన్ వెల్లడించారు.

Vishwak Sen-Tharun Bhasker: ‘‘ఈ పోస్టు చదవగానే నాకు దగ్గొస్తోంది’’..దర్శకుడు తరుణ్ భాస్కర్ పోస్టు వైరల్..!

అతడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చాడు.. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుడి సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాను. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ ఈ వైరస్‌ సోకడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కు ధరించండి. జాగ్రత్తగా ఉండండి. నాపై మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అని విశ్వక్ సేన్ రాశాడు.

అయితే ఇదే పోస్టును తెలుగు యంగ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు. అతడిని నేను ముడు రోజుల క్రితం కలిశాను అని.. థ్యాంక్స్ రే విశ్వక్.. వాట్ ఏ ఫ్రెండ్ అంటూ పోస్టు టాప్ లో రాసి.. దాని కింద అతడు ఇలా రాశాడు.. ‘‘ఈ పోస్టు చదవగానే దగ్గొస్తుంది నాకు’’ అంటూ రాశాడు. దానికి రిప్లై ఇస్తూ విశ్వక్ సేన్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.. ‘‘అబ్బా సాయిరాం.. ఐ యామ్ సో హ్యాపీ నౌ’’ అంటూ కింద @tharunbhaskar ట్యాగ్ చేశాడు. అయితే ఇదే పోస్టును మళ్లీ.. విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.

స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. అతడు పెళ్లిచూపులు సినిమాకు దర్శకుడిగా పని చేశాడు. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా ‘ఈ నగరానికి ఏమైంది’కి దర్శకత్వం వహించాడు. తర్వాత ఫలక్ నుమా దాస్ లో అతడు నటించాడు. ఇలా విశ్వక్ సేన్ కు.. తరుణ్ భాస్కర్ కి మథ్య స్నేహం ఏర్పడింది. దీంతో వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా.. కలిసే వెళ్తారు. ఇటీవల ఆహాలో మొదలైన గేమ షో లో కూడా కలిసే పాల్గొన్నారు.

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

Acharya: చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ’ఆచార్య‘ కొరటాల శివ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. చిరంజీవితో పాటు మరో క్యారెక్టర్ లో రామ్ చరణ్ తేజ్ నటిస్తుండటంతో భారీ క్రేజ్ నెలకొంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా… చెర్రీ పక్కన పూజా హెగ్డే నటిస్తున్నారు. 

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

2022 ఫిబ్రవరి 4న ఆచార్య సినిమా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ సిద్దమవుతోంది. సైరా తరువాత చిరంజీవి తీస్తున్న సినిమా కావడంతో ఇందులో కమర్షియల్ అంశాలు తగ్గకుండా… దర్శకుడు కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు కొరటాల శివకు కూడా వాటా ఉందని తెలుస్తోంది.

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

దీంతో కొరటాల శివ దగ్గరుండీ మరీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారట. సినిమాకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను కొరటాల శివే తనపై వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆచార్య సినిమాకు నష్టాలు వస్తే కొరటాల శివ చేతి నుంచి ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్.. మరీ ఈ సినిమా….

అయితే ఇప్పటి వరకు కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ వద్ద దమ్మురేపాయి. తీసిన అన్ని సినిమాలు కూడా పెద్ద హిట్లను సాధించాయి. ప్రస్తుతం ఈ అంశమే కొరటాల శివకు సానుకూలంగా మారనుంది. మెగాస్టార్ ఇమేజ్, కొరటాల ట్రాక్ రికార్డ్ ఆచార్య సినిమాకు ప్లస్ కానున్నాయి. దీంతో సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయనేది వాస్తవం. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రం కలెక్షన్లు దుమ్మురేపుతాయి. ఏది ఏమైనా కొరటాల శివ ఖాతాలో మరో హిట్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!

RRR Movie Tittle: వచ్చే సంవత్సరం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను లెజెండరీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అయితే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు అయ్యాయట.

RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉంది. ఇటీవల ముంబై, చెన్నై, తిరువనంతపురం నగరాలను చుట్టేశారు. వరుస ఇంటర్వ్యూలతో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ”ది కపిల్‌ శర్మ షో” లో పాల్గొన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ వెనుకున్న సీక్రెట్‌ను రివీల్‌ చేశారు.

RRR Movie Tittle: ఆర్ఆర్ఆర్(RRR) టైటిల్ వెనక ఇంత అర్థం దాగి ఉందా.. అర్థాన్ని వివరించిన జక్కన్న!

ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఏ టైటిల్‌ పెట్టాలో అర్థం కాలేదు. దీంతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ఇలా ముగ్గురి పేర్లు కలిసేలా ఆర్‌ఆర్‌ఆర్‌ అనుకున్నాం. సోషల్‌ మీడియాలో కూడా ఆ పేరుతోనే అప్‌డేట్స్‌ ఇచ్చాం. దీంతో ఈ కాంబినేషన్ పేరుకు మేము అనుకున్న దాని కంటే కూడా ఎక్కువగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. దీంతో ఇదే పేరును పెట్టాలని డిసైడ్ అయ్యామన్నారు.

RRR హ్యాష్‌ట్యాగ్‌తోనే సినిమాకు..

ఇక వాటికి సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఎమోషన్లను దృష్టిలో పెట్టుకొని.. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే రౌద్రం, రణం, రుధిరం’ అని పెట్టామన్నారు. అలా #RRR హ్యాష్‌ట్యాగ్‌తోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చి.. ఇదే టైటిల్ ను చివరకు సినిమాకు పెట్టామన్నారు. ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయంపైనా ఆయన స్పందించారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. బయట వచ్చే పుకార్లను ఏ మాత్రం నమ్మెద్దన్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్న విషయం విధితమే. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు.

MegaStar Chiranjeevi: లూసిఫర్ సినిమా రిమేక్ ‘గాడ్ ఫాదర్ ’ పై .. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

Mega Star Chiranjeevi: తెలుగులో త్వరలో చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న సినిమా ‘‘గాడ్ ఫాదర్’’. దీనిని మళయాల సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. మళయాలంలో ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడిగా పనిచేశాడు. హిట్లర్ సినిమాకు కూడా ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ సినిమాకు మోహన్ రాజా పనిచేశాడు.

MegaStar Chiranjeevi: లూసిఫర్ సినిమా రిమేక్ ‘గాడ్ ఫాదర్ ’ పై .. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

రామ్ చరణ్ నటించిన ధృవ ఓరిజినల్ తనీ ఒరువన్ ను కూడా మోహన్ రాజా తెరకెక్కించడం విశేషం. హనుమాన్ జంక్షన్ సినిమాను కూడా తెరకెక్కించింది కూడా ఈయనే. దాదాపు ఈ సినిమాను తెలుగులో నిర్మించి 20 ఏళ్లు పూర్తయ్యాయి. దాదాపు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత గాడ్ ఫాదర్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి అతడు కొన్ని విషయాలను మాట్లాడారు.

MegaStar Chiranjeevi: లూసిఫర్ సినిమా రిమేక్ ‘గాడ్ ఫాదర్ ’ పై .. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

హిట్లర్ సినిమా సమయంలో తనకు 22 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ టైంకు తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. హిట్లర్ సినిమా ఒరిజినల్ వెర్షన్ మళయాలంలో చిరంజీవి చూసే సమయంలో అతని పక్కనే ఉన్నానని.. చిరంజీవికి అర్థం కాని సీన్లు వచ్చే సమయంలో తానే తెలుగులో చెప్పానని.. అన్నాడు.

చిరంజీవితో కలిసి నటించే అవకాశం..

మళ్లీ ఇన్నాళ్లకు తనకి చిరంజీవితో కలిసి పని చేసే అవకాశం వచ్చిందన్నారు. ఇక లూసిఫర్ సినిమాను మక్కీకి మక్కీ కాకుండా.. మెగస్టార్ కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశామన్నారు. అతడు షూటింగ్ చేస్తున్న సమయంలో.. నేను కట్ చెప్పకుండానే.. మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయానన్నారు. అంతలా సినిమాలో లీనమయ్యానన్నాడు. జవవరిలో షూటింగ్ అంతా చాలా వరకు పూర్తి అవుతుందన్నారు. మళయాలంలో చూసిన వారికి కూడా.. ఇది బాగా నచ్చుతుందన్నారు. మెగస్టార్ అభిమానులకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని మోహన్ రాజా ఈ సందర్భంగా వెల్లడించారు.

Sukumar-Pushpa: పుష్ప సినిమా వర్కర్లందరికీ..! డైరెక్టర్ సుకుమార్ ఎంత ఇచ్చాడో తెలుసా.?

Sukumar-Pushpa: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే రూ. 100 కోట్లను వసూళ్లను క్రాస్ చేసింది. ప్యాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ అన్ని భాషల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

Sukumar-Pushpa: పుష్ప సినిమా వర్కర్లందరికీ..! డైరెక్టర్ సుకుమార్ ఎంత ఇచ్చాడో తెలుసా.?

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. తగ్గేదే లే అన్న రీతిలో వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. సినిమాకు ముందే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. దీంతో పాటు సమంత ఐటెం సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. తాజాగా పుష్ప సినిమా యూనిట్ థాంక్స్ మీట్ లలో పాల్గొంటుంది. తాజా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.

Sukumar-Pushpa: పుష్ప సినిమా వర్కర్లందరికీ..! డైరెక్టర్ సుకుమార్ ఎంత ఇచ్చాడో తెలుసా.?

ముందుగా బన్నీ మాట్లాడుతూ.. సుకుమార్ లేకుంటే స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ లేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో సుకుమార్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. పుష్ప సక్సెస్ లో తన భార్యకు కూడా పరోక్షంగా కారణం అంటూ.. సుకుమార్ తన భార్య గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ తరువాత.. సినీ గేయరచయిత చంద్రబోస్ కాళ్లను మొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు సుకుమార్. 

వాళ్లందరికి ఒక్కో లక్ష రూపాయలు.. ప్రకటించిన సుకుమార్:

ఇదిలా ఉంటే సుకుమార్ తన టీంకు బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. తన టీంకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించారు. సుకుమార్ మాట్లాడుతూ.. ప్రొడక్షన్ బాయ్స్, సెట్ బాయ్స్ ఇలా అందరిని కష్టపెట్టానని తెలుసని సుకుమార్ వారి గురించి మాట్లాడారు. ఆర్య దగ్గర నుంచి రంగా బ్యాచ్ అని ఒకటి ఉందని… 24 గంటలు ఆలోచించవచ్చు కానీ.. 24 గంటలు పనిచేస్తూ ఉండగలమా అని ప్రశ్నించారు. ఈ విధంగా బండలెత్తుతూ వారంతా పనిచేశారని తెలిపారు. సెట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ కి, లైట్ మెన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని సుకుమార్ ప్రకటించారు.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

Tabita-Sukumar: తెరపై ఎమోషన్లు పలికిండమే తప్పితే నిజజీవితంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పెద్దగా ఎమోషల్ అయిన దాఖలాలు లేవు. తాజాగా పుష్ప సక్సెస్ మీట్ లో మాత్రం ఎమోషనలో అయ్యాడు సుకుమార్. ఐకాన్ స్టార్ బన్నీ.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా పుష్ప విజయవంతంగా దూసుకుపోతోంది.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

ఇప్పటికే రికార్డ్ స్ఠాయి కలెక్షన్లను రాబడుతోంది. ముక్యంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కూడా సినిమా సక్సెస్ అయింది. సినిమా విడుదలకు ముందే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ లో క్రేజీ బజ్ పెంచాయి.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

తాజాగా.. పుష్ప సక్సెస్ మీట్ లతో చిత్ర యూనిట్ పాల్గొంటుంది. ఇలా ఓ కార్యక్రమంలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. సుకుమార్ లేకపోతే.. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవ్వేవి లేవంటూ.. బన్నీ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. 


నీలాంటి భర్త దొరకడం నా భాగ్యం..

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సుకుమార్ తన భార్యకు థాంక్స్ చెబుతూ.. మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. నన్ను భరిస్తున్నందవుకు తబితకు థాంక్స్. ఈ విజయంలో నాభార్య భాగస్వామ్యం కూడా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. తన భార్యపై ఉన్న ప్రేమను ఇలా తెలియజేశారు. దీనికి ప్రతీకగా.. భర్త సుకుమార్ పై ఎమోషన్ పోస్ట్ పెట్టింది తబిత. నా పేరుతోనే థాంక్యూని స్టార్ట్ చేసిన నా భర్త, నా సామీ సుకుమార్‌‌కి ఒక మాటతో మొదలు పెడతా.. నా ప్రాణం నువ్వు, నా సర్వం నువ్వు.. నా జీవం నువ్వు.. నీలాంటి బంగారం లాంటి మనిషికి భార్యని అయ్యే భాగ్యం దొరికినందుకు ఆ దేవుడికి మొదట థ్యాంక్స్ చెప్పాలి. ప్రతీ భార్య చాలా కలలు కంటుంది..  నిజానికి నా కలలు కొన్ని కలలుగానే మిగిలిపోయినా.. నీ కలనే నా కలగా మార్చేసుకున్నా ఈ జీవితానికి అంటూ పోస్ట్ పెట్టింది.

Bandla Ganesh: బ్రేకింగ్ న్యూస్.. బండ్ల గణేష్ పై అరెస్టు వారెంట్ జారీ.. కారణం ఏంటంటే..!

Bandla Ganesh: కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి.. ప్రస్తుతం బిగ్గెస్ట్ నిర్మాతగా పేరు పొందిన వ్యక్తి బండ్ల గణేష్. రవితేజ ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్… తొమ్మిది చిత్రాల వరకు నిర్మించారు. ఇలా బండ్ల గణేష్ నిర్మాతగా మారాడు.

Bandla Ganesh: బండ్ల గణేష్ పై అరెస్టు వారెంట్ జారీ.. కారణం ఏంటంటే..!

ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. అయితే అతడు చేసే ట్వీట్స్ ఇటీవల కాంట్రవర్సీలకు అడ్డాగా మారుతున్నాయి.
తాజాగా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రకాశం జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చిన రూ. 1.25 కోట్ల చెక్ బౌన్స్ అయిందట.

Bandla Ganesh: బ్రేకింగ్ న్యూస్.. బండ్ల గణేష్ పై అరెస్టు వారెంట్ జారీ..కారణం ఏంటంటే..!

దీంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో బండ్లగణేష్ కు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్‌ ఏఎంఎం కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతడిని అరెస్టు చేసి.. కోర్డుకు హాజరు పరచాలని పోలీసులను జడ్జి ఆదేశించాడు. ఈ క్రమంలో నేడు కోర్టులో బండ్ల గణేష్ హాజరుకానున్నాడు.

ఏపీలో బండ్ల గణేష్ పై మరో కేసు కూడా..

అతడికి అంతకముందు ఏపీలో మరో కేసు కూడా నమోదైంది. అది కూడా ఆర్థిక వ్యవహారానికి సంబంధించింది కావడం విశేషం. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు తీసుకున్నారట. అయితే తిరిగి చెల్లించకపోవడంతో.. బండ్ల గణేష్‌పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అప్పట్లో అతడికి నోటీసులు జారీ చేసినా.. స్పందించలేదు. దీంతో అప్పుడు కూడా అతడిని కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించినా వినిపించుకోలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కడప మెజిస్ట్రేట్. ఇలా అతడు ఇదే వ్యవహారానికి సంబంధించి రెండో సారి కోర్టు ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించడం రెండోసారి కావడం విశేషం.