Tag Archives: Geethu Royal

Geethu Royal: బిగ్ బాస్ బజ్ ప్రశ్నలు తను రాసిచ్చేవాడు.. అసలు విషయం చెప్పిన గీతూ?

Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమంలో ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ లో అప్పుడే తిరిగి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ఇక్కడ అంతకుముందు సీజన్లో కంటెంట్ గా పాల్గొన్నటువంటి వారు యాంకర్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎలిమినేట్ అయినటువంటి వారిని పెద్ద ఎత్తున ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. బిగ్ బాస్ వేదికపై నాగార్జున కూడా అడగని ప్రశ్నలను తాను ఈ కార్యక్రమంలో అడిగానని గత కొద్దిరోజుల క్రితం ఈమె నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా తాను బిగ్ బాస్ కార్యక్రమంలో అడిగే ప్రశ్నలన్ని నేను ప్రిపేర్ చేసుకోలేదని నాకు వేరే ఫ్రెండ్ ప్రిపేర్ చేసి ఇచ్చేవాడు అంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.

ఆదిరెడ్డి హెల్ప్ చేశారు..


బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూయర్ గా వ్యవహరిస్తూ గత సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో ఆదిరెడ్డి ఒకరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని తరచూ ఫాలో అవుతూ ఉంటారు అయితే ఆ సమయంలో గీతూ అమ్మగారికి అనారోగ్యం చేయడంతో తాను ఈ కార్యక్రమాన్ని ఫాలో అవ్వడానికి కుదరలేదని అందుకే తనకు ప్రశ్నలు ప్రిపేర్ చేయాలని చెప్పడంతో ఆదిరెడ్డి తనకు ఈ ప్రశ్నలు అన్ని కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేవారు అంటూ ఈ సందర్భంగా గీతూ తెలియజేశారు.

Geethu Royal: వాళ్ల కంటే నేనేం తక్కువ… బిగ్ బాస్ ఎలిమినేషన్ పై అసలు విషయం వెల్లడించిన గీతూ?

Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమంలో తొమ్మిదవ వారం జరిగిన ఎలిమినేషన్ అందరినీ ఓకింత ఆశ్చర్యానికి గురిచేసింది.టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఉన్నఫలంగా 9వ వారం బిగ్ బాస్ నుంచి బయటకు రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విధంగా 9వ వారం గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఆమె కూడా ఎంతో షాక్ అయ్యి తాను బిగ్ బాస్ వదిలి వెళ్ళనని నన్ను పంపించకండి బిగ్ బాస్ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యారు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గీతూ కూడా బజ్ కార్యక్రమంలో తప్ప ఎక్కడ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు అయితే తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ ఎలిమినేషన్ గల కారణాలను ఈమె చెప్పు చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నుంచి తాను ఎలిమినేట్ కావడానికి కేవలం కొందరే కారణమంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు.

తాను బిగ్ బాస్ వెళ్లే ముందు కొందరికి తన గురించి పాజిటివ్ గా ప్రమోట్ చేయమని 25 వేల రూపాయలను ఇచ్చాను.వారిపై ఉన్న నమ్మకంతో నేను ధైర్యంగా హౌస్ లోకి అడుగుపెట్టానని అయితే వాళ్ళు డబ్బులు తీసుకుని నా గురించి ఏ మాత్రం ప్రమోషన్ చేయలేదు అని తాజాగా బయటకు వచ్చిన తర్వాత తనకు ఈ విషయం తెలిసిందని ఇలా నమ్మి వారికి డబ్బులు ఇస్తే వాళ్లు మోసం చేశారని గీతూ ఎమోషనల్ అయ్యారు.

Geethu Royal: వాళ్ళు చేస్తే కరెక్ట్.. నేను చేస్తే తప్పా…


ఇలా నమ్మిన వాళ్లే మోసం చేయడం తనని ఎంతగానో బాధ పెట్టిందని, నేను ఆడిన ఆట తీరును తప్పు పడుతున్నారు. గత బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నటువంటి అభిజిత్ కౌశల్ కన్నా నేనేం తక్కువ వాళ్ళు చేస్తే ఒప్పు నేను చేస్తేతప్ప అంటూ ఈమె తన ఎలిమినేషన్ కి గల కారణాలను తెలియజేస్తూ మరోసారి ఎమోషనల్ అయ్యారు. ఇలా గీతూ తన ఎలిమినేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Geethu Royal: తొమ్మిది వారాలకు గాను గీతూ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Geethu Royal: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారం అవుతూ ఇప్పటికే 9 వారాలను పూర్తిచేసుకుని పదవ వారంలోకి అడుగు పెట్టింది.21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంతో వినోదాన్ని పంచుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి గీతూ గురించి అందరికీ తెలిసిందే.

ఈమె అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా గీతూపర్ఫామెన్స్ ద్వారా ఈమె టాప్ ఫైవ్ పొజిషన్లో ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈమె 9వ వారం బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రేక్షకులతో పాటు గీతూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చారు.ఈమె ఎలిమినేట్ అయ్యారనే విషయం తెలియగానే తాను బిగ్ బాస్ నుంచి బయటకు రానట్టు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇక ఎంతో బాధతో బిగ్ బాస్ హౌస్ వీడినటువంటి ఈమె బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో తప్ప ఎక్కడ ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో గీతూ కొనసాగిన 9 వారాలకు గాను ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Geethu Royal: దారుణంగా గీతూ రెమ్యూనరేషన్…


సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది వారాల పాటు కొనసాగిన గీతు కేవలం 2.5 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఎంతో అద్భుతమైన ఆట తీరును కనబరిచిన గీతూ ఈ విధంగా 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈమె రెమ్యూనరేషన్ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై గీతు స్పందించాల్సి ఉంది.

Geethu Royal: జీవితాంతం రుణపడి ఉంటా… దయచేసి పంపించకండి.. గుండెలు పగిలేలా ఏడ్చిన గీతూ!

Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమం 9వ వారం ఎంతో భావోద్వేగాల నడుమ ముగిసింది.9వ వారం ఎలిమినేషన్ లో భాగంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా అభిమానులతో పాటు కంటెస్టెంట్ గీతూ షాక్ కి గురయింది.ఈవారం ఎలిమినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరిని నాగార్జున ఒక్కొక్కసారి సేవ్ చేస్తూ ఉండగా చివరికి శ్రీ సత్య గీతూ మిగిలిపోయారు.

ఇక ఈవారం తానే ఎలిమినేట్ అయ్యేది తానే అంటూ శ్రీ సత్య ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోగా ఒక్కసారి బిగ్ బాస్ శ్రీ సత్యను సేవ్ చేస్తూ హౌస్ నుంచి గీతూను ఎలిమినేట్ చేశారు.ఇలా ఈమె ఎలిమినేట్ అయిందని తెలియగానే హౌస్ లో ఉన్నటువంటి రేవంత్ ఆది శ్రీ సత్య ఫైమా ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.తాను బిగ్ బాస్ హౌస్ విడిచి వెళ్ళనని దయచేసి తనను పంపించకండి అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక హౌస్ లో తన ఫేవరెట్ ప్లేస్ కు వెళ్లి కాసేపు కూర్చొని ఎంతో ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ హౌస్ వీడి బయటకు వచ్చారు.బయటకు వచ్చినటువంటి ఆమె తన జర్నీ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడ్చడంతో నాగార్జున సైతం ఆమెను ఓదార్చలేక చూస్తూ ఉండిపోయారు. 24 గంటలు తాను బిగ్ బాస్ టైటిల్ కోసమే కష్టపడ్డానని, ప్రతిక్షణం తన ఆట తీరును కనబరిస్తూ గెలుపు కోసం కష్టపడిన తనని ఇంత తొందరగా బయటకు పంపిస్తున్నారనీ ఏడ్చారు.

Geethu Royal: టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరో చెప్పిన గీతూ..


దయచేసి నన్ను బయటకు పంపించకండి అంటూ ఏర్పడమే కాకుండా ఐ లవ్ యు బిగ్ బాస్ మీకు రుణపడి ఉంటా అంటూ గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చారు. ఇక ఈమె ఎలిమినేట్ కావడంతో ఆది రేవంత్ సైతం ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆది గురించి గీతూ మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఆదిరెడ్డి అంటూ ఈమె ఆదిరెడ్డి గురించి చెప్పుకొచ్చారు. ఆదిరెడ్డి, ఫైమా, శ్రీ సత్య, రేవంత్, శ్రీహాన్ టాప్ ఫైవ్ లో ఉంటారంటూ ఈమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల గురించి కూడా చెప్పుకొచ్చారు.

Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు వీళ్లే… వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్?

Bigg Boss6: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే సీజన్ 6 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లిస్ట్ బయటకు వచ్చింది.

ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే… దీపికా పిల్లి, శ్రీహాన్, ఆర్ జ సూర్య, చలాకీ చంటి, గీతూ రాయల్, యాంకర్ ఉదయభాను, అమర్ దీప్, ఆదిరెడ్డి వంటి తదితరులు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.అలాగే నాన్ స్టాప్ సీజన్లో పాల్గొన్న కొందరు కంటెంట్ లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం.

Bigg Boss6: ఆసక్తిని పెంచుతున్న బిగ్ బాస్….

ఇక గత సీజన్ ఫైవ్ సిరి పాల్గొనగా సీజన్ సిక్స్ లో తన ప్రియుడు శ్రీహాన్ పాల్గొనబోతున్నారు.అలాగే జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్ తాజాగా నటి తేజస్వినితో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన తన పెళ్లిని వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి వస్తారా లేక త్వరగా పెళ్లి పూర్తి చేసుకుని ఈ కార్యక్రమానికి వస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.