Tag Archives: girl

Rahul Gandhi: పబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లోని ఖాట్మండు నైట్ క్లబ్‌లో ఓ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని
బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదే అదునుగా భావించిన బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Rahul Gandhi: పబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?

ఇక ఈయన పబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈయన పక్కన పబ్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎవరు అనే విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ అమ్మాయి చైనా రాయబారి అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చైనా రాయబారి హౌ యాంకీ అని చెబుతూనే మరో అడుగు ముందుకేసి ‘చైనా హనీ ట్రాప్’ అనే పదాన్ని కూడా ఉపయోగించారు.

Rahul Gandhi: పబ్ లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా?

రాహుల్ గాంధీతో పాటు పబ్ లో ఉన్నటువంటి అమ్మాయి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరగడంతో ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా… ఆమె చైనా రాయబారి కాదని తేలింది. ఆ అమ్మాయి రాహుల్ గాంధీ స్నేహితురాలు సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని వెల్లడించారు.

ఏ ఒక్కరూ చైనీయులు కాదు…

రాహుల్ గాంధీ తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహం కోసం నేపాల్ వెళ్లారు. వివాహ విందును నైట్ క్లబ్ లో ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురు ఆ క్లబ్ కు వెళ్లారు. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరిలో కూడా చైనీయులు లేరని నైట్ క్లబ్ యాజమాన్యం తెలియజేశారు. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ క్లబ్ లో ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయనపై ఎంతోమంది విమర్శలు చేశారు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ రష్మీతో కలిసి సుధీర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇకపోతే సుధీర్ రష్మి జంటకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలలో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ చేయడం చేయడం ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు. ఇక నిజజీవితంలో కూడా వీరిద్దరూ జంటగా మారితే చూడాలని ఎంతోమంది అభిమానులు భావించారు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఇదిలా ఉండగా తాజాగా సుదీర్ మరొక అమ్మాయితో నిశ్చితార్ధం జరుపుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. సుడిగాలి సుదీర్ నిజంగానే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నాడా ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అంటూ పెద్ద ఎత్తున తన గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన తేజస్వి..

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…సుడిగాలి సుధీర్ తో నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు తేజస్వి నాయుడు ఈమేది హైదరాబాద్.చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి వచ్చిన తేజస్వి నాయుడు ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు ఎలాంటి అవకాశాలు దక్కలేదు.ఈ క్రమంలోనే కొన్ని యాడ్ షూట్లో పాల్గొన్న తేజస్వి నాయుడు తాజాగా తాజాగా సుడిగాలి సుదీర్ తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. మరి ఈ పాపులారిటీతో ఈమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తాయో తెలియాల్సి ఉంది.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి పెళ్లి ఫిక్స్..? అమ్మాయి ఎవరో తెలుసా..?

Sudigali Sudheer: జబర్ధస్త్ కామెడీ షో.. ఈ పేరు చెప్పగానే చాలామందికి కొన్ని పేర్లు టక్కున గుర్తుకు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునే వ్యక్తి సుడిగాలి సుధీర్. మొదట్లో ఈ షోలో అతడు సీనియర్ కమెడియన్ వేణు స్కిట్ లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అతడి కామెడీ టైమింగ్స్.. అతడి నటన చూసి.. ఈ టీవీ మల్లెమాల ప్రొడక్షన్స్ అతడిని టీమ్ లీడర్ గా ప్రమోట్ చేశారు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి పెళ్లి ఫిక్స్..? అమ్మాయి ఎవరో తెలుసా..?

ఇక ఆ తర్వాత యాంకర్ రష్మీతో కలిసి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఇద్దరు కలసి.. ప్రేమికులుగా.. ఎన్నో వందల స్కిట్లను చేసి.. ప్రేక్షకుల్లో ఓ భావనను క్రియేట్ చేశారు. వారిద్దరి కలిసి ఏ షోలో కనిపించినా ఆ షో రేటింగ్స్ విపరీతంగా పెరిగిపోయేవి.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి పెళ్లి ఫిక్స్..? అమ్మాయి ఎవరో తెలుసా..?

అయితే సుడిగాలి సుధీర్ కు సంబధించి ఓ వార్త సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. దీని గురించి తెలుసుకుందాం. ఇటీవల యాంకర్ రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకుందని.. అందుకే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేస్తున్నారనే వార్తలు వచ్చాయి.

అతడి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా..

అంతే కాదు.. అతడు కూడా వేరే అమ్మాయినీ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని కూడా అనుకున్నారట. అయితే ఇప్పటికీ యాంకర్ రష్మీతో అతడు ప్రేమలో ఉన్నాడని.. ఆ కారణంతోనే అతడు పెళ్లిని వాయిదా వేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే ఆమెకు పెళ్లి అయిందనే వార్తలు బలంగా వినిపిస్తుండటంతో.. అతడి ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, రాంప్రసాద్ పెళ్లి ప్రయత్నాలు సీరియస్ గా మొదలు పెట్టారట. అతడి వయస్సు కూడా పెరిగిపోతుండటంతో.. అతడి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారట. ఇక ఆ అమ్మాయి సుధీర్ సొంత జిల్లాకు చెందని యువతి అని తెలుస్తోంది. సుధీర్ కు కూడా సంబంధం నచ్చి వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు రాలేదు. అయితే ఇటువంటి వార్తలు అతడి పెళ్లిపై వస్తున్నా సుధీర్ ఇంతవరకు స్పందించలేదు.

Girl Child: ఈ గ్రామంలో అమ్మాయి పుడితే చాలు..రూ.11,116 డబ్బులు మీ సొంతం!

Girl Child: రోజురోజుకు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతూ పరుగులు తీస్తున్నా కొందరు మాత్రం పిల్లల పట్ల లింగ వివక్షత చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆడపిల్ల పుడితే బరువు అవుతుందని చదువుకోని వారు భావిస్తున్నప్పటికీ అమ్మాయి పుడితే రక్షణ కరువు అవుతుందని చదువుకున్నవారు కూడా ఆడపిల్లను పెంచి పెద్ద చేయాలంటే బరువుగా భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే చాలామంది అమ్మాయి పుడుతుందని తెలియగానే వారిని కడుపులోనే చిదిమేస్తున్నారు. మరికొందరు చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. అయితే ప్రజల్లో మార్పు రావడం కోసం వారి ఆలోచన ధోరణి మార్చడం కోసం తెలంగాణ వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, మద్దిగట్లకు చెందిన యువకులు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలోనే ఆ గ్రామంలో నివసించే కొంతమంది యువకులు ఒక గ్రూపుగా ఏర్పడి ఆడపిల్లల పట్ల చూపిస్తున్న వివక్షతను ప్రతి ఒక్కరిలో తొలగించడం కోసం సరికొత్త ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే ఆ గ్రామంలో ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో వారికి ఈ యువకులు ఏకంగా రూ.11,116 డబ్బులను అందజేస్తున్నారు.

అభయ హస్తం పేరుతో సహాయం..

ఇలా ఈ గ్రామంలోని యువకులు ఇప్పటికే 19 మంది ఆడపిల్లలకు 2,11204 రూపాయలు డబ్బు అందజేశామని ఈ పథకానికి అభయహస్తం అనే పేరును పెట్టినట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ గ్రామంలోని యువకులు కమిటీగా ఏర్పడి డబ్బును పోగు చేయడం కోసం ఏర్పాట్లు చేయగా వీరు చేస్తున్న మంచి పని అభినందిస్తూ కొందరు దాతలు వీరికి సహాయం చేస్తున్నారు.ఏది ఏమైనా ఆడపిల్లల సంరక్షణ కోసం ఈ గ్రామంలో యువకులు చేస్తున్న ఈ పని పై పలువురి ప్రశంసలు కురిపిస్తున్నారు.

అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం..తన మనస్సులో మాట బయట పెట్టిన సన్నీ..!

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే సన్నీ విజేతగా నిలిచాడు. కప్పు ముఖ్యం బిగులు అంటూ చెప్పిన తన ఫ్రెండ్స్ మాటను నిజం చేశాడు. ఇక తన ఆటతోనే కాదు.. మాటలతో కూడా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో సిరి-షణ్ముఖ్ ఇతన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా.. చివరికి తన క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ షర్ట్‌లో చేయిపెట్టాడని రచ్చ చేసినా.. అవేవీ తన వ్యక్తిత్వాన్ని చెరపలేవని చెప్పకనే చెప్పాడు.

హౌస్ లో ఉన్నంత వరకు అతడినే టార్గెట్ చేసినా ఏనాడు ఆటలో వెనకడుగు వేయలేదు. తన చిరునవ్వును చిందిస్తూనే ఇతర మొహాల్లో నవ్వును తెప్పించాడు. పక్కన ఉన్నవాడు బాధపడుతుంటే.. అతడు తన శత్రువు అయినా పక్కకు చేరి.. ఓదార్చాడు. ఇవన్నీ అతడి మంచితనానికి నిదర్శనం అనే చెప్పాలి.

హౌస్ లో టాప్ 5కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కొంతమందిలో కామెడీ లేకపోవడం.. మరికొంతమందిలో ఎమోషనల్ పండించడకపోవడం.. ఆటలో ఎక్కువగా పాల్గొనకపోవడం లాంటివి ఉన్నాయి. కానీ సన్నీలో ఏమి లేవో వెతుక్కోవాల్సిన పరిస్థితి.. అతడిలో ప్రతీ యాంగిల్ దాగి ఉంది.

అందుకేనేమో ప్రేక్షకులు అతడిని గెలిపించారు. ఇక అతడు హౌస్‌లో ఉన్న 106 రోజులు సన్నీని శత్రువుగానే చూసిన షణ్ముఖ్, సిరీల గురించి సన్నీ స్టేజ్ మీద ఎమోషనల్‌గా మాట్లాడి దటీజ్ బిగులూ అనిపించాడు. ‘సార్ ఇక్కడ మాట్లాడినా నామినేషన్‌లో మాట్లాడినట్లే ఉంది సార్..’ అంటూ కామెడీతో స్పీచ్ మొదలుపెట్టిన సన్నీ.. మొదట అందరికీ థాంక్స్ చెప్పాడు.

తర్వాత తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చాడు. తర్వాత అరియానా హోస్ట్ గా చేస్తున్నా బిగ్ బాస్ బజ్ లో కూడా అతడు మాట్లాడాడు. హౌస్ లో అతడు బాధపడ్డ క్షణాలు.. సంతోషించన మధురానుభూతులు చెప్పుకొచ్చాడు. దీనిలో అందరి గురించి మాట్లాడుతూ.. పింకీ లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అతడికి సంబంధించి బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓ అమ్మాయితో డేట్ కోసం వెళ్తే.. ఆమె ఏం చేసిందో చెప్తూ.. !

తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని గంటలే సమయం ఉంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తోంది. దీంతో ఎవరు విన్నర్ గా నిలుస్తారో అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా సన్నీ, షణ్మఖ్ మధ్య ఎక్కువగా పోటీ నెలకొందని.. నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

వీరిద్దరిలోనే ఒకరు విన్నర్ అవుతారని నెటిజెన్లు తమకు నచ్చిన విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ ముందు కంటెస్టెంట్లతో సరదా ఎపిసోడ్ ప్లాన్ చేశారు. దీనికి గత సీజన్లలోని కంటెస్టెంట్లు అతిధులుగా వచ్చారు. ఈ క్రమంలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చారు.

బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారు. దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారడంతో అందరూ నవ్వారు. ఇక అఖిల్ సార్థక్ .. సన్నీని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మరేప్పుడైనా డేటింగ్ యాప్ లో ఎవరినైనా కలిశారా..? అని అడిగాడు. దీనికి సమాధానంగా.. సన్నీ‘నేను ఓ అమ్మాయిని కలిశాను.

అయితే ఆమె నా ముచ్చట వదిలేసి.. ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పసాగిందని’ అన్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఇక బిగ్ బాస్ ముగింపుకు ముందు ఎపిసోడ్లలోనే ఇంత ఆసక్తి నెలకొంటే.. ఇక గ్రాండ్ ఫినాలే ఎలా ఉంటుందో చూడాలి

తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థి..!

ఒకప్పుడు పాఠశాలలకు కాలేజీలకు సెల్ ఫోన్ అనుమతి ఉండేది కాదు. అయితే కరోనా పూర్తిగా అన్ని నియమ నిబంధనలను మార్చేసింది. ఇప్పుడు తరగతి గదులు వినాలంటే సెల్ ఫోన్ ఎంతో ముఖ్యంగా మారిపోయింది. కరోనా కారణం వల్ల పాఠశాలలు మూతబడటం చేతే పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని పూర్తిగా సెల్ ఫోన్ కి అంకితమయ్యారు. కొంత మంది పిల్లలకు అది వ్యసనంగా మారడం చేత పిల్లలను అదుపు చేయాలని తల్లిదండ్రులు పిల్లలను మందలించడంతో పిల్లలు ఎంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి.

తాజాగా ఇలాంటి ఘటన మీర్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్వోదయ నగర్‌ లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది స్థానికంగా నివసించే ఓ పదో తరగతి విద్యార్థి నిత్యం సెల్ ఫోన్ కి బానిస అయ్యి సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతుడడంతో తన తండ్రి తనని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఘోరమైన నిర్ణయాన్ని తీసుకుంది.

అందరూ పడుకొని ఉండగా బాలిక ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గుంటూరు నగరంలో యువతి హత్య!

గుంటూరు నగరం లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ బీటెక్ యువతి హత్యకు గురైంది ఈ ఘటన కాకాణి పరామయ కుంటలో జరిగింది. రమ్య అనే యువతని గుర్తు తెలియని యువకుడు గొంతుకోసి పరారయ్యాడు.

కాగా హత్యకు గురైన యువతి నగరంలోని సెయింట్ మేరీస్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి కోసం తల్లిపై అలిగి హోర్డింగ్ ఎక్కిన బాలిక… చివరికి?

పెళ్లి కోసం కొందరు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అన్నం తినకుండా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ బెదిరిస్తూ ఉండటం మనం చూసి ఉంటాం. కానీ పెళ్లి కోసం తనతల్లి పై అలిగి ఏకంగాహోర్డింగ్ ఎక్కి బెదిరించిన ఘటన తాజాగా మధ్యప్రదేశ్ ఇండర్‌లో చోటు చేసుకుంది. ఓ టీనేజర్ పారదేశీపురలో ఉన్న బండారీ బ్రిడ్జి వంతెనపై గల భారీ హోర్డింగ్ ఎక్కి ఫోన్ చూసుకుంటే కనిపించింది. దీంతో ఆమెను చూసిన అందరూ ఆత్మహత్య చేసుకోవడానికి పైకెక్కింది భావించారు. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఎంచక్కా హోర్డింగ్ పై కూర్చుని ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ ఉండటంతో సిగ్నల్స్ కోసం అంత పైకి ఎక్కిందా అని కొందరు కామెంట్ చేసుకున్నారు.

కానీ కొద్ది సమయానికి ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి రావడంతో ఏదో ప్రేమవ్యవహారం అనుకున్నారు. కానీ ఆ అంచనాలు కూడా కాదని ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కోసం తన తల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ ఎక్కి బెదిరిస్తుందని తెలియడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనింకా మైనర్ అయినప్పటికీ ఒక అబ్బాయిని ప్రేమించి పీకల్లోతులో ప్రేమలో మునిగి పోయింది. ఈ విషయం తన తల్లితో చెప్పి తన పెళ్లి చేయాల్సిందిగా అడగడంతో అందుకు తన తల్లి మందలించి బుద్ధిగా చదువుకోమని చెప్పింది. దీంతో ఆబాలిక తనతల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ బోర్డ్ ఎక్కినిరసన తెలియజేసింది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను కిందికి దిగి రావాల్సిందిగా కోరారు. కానీ ఆమె తన పెళ్ళికి తన తల్లి ఒప్పుకుంటేనే కిందికి దిగి వస్తానని డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అతను ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కిందికి దిగమని తన బాయ్ ఫ్రెండ్ ఎంత బతిమిలాడినా ఆమె దిగకపోవడంతో పోలీసులు కలుగజేసుకొని మీ పెద్ద వారితో మాట్లాడుతాము కిందికి దిగమని సూచించడంతో ఆమె కిందికి దిగింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన సదరు నెటిజన్లు పిల్లలను సరైన క్రమశిక్షణలో పెరగకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కామెంట్ చేస్తున్నారు.