Tag Archives: gopichand malineni

Vijay Thalapathy: టాలీవుడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో విజయ్… ఈసారి హిట్ గ్యారెంటీ?

Vijay Thalapathy: ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో ఇతర భాష హీరోలు కూడా తెలుగు చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇతర భాష హీరోలు నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యేవి.అయితే ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో ఇతర భాష హీరోలు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇదివరకే పలువురు హీరోలు తెలుగు దర్శకులు తెలుగు నిర్మాణ సంస్థలలో చిత్రాలు నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ సైతం వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

ఇలా వారసుడు సినిమా ద్వారా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ మరో టాలీవుడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.క్రాక్ వీరసింహారెడ్డి వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నట్లు సమాచారం.

Vijay Thalapathy: గోపీచంద్ డైరెక్షన్ లో విజయ్…


ఇప్పటికే గోపీచంద్ మలినేని హీరో విజయ్ ని కలిసి తనకు సినిమా కథ వినిపించగా ఈ స్క్రిప్ నచ్చడంతో వెంటనే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారని సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఇక గోపీచంద్ డైరెక్షన్ అంటే విజయ్ ఈ సినిమాతో తెలుగులో హిట్ కొట్టడం గ్యారెంటీ అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Gopichand Malineni: అప్పుల బాధతో ఆస్తులన్నీ అమ్మేశాము… గోపీచంద్ కష్టాలు మామూలుగా లేవు!

Gopichand Malineni: చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నారు. క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ మల్లినేని అనంతరం బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేశారు.

ఈ సినిమా కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్, నిర్మాత ,హాని రోజ్ వరలక్ష్మి శరత్ కుమార్ వంటి తదితరులు పాల్గొన్నారు.

ఇలా బాలకృష్ణ చిత్రం బృందంతో సరదాగా ముచ్చటిస్తూ ఎన్నో సినిమా విశేషాలను పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య రవితేజకు ఫోన్ చేసి ధమాకా సక్సెస్ తెలియజేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి తనదైన శైలిలో మాట్లాడుతూ ఆట పట్టించారు. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ ఈయన పలు విషయాలను బయటపెట్టారు.

Gopichand Malineni: ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్న గోపీచంద్…


గోపి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్రాక్ సినిమాకి ముందు ఏడాదిన్నర పాటు చాలా కష్టాలు పడ్డావట ఆస్తులు కూడా అమ్మేశావట ఆ సమయంలో ఏమనిపించింది అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ స్పందిస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అదే సమయంలోనే నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనని ఓదార్చారు. మరి క్రాక్ సినిమాకి ముందు ఏం జరిగింది? ఎందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.

బాలయ్యతో వద్దు బాబోయ్.. షాకిచ్చిన శృతిహాసన్!

బాలయ్య బాబు సినిమా అంటే నటించడానికి చాలామంది హీరోయిన్స్ ధైర్యం చేసి ముందుకు రారు. ఈ క్రమంలోని బాలయ్య సినిమాలలో హీరోయిన్స్ వెతకాలంటే దర్శకనిర్మాతలకు కత్తిమీద సాము వంటిదని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన నటించడం కోసం శృతి హాసన్ ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య సరసన అనగానే శృతిహాసన్ మొదట్లో నో చెప్పినట్లు తెలుస్తోంది. కానీ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో శృతి హాసన్ నటించబోతోందని తాజా సమాచారం.

గోపీచంద్ దర్శకత్వంలో శృతిహాసన్, రవితేజ హీరోగా తెరకెక్కిన “బలుపు” సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు శృతి హాసన్ ని సంప్రదించడంతో ఈ సినిమాలో నటించడం కోసం ఒప్పుకోక తప్పలేదు. అయితే ఈసినిమాలో లీడ్ పెయిర్ గా కాకుండా, మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ సీనియర్ హీరో కావడం చేత ఆయన పక్కన నటించడానికి ఈ తరం హీరోయిన్లు కాస్త వెనుకడుగు వేస్తారు. అది కాకుండా శృతి హాసన్ ప్రస్తుతం “సలార్” సినిమాతో బిజీగా ఉండటం చేత ఈ సినిమాకి మొదట్లో నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపిచంద్ బాలకృష్ణ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న “అఖండ” సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ గోపీచంద్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

బాలయ్య కోసం యాక్షన్ కథను రెడీ చేసిన డైరెక్టర్..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాలో నటిస్తున్నారు. మొట్టమొదటిసారిగా బాలకృష్ణ అఖండ సినిమాలో త్వీపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ అఖండ సినిమా తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

గోపీచంద్ మలినేని దర్శకత్వం తర్వాత బాలయ్య కోసం అనిల్ రావిపూడి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరొక దర్శకుడు వెంకీ అట్లూరి సైతం బాలయ్య కోసం ఒక కథను సిద్ధం చేసి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రేమ కథలనే తెరకెక్కించిన దర్శకుడు అట్లూరి వెంకీ మొట్టమొదటిసారిగా బాలయ్య బాబుతో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇందుకోసమే ఓ కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కే ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో బోయపాటి సినిమా తర్వాత బాలయ్య ఎవరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచిచూడాలి. అయితే ఈ నెల 10వ తేదీన బాలయ్యబాబు పుట్టినరోజు కావడంతో ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని దర్శకుడు తెలియజేయనునట్లు తెలుస్తోంది.

బోయపాటి అఖండ సినిమా విషయానికొస్తే ఇదివరకు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన లెజెండ్, సింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.కరోనా ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్రబృందం తెలియజేశారు.

ఆ డైరెక్టర్ కోసం సీనియర్ హీరోకి ఓకే చెప్పిన శృతిహాసన్..!!

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.ముఖ్యంగా మన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలకు హీరోయిన్ ని వెతకడం అనేది డైరెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. నిజం చెప్పాలంటే బాలయ్య సినిమా కోసం డైరెక్టర్లు ఎప్పుడూ అరడజను మంది స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతారు. అదేంటో చివరికీ వాళ్లల్లో ఒక్క హీరోయిన్ కూడా బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకోదు, ఒప్పుకున్నా ఏవరేజ్ హీరోయిన్ కూడా భారీగా రెమ్యూనరేషన్ అడుగుతుంది.

దాంతో ఆ హీరోయిన్ ను నిర్మాత ఒప్పుకోడు.చివరకు బాలయ్య చిన్నాచితకా హీరోయిన్లే దిక్కు అవుతున్నారు. అందుకే, ఈ సారి బాలయ్య కాస్త తెలివిగా ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా తరువాత, గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ఫిక్స్ అయ్యాడు. మంచి హీరోయిన్ ను బుక్ చేయండి అని బాలయ్య, ఇప్పటికే డైరెక్టర్ తో చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి తన పక్కన ఏ హీరోయిన్ నటిస్తోంది అని బాలయ్య పెద్దగా పట్టించుకోడు,అయితే, తన మిత్రులలో ఒకతను ‘మీ పక్కన ఏ స్టార్ హీరోయిన్ యాక్ట్ చేయదా ?’ అంటూ ప్రశ్నించాడట.

దాంతో బాలయ్యకి ఇగో హర్ట్ అయింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తన తరువాత సినిమాలో స్టార్ హీరోయినే ఉండాలని పట్టుబట్టాడు. అందుకే శృతి హాసన్ ను బాలకృష్ణ సరసన నటించేలా చేయడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని తన తెలివిని ఉపయోగించి, శృతి హాసన్ ను ఒప్పించాడని తెలుస్తోంది. గోపీచంద్ ‘క్రాక్’ సినిమాతో శృతి హాసన్ కి మంచి హిట్ ఇచ్చాడు.దాంతో, శృతి హాసన్ కి, గోపీచంద్ మలినేని కోసం సమైనా బాలకృష్ణ సరసన నటించక తప్పడం లేదట.

బాలయ్య పక్కన హీరోయిన్ గా చేయడం ఇష్టం లేకపోయినా… మొత్తానికి శృతి హాసన్, డైరెక్టర్ కోసం ఒప్పుకుంది. అయితే, బాలయ్య సరసన శృతి హాసన్ నటించాక ఆమెకు ఇక ‘సీనియర్ హీరోయిన్’ అనే ముద్ర పడటం ఖాయం.ఆ తర్వాత ఇక ఏ యంగ్ హీరో సరసన ఆమెకు అవకాశాలు రావు. అయినా 35 ఏళ్ల శృతి హాసన్ కి ఏ యంగ్ హీరో మాత్రం ఛాన్స్ ఇస్తాడు.మరి ఈ సినిమా తర్వాత శ్రుతిహాసన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి…!!