Tag Archives: health issues

Actor Ponnambalam: సొంత తమ్ముడే స్లో పాయిజన్ ఇచ్చాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ విలన్!

Actor Ponnambalam: తమిళ సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తన విలనిజంతో అందరిని భయపెట్టినటువంటి వారిలో నటుడు పొన్నంబలం ఒకరు. అయితే పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గత కొద్ది రోజుల క్రితం కిడ్నీలు పాడవడంతో చెన్నైలోనే ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఒక కిడ్నీ పూర్తిగా పాడవడంతో తన సమీప బంధువు తనకు కిడ్నీ దానం చేయడంతో ఫిబ్రవరి 10వ తేదీన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలుస్తోంది. ఇలా ఇంటికి వెళ్ళగానే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అనారోగ్య సమస్యల గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా నటుడు పొన్నంబలం మాట్లాడుతూ అందరూ నేను మద్యం సేవించడం మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం పాడై ఆస్పత్రి పాలయ్యానని భావిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఈయన తెలియజేశారు. కానీ తనపై విష ప్రయోగం జరిగింది అంటూ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Ponnambalam:మద్యం వల్ల ఆరోగ్యం పాడవలేదు..

తన తండ్రికి నలుగురు భార్యలని తన తండ్రి మూడవ భార్య కుమారుడు తన వద్ద మేనేజర్ గా పని చేస్తున్నారని తెలిపారు. అయితే తన తమ్ముడే తనకు స్లో పాయిజన్ ఇస్తూ వచ్చాడని ఆ విషయం తనకు తెలియదని తెలిపారు.ఇలా తను స్లో పాయిజన్ ఇవ్వడం వల్లే తన కిడ్నీల ఆరోగ్యం పాడయ్యాయని అంతకుమించి తనకు ఉన్నటువంటి అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పాడవలేదని ఈయన తెలిపారు.ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైన సిరివెన్నెల సీతారామశాస్త్రి..!

తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కి తీవ్ర అస్వస్థతకు చేయడంతో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నఫలంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు కిమ్స్ కి తరలించారు.

ప్రస్తుతం ఆయనకు కిమ్స్ వైద్యులు వైద్యం అందిస్తున్నారు.అయితే అతని ఉన్నఫలంగా ఎందుకు అనారోగ్యం చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలు రాసి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నపళంగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే అతనికి ఏం జరిగింది.. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన అభిమానులు అతను తొందరగా కోలుకుని తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అయితే పూర్తి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.

బ్రేకింగ్ న్యూస్: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో వందల చిత్రాల్లో విభిన్న పాత్రలో అద్భుతమైన నటన ద్వారా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ ఒకరు. ఇండస్ట్రీలో బహుశా ఈయన వెయ్యని పాత్ర అంటూ ఉండదేమో.ఎన్నో విభిన్న పాత్రల్లో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కైకాల సత్యనారాయణ గత నాలుగు రోజుల క్రితం ఇంటిలో కాలుజారి కిందపడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలోని ఇంట్లోనే ఉన్న కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అతనిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే కైకాల ఆస్పత్రి పాలయ్యారన్న వార్త తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు.

ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య విషయంపై కైకాల కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటికే కన్నడ సినీ నటుడు పునీత్ మరణం నుంచి కోలుకోలేని అభిమానులకు కైకాల ఆసుపత్రి పాలయ్యారన్న విషయం తెలియడంతో ఆందోళన చెందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

వంటింటి చిట్కాలతో షుగర్ లెవల్స్ ను ఇలా కంట్రోల్ చేసుకోండి..

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. అటువంటి వ్యాధి ఉన్నవారికి షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ లో ఉండవు. దాని ద్వారా కూడా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే వాటిని అదుపులో ఉంచడానికి.. ఇంకా ఇతర వ్యాధులు రాకుండా ఉండటానికి వంటింటి చిట్కాలతో సాధ్యం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. క్రమం తప్పకుండా కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా వంటింట్లో కూరల్లో ఉపయోగించి పసుపులో ఎన్నో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. పసుపులోని కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చు. మరో వంటింటి చిట్కా ఏంటంటే.. మెంతి గింజలు. దీనిని కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే.. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. అంతేకాకుండా దీనిలో కార్బోహైడ్రేట్లను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

తద్వారా ఇది చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కడుపు సమస్యలను చాలా వరకు తగ్గించుటకు దాల్చినచెక్క ఎంతో సహాయపడుతుంది. దీనిని ఉబ్బరం, మలబద్ధకం మరియు వికారం నివారణ కోసం ఉపయోగిస్తారు. కడుపు పూతల నివారణకు మరియు ఆకలిని మెరుగుపరచడంలో కూడా దాల్చినచెక్క కూడా సహాయపడుతుంది. ఇది కూడా చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తులసి గింజలు కూడా ఆరోగ్య కారకాలే. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్నాయి.

డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లు ప్రతిరోజు తమ ఆహారంలో తులసి ఆకులను భాగంగా చేసుకుంటే బ్లడ్ లోని షుగర్ లేవల్స్ ను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్లలో ఇన్సులిన్ గ్రంథి ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా తులసి ఆకులు చేస్తాయి. దీంతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా పైన చెప్పిన వంటింటి చిట్కాలను వాడి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చిు.

ఎక్కువగా కూర్చుంటున్నారా.. అయితే మీకు ఈ సమస్య గ్యారెంటీ!

ప్రస్తుత కాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తీసుకునే ఆహార పదార్థాలలోనే కాకుండా మన శరీరాన్ని ఉంచుకునే విధానంలో కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారికే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే నిత్యం కూర్చోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని. నిత్యం ఆఫీసులలో, ఇంట్లో కూర్చోవడం వల్ల అనేక శారీరక సమస్యలు రావడంతో వాటివల్ల మెదడు పని చేసే శక్తి కూడా సక్రమంగా ఉండదు. దీనివల్ల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇక గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో కూర్చొని తెగ పనులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా నిత్యం కంప్యూటర్లు, ఫోన్ లో ముందు కూర్చొని సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ఇక వీటి నుండి తప్పించుకోవడానికి.. కంప్యూటర్ల ముందు పనిచేసే వారికి ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే అందులో కొన్ని నియమాలను పాటించాలి.

ముందుగా ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్లు మధ్యలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనశ్శాంతి ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక భోజనం చేసిన తర్వాత రెండు గంటలకు మళ్ళీ గ్రీన్ టీ తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 2 లేదా 3 కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండాలి. స్నాక్స్ లో భాగంగా పాప్ కాన్ లాంటివి తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ముఖ్యమైనది. ఎక్కువగా సి విటమిన్ లో ఉండే పండ్లను తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు డార్క్ చాక్లెట్ లను తింటూ ఉండాలి. దీనివల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గుండెకి వచ్చే సమస్యలు కూడా దరికి చేరవు.

‘షుగర్ డిటాక్స్‌’తో.. ఎన్నో వ్యాధులు మాయం!

చక్కెరను అవరసం అయిన దాని కంటే ఎక్కువగా తీసుకుంటే ఎన్నో అనర్థాలు వస్తాయి. అయితే శరీరంలోని చక్కెరను తొలగించడానికి అనేక పద్దతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా షుగర్ డిటాక్స్. ఈ షుగర్ డిటాక్స్ వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే శరీరంలో పేర్కొని ఉన్న షుగర్ ను తగ్గిస్తుంది.

తీపి పదార్థాలు తినాలనే కోరికలను అణచివేసేందుకు.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కనీసం వారం నుంచి ఒక నెల పాటు చక్కెర పదార్థాలను తినకుండా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. షుగర్ డిటాక్స్ ఎలా చేయాలంటే.. తినే ఆహారంలో చక్కెర పదర్దాలు లేకుండా చూసుకోవాలి.

స్వీట్లకు, కేక్ లకు దూరంగా ఉండాలి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు చక్కెర స్థాయిలు పెరిగితే వస్తాయి. షుగర్ డిటాక్స్ కనీసం ఒకటి నుంచి రెండు వారాల వరకు ప్రయత్నించాలి. షుగర్ డిటాక్స్ పూర్తయిన తరువాత.. తినే ఆహారంలో సహజ చక్కెర అంటే పండ్లు, కూరగాయలను స్వల్ప మొత్తంలో తీసుకుంటుండాలి. షుగర్ ను నియంత్రించడమే షుగర్ డిటాక్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవాలి.

షుగర్ పదర్థాలు తినడం ఒక్కసారే మానేయకుండా.. ప్రతీ రోజు నెమ్మదిగా మొదలుపెట్టండి. రోజు తీసుకునే చెక్కర పదార్థాల స్థాయిని క్రమంగా తగ్గించండి. డీహైడ్రేషన్ చక్కెర కోరికలను తీవ్రతరం చేస్తుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగేలా చూసుకోండి. సహజ చక్కెరలు ఉన్న పండ్లను తీసుకుంటే చాలా మంచింది.

ఉదయం అల్పాహారంగా వీటిని తినడం.. అయితే జాగ్రత్త..!

మనలో చాలా మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అయితే ఉదయం అల్పాహారం సమయంలో ఏదైనా ఒక పండును తీసుకుని మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు.కానీ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఆ పండ్లను పరగడుపున తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారానికి బదులుగా పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇక్కడ తెలుసుకుందాం…

ఉదయం ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అరటి పండును తీసుకోవడం వల్ల వాంతులు అయ్యే సూచనలు ఉంటాయి.అదేవిధంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను పరిగడుపున తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్యలు ఏర్పడతాయి. సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా మన జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది.మనం ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్లను మాత్రమే తీసుకున్నప్పుడు మన జీర్ణాశయంలో సిట్రస్ జాతి పండ్లు నుంచి విడుదలయ్యే యాసిడ్, జీర్ణాశయం విడుదలచేసే యాసిడ్ మోతాదు ఎక్కువ అవ్వడం వల్ల అసిడిటీ సమస్య ఏర్పడుతుంది.

ఉదయం అల్పాహారంలో పండ్లను సలాడ్ రూపంలో కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా సలాడ్లు తాగిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదయం ఎన్ని పనులు ఉన్నప్పటికీ అల్పాహారం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో షుగర్ లెవెల్స్, రక్తపోటు స్థాయిలు హెచ్చుతగ్గులు అవటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.