ప్రస్తుత కాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తీసుకునే ఆహార పదార్థాలలోనే కాకుండా మన శరీరాన్ని ఉంచుకునే విధానంలో కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారికే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే నిత్యం కూర్చోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని. నిత్యం ఆఫీసులలో, ఇంట్లో కూర్చోవడం వల్ల అనేక శారీరక సమస్యలు రావడంతో వాటివల్ల మెదడు పని చేసే శక్తి కూడా సక్రమంగా ఉండదు. దీనివల్ల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇక గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో కూర్చొని తెగ పనులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా నిత్యం కంప్యూటర్లు, ఫోన్ లో ముందు కూర్చొని సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ఇక వీటి నుండి తప్పించుకోవడానికి.. కంప్యూటర్ల ముందు పనిచేసే వారికి ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే అందులో కొన్ని నియమాలను పాటించాలి.
ముందుగా ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్లు మధ్యలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనశ్శాంతి ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక భోజనం చేసిన తర్వాత రెండు గంటలకు మళ్ళీ గ్రీన్ టీ తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 2 లేదా 3 కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండాలి. స్నాక్స్ లో భాగంగా పాప్ కాన్ లాంటివి తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ముఖ్యమైనది. ఎక్కువగా సి విటమిన్ లో ఉండే పండ్లను తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు డార్క్ చాక్లెట్ లను తింటూ ఉండాలి. దీనివల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గుండెకి వచ్చే సమస్యలు కూడా దరికి చేరవు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…