Tag Archives: husband

Shriya Saran: మరోసారి కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ శరణ్.. హాట్ ఫొటోలు వైరల్..!

Shriya Saran: శ్రియా శరణ్ ఫిలిం ఇండస్ట్రీకు పరిచయం అక్కర లేని పేరు. తన గ్లామర్ తో నటనలో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ట, వెంకటేష్ వంటి అగ్ర తారలతో నటించింది.

Shriya Saran: మరోసారి కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ శరణ్.. హాట్ ఫొటోలు వైరల్..!

మరోవైపు తరుణ్, మహేష్, ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ వంటి యంగ్ జనరేషన్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి మెప్పించింది. రెండు దశాబ్ధాలుగా వెండితెరపై వెలిగిపోయింది. అయితే తాజాగా సినిమా ఆఫర్లు తగ్గినా.. ఏదో ఒక విషయంలో ట్రెండింగ్ లో ఉంటోంది శ్రీయ.

Shriya Saran: మరోసారి కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ శరణ్.. హాట్ ఫొటోలు వైరల్..!

2018లో రష్యా దేశస్థుడు ఆండ్రూ కొశ్చివ్ ని పెళ్లాడింది. తన భర్తతో ఉన్న ఫోటోలను తరుచూ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది శ్రియ. తాజాగా మరోసారి భర్తతో ఘాటుగా లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలను మళ్లీ సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో పాటు వైట్ బికినీతో సమ్మింగ్ ఫూల్ లో ఉన్న ఫోటో షేర్ చేసింది.

ఆర్ఆర్ఆర్ సినిమా.. కీలక పాత్రలో శ్రీయ..

ఈ ఫోటోలకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. వయసు నలబైకి దగ్గర పడుతున్నా.. శ్రియలో అందం తగ్గలేదని అనుకుంటున్నారు నెటిజెన్లు. ఇటీవల ‘గమనం’ సినిమాలో నటించిన శ్రియ. తన యాక్టింగ్ తో అందర్ని మెప్పించింది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ భార్యగా శ్రియ కనబడబోతోంది. అయితే ప్రస్తుతం శ్రియకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది.

Megastar-Keerthi Suresh: బోళాశంకర్ లో కీర్తి సురేష్ కు భర్తగా యవ హీరో.. ఎవరో తెలుసా..?

Megastar-Keerthi Suresh: మెగాస్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీ చేస్తున్నారు. చిరంజీవికి జతగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. రామ్ చరన్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Megastar-Keerthi Suresh: బోళాశంకర్ లో కీర్తి సురేష్ కు భర్తగా యవ హీరో.. ఎవరో తెలుసా..?

దీంతో పాటు మళయాళంలో మోహన్ లాల్ చేసిన ’లూసిఫర్‘ మూవీని గాడ్ ఫాదర్ గా రిమేక్ చేస్తున్నారు. మరోవైపు మెహర్ రమేష్ డైరెక్షన్ లో ’బోళాశంకర్‘ సినిమా చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించారు చిరు. అయితే కుర్రహీరోలకు పోటీగా మెగాస్టార్ వరసగా సినిమాలు చేస్తుండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

Megastar-Keerthi Suresh: బోళాశంకర్ లో కీర్తి సురేష్ కు భర్తగా యవ హీరో.. ఎవరో తెలుసా..?

తాజాగా బోళాశంకర్ మూవీలో చిరంజీవి చెల్లెలుగా ముద్దగుమ్మ కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే మహానటితో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఏకంగా చిరంజీవికి చెల్లెలు గా నటిస్తోంది.


చిరంజీవికి చెల్లిలుగా.. నాగ శౌర్యకు భార్యగా కీర్తి సురేష్..

తమిళంలో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలకు చెల్లిలి పాత్రల్లో కనిపిస్తోంది. సూపర్ స్టార్ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్న సినిమాలో రజినికాంత్ కు చెల్లిలిగా కనిపించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి చెల్లిలిగా బోళా శంకర్ లో కనిపించనుంది. బోళా శంకర్ మూవీ కూడా రిమేక్ చిత్రమే. తమిళంలో అజిత్ చేసిన వేదాళంకు రిమేక్. అయితే ఈసినిమా నుంచి ఓ కొత్త అప్డెట్ వచ్చింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కు భర్తగా యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈవిషయంపై చిత్ర యూనిట్ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

భర్తతో కలిసి మందు తాగుతున్న కాజల్..! షాక్ అవుతున్న నెటిజన్లు..!

ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించే వారిలో సినీ నటులు, క్రిడాకారులే ఎక్కువగా ఉంటారు. సినిమాల్లో నటించే వారికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, గ్లామర్ ఉండటంతో  తమ ఉత్పత్తులు వేగంగా జనాలకు వెళ్లుతాయని కంపెనీల అభిప్రాయం. ఇటు సినిమాలతో కోట్లు సంపాదిస్తూనే… యాడ్స్ ద్వారా మరింత సంపాదిస్తున్నారు.

గతంలో హీరోయిన్లు ఎక్కవగా బ్యూటీ ప్రోడక్ట్ లు, షాపింగ్ మాల్స్, జ్యూవలరీ ఐటెంలకు మాత్రమే యాడ్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం కాలం మారింది. కాలంలో పాటు హీరోయిన్లు మారుతున్నారు. యాడ్స్ తీరు మారింది. గతంలో రకుల్ ప్రీతిసింగ్, పూజా హెగ్డే,  రెజీనా కసాండ్రా వంటి గ్లామర్ డాల్స్ ఏకంగా మద్యం బాటిళ్లను మందు పెట్టుకుని వాటి ప్రమోషన్లలో పాల్గొన్నారు.

ఈ యాడ్స్ పై ప్రజల్లో ఎక్కువగా విమర్శల పాలయ్యారు ఈ భామలు. ఇలాంటి యాడ్స్ ఇచ్చి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ విమర్శించారు ప్రజలు. మరోసారి ఇలాంటి యాడ్ లోనే నటిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్. భర్తతో కలిసి ఓ మద్యం బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ మందును ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన భర్తతో మందు బాటిల్ ముందు పెట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.

అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ.. మన పార్ట్న ర్స్ సాయంత్రం ఇలా పెగ్గు కలుపుతూ మన పక్కనే ఉంటే వీకెండ్ అలా గడిచి పోతుంది కదా అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. అయితే ఈ మద్యం కేవలం 25 ఏళ్లు నిండినవారే తాగాలని చెప్పుకుంటు వచ్చింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజెన్లు ఆగ్రహానికి గురవుతున్నారు. సినిమాల్లో సంపాదించి చాలదా…? ఇప్పుడు ఇలాంటి వాటిని ప్రమోట్ చేసి యువతను పక్కదారి పట్టిస్తున్నావా..అంటూ కామెంట్లు చేశారు.

పబ్లిక్ లోనే రచ్చ చేసిన శ్రియ రొమాన్స్.. భర్త పెదాలకు ముద్దు పెడుతూ..!

శ్రియసరన్ భారతీయ సినీరంగంలో పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. రెండు దశాబ్ధాలుగా దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలతో పాటు, బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది. ఇష్టం సినిమాతో 2001లో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయిన ఈ భామ ఇప్పటికీ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణ, వెంకటేష్ వంటి అగ్రనటులతోనే కాకుండా మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి కుర్ర హీరోలతో సినిమాలు చేసింది.

తమిళంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ శివాజీ సినిమాలో కూడా నటించింది. వైవిధ్యకరమైన క్యారెక్టర్లు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. తాజగా గమనం సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఫర్ఫామెన్స్ తో అందరిని మెప్పించింది. రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో అజయ్ దేవ్ గన్ కు సరసన నటించింది.

చాలా మందికి యువకులకు కలల రాకుమారిగా ఉన్న శ్రీయ రష్యా దేశస్థుడు ఆండ్రీ కొశ్చివ్ ను పెళ్లి చేసుకుంది. గతేడాది కరోనా సమయంలో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. రాధ అనే పేరు కూడా పెట్టింది. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే శ్రియ ఇటీవల చాలా హాట్ లిప్ లాక్స్ ఇస్తోంది.

తన  భర్త ఆండ్రీతో పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తోంది. హాట్ లిప్ లాక్స్ ఇస్తూ కాకపుట్టిస్తోంది.  శ్రియ, ఆండ్రీలు ముద్దు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జీ తెలుగు కుటుంబ అవార్డు ఫంక్షన్లో శ్రియాకి ఆమె భర్త లిప్ లాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తాజాగా ఫోటోలకు ఫోజ్ ఇస్తూ భర్త ఆండ్రీకి మరో సారి లిక్ లాక్ ఇచ్చింది శ్రేయ.

బలవంతపు శృంగారం చేస్తున్న భర్త.. మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఎక్కడంటే..?

భార్యభర్తల మధ్య మనస్పర్థలు అనేవి సర్వసాధారణం. అయితే వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకొని.. సంసార జీవితాన్ని నడపాలి.. కానీ.. పది మందిలోకి ఈ వ్యవహారం వెళ్ల కూడదు. ఒక వేళ వెళ్లినా మరోసారి ఈ వ్యవహరం రిపీట్ కాకుండా ఉంటే కుటుంబంలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోవు.

కొందరు క్షణికావేశంలో ప్రాణాలు తీయడమో.. ప్రాణాలు తీసుకోవడమో జరుగుతోంది. ఇలాంటి ఘటనల వల్ల వాళ్లపై ఆధారపడిన కటుంబసభ్యులు అనాథలుగా మారుతున్నారు. ఇక్కడ చెప్పే దంపతుల విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్ లోని టికంగఢ్ జిల్లాకు చెందిన వీళ్లు.. రామ్ నగర్ లో నివాసం ఉంటుంన్నారు.

వారిద్దరికి వివాహం అయిన చాలా సంవత్సరాలు అయింది. మొదట్లో వీరిద్దరు బాగానే ఉన్నా.. రాను రాను మనస్పర్థలు ఎక్కువ అయ్యాయి. దీంతో వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి గొడవ పెద్ద పనుషుల దాకా వెళ్లింది. ఇద్దరు కలిసి ఉండాలని.. బలవంతపు కాపురం చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో భార్యతో అతడు బలవంతంగా కాపురం చేస్తున్న క్రమంలో భార్య కత్తి తీసుకొని అతడి మర్మాంగాన్ని కోసేసింది. అక్కడిక్కడే అతడు గిల గిల కొట్టుకుంటూ కిందపడిపోయాడు. ఆ ఘటనా స్థలం వద్ద తీవ్ర రక్తస్రావం అయింది. ఇరుగుపొరుగు వాళ్లు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఓ వైపు భర్తతో కాపురం చేసి.. మరో వైపు ప్రియుడితో రాసలీలు సాగించింది.. చివరకు ఏమైందంటే..?

ఇద్దరు పిల్లల తల్లి… 22 ఏళ్ల కాపురం.. అయినా సంతోషకరమైన జీవితాన్ని వదిలి తనకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయిందో మహిళ. ఆ మహిళ కోసం అటు భర్త, ఇటు ప్రియుడు నాకంటే నాకంటూ కొట్టుకుంటున్న ఘటన హైదరాబాద్, హన్మకొండ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే హన్మకొండ టీచర్స్ కాలనీలో ఉంటున్న లంకా శశికాంత్ (42), భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యవతి(35) భార్య భర్తలు. వీరిద్దరికి ఒక కుమారుడు(16), కుమార్తె (13) ఉన్నారు.

శశికాంత్ కు, దుర్గా సుశీలకు 1999లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పిన సుశీల ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని ఆమె ఉడాయించింది.  భార్య కోసం చాలా చోట్ల వెతికినా ఆమె జాడ కనిపించలేదు. చివరకు ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యప్రసాద్ తో వెళ్లిపోయిందని తెలిసింది.

భార్య బంగారం, నగలుతో పారిపోయిందని స్థానిక సుబేదారి పోలీస్ స్టేషన్ లో శశికాంత్ ఫిర్యాదు చేశారు. అయితే వీరిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిచారు. కాగా తనకు పెళ్లి కాలేదని.. శశికాంత్ తన  భర్త కాదని, అక్క చనిపోతే చుట్టం చూపుగా వచ్చానని.. ఈ పిల్లలు నాకు పుట్టలేదని సమాధానం ఇచ్చింది సుశీల. అయితే పోలీసులు విచారణ జరపగా.. దుర్గా సుశీల, శశికాంత్ భార్యే అని తేలింది.

ఇదిలా ఉంటే ప్రియుడు సత్యప్రసాద్ తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్ లో కాపురం పెట్టి.. సహ జీవనం చేయసాగారు. కాగా ఈనెల తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో సుశీలను, సత్య వరప్రసాద్ పెళ్లి చేసుకోవడం కొసమెరుపు. ఈ క్రమంలో మళ్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త. తన పిల్లలకు తల్లి ప్రేమ కావాలని.. నా భార్యను నాకు అప్పగించండి అని వేడుకున్నాడు. కాగా ఇదిలా ఉంటే రెండో భర్త సత్య వర ప్రసాద్ తన భార్య సుశీల కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య మూడు నెలల గర్భవతి అని.. కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల కోసం వెతుకుతున్నారు.

ఎప్పుడూ అదే పని అంటూ నిహారిక గుట్టు బయట పెట్టిన.. భర్త చైతన్య!

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి బార్సిలోనాలో వెకేషన్‌లో ఉంది. పెళ్లై ఏడాది అవబోతోన్న సందర్భంగా ఇలా వెకేషన్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత నిహారిక ఓ సక్సెస్ ను అందుకుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యహరించి.. మంచి విజయాన్ని అందుకున్నారు. దీనిపై మెగస్టార్ కూడా స్పందిస్తూ.. కంగ్రాట్స్ చెప్పిన విషయం తెలిసిందే.

అలా ఈ చిన్న ఫ్యామిలీ స్టోర్ పెద్ద హిట్ అయింది. ఆ ఆనందంలో తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి ఫారెన్ టూర్‌కు వెళ్లింది నిహారిక. అక్కడ కూడా నిహారిక సోషల్ మీడియా అప్డేట్స్ చూస్తూ ఫోన్ లోనే మొహం పెట్టి మునిగిపోవటంపై భర్త చైతన్య సెటైర్ వేశాడు. నిహారిక ఫోన్ చూస్తూ కూర్చున్న ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. నిహారిక ఎప్పుడూ ఫోన్‌లోనే బిజీగా ఉంటుందని, ఫోటోలను షేర్ చేశాడు.

తర్వాత మళ్లీ కొంచెం సమయం ఆగాడు.. తర్వాత మళ్లీ ఆమె అదే పనిలో ఉంది. ఆ ఫోటోను కూడా అతడు షేర్ చేస్తూ.. ఎప్పుడూ అదే పని అంటూ.. ప్రేక్షకులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి వీళ్లిద్దరు వెకేషన్లో మస్తు ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక నిహారిక కెరీర్ ఆరంభంలో యాంకర్‌గా.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటింది. తర్వాత హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సరిస్ తీసి హిట్ కొట్టేసింది. ఆమె సినిమాల్లో నటించనని.. అది తన భర్తకు ఇష్టం లేదని చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే.

వివాహితతో ఎస్సై రాసలీలలు.. ఆ సమయంలో వారిద్దరు మునిగితేలుతుండగా ఎంట్రీ ఇచ్చిన భర్త..!

వివాహేతర సంబంధాలు ఎంత దూరం దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్షణికావేశంలో ఏమైనా చేస్తుంటారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబపెద్ద దిక్కు లేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా..మంచి చెప్పాల్సిన పోలీసులే ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే ఇక వాళ్లు చెప్పే మాటలు సామాన్య ప్రజలు వింటారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది.

తాజాగా జరిగిన ఘటనలో ఓ వివాహితతో స్థానిక ఎస్సై వివాహాతేర సంబంధం సాగించాడు. దీంతో ఓ రోజు అతడిని ఆమె భర్త రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నషేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

అతడు ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ.. భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలు కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె భర్త స్థానికులు, స్నేహితుల సహాయంతో తెలుసుకున్నాడు. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. అలా అతడు బయటకు వెళ్తున్నట్లు చెప్పి.. పక్కే సమీపంలో కాపు కాశాడు. దీంతో ఆ మహిళ అనుకున్నట్లుగానే ఎస్సైకి ఫోన్ చేసి.. ఇంటికి రప్పించింది.

ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐని కాపాడి వనపర్తి దవాఖానకు తరలించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎస్సై షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

రాజీవ్ కనకాల కాళ్లపై పడిన సుమ.. కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం తెలుగులో నంబర్ యాంకర్ ఎవరంటే టక్కున గుర్తుకువచ్చే పేరు సుమ. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమెది కేరళ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగులో ఎన్నో ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె ఎంతలా తెలుగు నేర్చుకున్నారో. బహుషా తెలుగు మదర్ టంగ్ అయిన వాళ్లు కూడా ఆమెతో పోటీ పడలేరేమో.. అలా ఉంటుంది ఆమె తెలుగు భాష.

అయితే కొన్ని రోజుల క్రితం రాజీవ్ కనకాల, సుమ విడిపోయారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒకానొక సందర్భంలో వాళ్లు క్లారిటీ కూడా ఇచ్చారు. మా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని.. అది కాస్త మీడియాకు వెళ్లడంతో వాళ్లు విడపోయారంటూ మీడియా కోడై కూసింది.

పిల్లల్ని విదేశాలకు పంపించి సుమ వేరే ప్లాట్ ఉటుందని.. ఏవేవో కథలు అల్లారు. దానికి తాగాజా ఫుల్ స్టాప్ పెట్టేశారు సుమ అండ్ రాజీవ్. రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వాళ్లంతా కలిసి ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ వీడియోను తన ఇన్స్‌స్టా ఖాతాలో షేర్ చేసిన సుమ.. భర్తకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఒకరికి ఒకరు కేక్ తినిపించుకున్నారు.

కేక్ కట్ చేసిన అనంతరం తమ ఇంట్లోనే ఉన్న ఓ వ్యక్తి సుమకు ఆర్డర్ వేశాడు. కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకో అని కాస్త గట్టిగానే అన్నాడు. దీంతో సుమ వెంటనే రాజీవ్ కనకాల కాళ్లకు నమస్కారం చేసింది. అయితే ఈ దృశ్యం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏదేమైనా ఈ వీడియోతో పుకార్లు స్పష్టించే వాళ్ల నోర్లు మూయించింది సుమ. ఇక సుమ త్వరలో వెండితెరపై ‘జయమ్మ పంచాయితీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దారుణం: భర్తను చంపి జైలుకెళ్లి లొంగిపోయిన భార్య.. ఎక్కడంటే?

ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య ఏ చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా అవి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని చివరికి బిడ్డను ఒంటరి పాలు చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా గత కొంత కాలం నుంచి మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరగగా తొమ్మిది సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 11 సంవత్సరాల నుంచి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు.

అయితే గత కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలోనూ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇలా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆవేశంలో మౌనిక వంటగదిలో కూరగాయలు కట్ చేసే కత్తితో తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ క్రమంలోని తన భర్త పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన మౌనిక తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని తనని అరెస్ట్ చేశారు.