Tag Archives: indian railways

రైల్వే టికెట్ కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..

దాదాపు చాలామంది రైల్వే ప్రయాణం చేసే ఉంటారు. అయితే రైళ్లల్లో ప్రయాణించడానికి మాత్రమే టికెట్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. రైల్వే టికెట్ తీసుకునే క్రమంలో టికెట్ ధర కన్నా మనం 45 పైసలు అదనంగా చెల్లిస్తాం.

ఆఫ్ లైన్ లో తీసుకుంటే అది మనకు కనిపించదు. ఇంటర్ నల్ గా ఉంటుంది. కానీ మనం ఆన్ లైన్ రైలు టికెట్ బుక్ చేస్తే మాత్రం మనకు అది తెలుస్తుంది. టికెట్ బుక్ చేసే సమయంలో ఇన్సురెన్స్ తీసుకుంటారా అంటూ అడుగుతుంది. దానిని క్లిక్ చేయడమే మంచింది. ఎందుకంటే.. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇన్సురెన్స్ క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మనిషి చనిపోతే రూ.10 లక్షలు, అంగవైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షలు వస్తాయి. చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రిలో చేరితే ఖర్చులకు రూ.2లక్షల వరకు క్లయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాదు ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. క్లాక్ రూమ్ సౌకర్యం, రెస్ట్ రూమ్, లాకర్ ఫెసిలిటీ వంటి సదుపాయాలు కూడా పొందవచ్చు.

ప్రతి ఒక్క రైల్వే ప్రయాణికుడికి ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ టికెట్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఒక వేళ మనం జర్నీ చేసే సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురయితే.. టీటీఈని అడిగి పస్ట్ ఎయిడ్ కిట్ ను కూడా తీసుకోవచ్చు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. టికెట్ అంటే కేవలం ప్రయాణానికి మాత్రమే అనుకుంటారు. దీని వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మరి.

టీటీఈ అవతారమెత్తిన దొంగ.. చివరికి అలా పట్టుబడ్డాడు?

రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఎవరి సామాన్లకు వారే బాద్యులు అంటూ ప్రకటనలు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని బరేలీ రైల్వే స్టేషన్ లో ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఆ స్టేషన్ లోనే టిఫిన్ చేసేందుకు పక్కనే ఉన్న నల్లా వద్ద చేతులు కడుక్కోవడానికి వెళ్లాడు.

తన వద్ద ఉన్న బ్యాగ్ ను పక్కన ఉన్న ఓ టేబుల్ వద్ద ఉంచాడు. చేతులు శుభ్రం చేసుకొని వచ్చే సరికి అతడి బ్యాగ్ మాయం అయిపోయింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు. ఆ బ్యాగ్‌లో తన యూనీఫామ్, చలాన్ల బుక్ ఉన్నాయి అని ఆ టీటీఈ చెప్పాడు. అవి తనకు ఎంతో ఉపయోగం అంటూ పోలీసుల ఎదుట వాపోయాడు. రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అనుకున్నట్లుగానే ఆ బ్యాగ్ ను ఓ దొంగ పిల్లిలాగా వచ్చి దొంగిలించాడు.

అతడు ధరించిన డ్రస్ కలర్ ఆధారంగా అతడు ఎటు వైపు వెళ్లాడో ఆ సీసీ కెమెరాలను చెక్ చేశారు. చివరకు అతడు రైలు ఎక్కి వెళ్లిపోయినట్లు సీసీటీవీలో కనపడింది. ఆ రైలు ఎక్కడికి వెళ్తుంది అనేది కనుకున్నారు. అది హౌరా-అమృత్‌సర్ పంజాబ్ మెయిల్ ట్రైన్ ఎక్కాడు. అతడి పేరు గోవింద్ సింగ్. రైల్లో ఆ నల్లకోటు ధరించి టికెట్ అడుగుతూ.. టికెట్ లేని ప్రయాణికుల్ని బెదిరిస్తూ డబ్బు లాక్కుంటున్నాడు. ఆ పనిలో ఉండగా ఆ రైల్లో ఉండే మరో టీటీఈ ఎదురయ్యాడు.

ఎందుకు నా పని నువ్వు చేస్తున్నావు.. నీవు ఎవరు అంటూ నిలదీశాడు. దీంతో అతడు ఆ బోగీ నుంచి మరో భోగీకి పారిపోయడు. చివరకు అతన్ని బిజ్నోర్‌లోని నిజామాబాద్ స్టేషన్‌లో పట్టుకున్నారు. తిరిగి ఆ యూనీఫామ్‌ని TTE జస్వంత్ సింగ్‌కి బ్యాగ్‌తో సహా ఇచ్చారు. రియల్ టీటీఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.

పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

పశ్చిమ మధ్య రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 716 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగాల భర్తీ కొరకు పలు నోటిఫికేషన్లు విడుదల కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://wcr.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 716 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 135, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 102, వెల్డర్ (ఎలక్ట్రిక్ & గ్యాస్) ఉద్యోగ ఖాళీలు 43, పెయింటర్ (జనరల్) ఉద్యోగ ఖాళీలు 75, మెసన్ ఉద్యోగ ఖాళీలు 61, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 73, ప్లంబర్ 58, బ్లాక్ స్మిత్ ఉద్యోగ ఖాళీలు 63, వైర్ మెన్ 50, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 10, మెషినిస్ట్ 5, టర్నర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్ మేన్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.

2021 సంవత్సరం ఏప్రిల్‌ 1 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

పదో తరగతి, ఐటీఐ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశంలోకి ప్రైవేట్ రైళ్లు..?

రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది. ఎకనమిక్ సర్వే ద్వారా దేశంలోకి ప్రైవేట్ రైళ్లు రావడానికి రంగం సిద్ధమైందని వెల్లడైంది. ఈ ఏడాది మే చివరి వరకు ప్రైవేట్ రైళ్ల కొరకు బిడ్స్ ఆహ్వానం జరుగుతుందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది.

2023 – 2024 నాటికి దేశంలోకి ప్రైవేట్ రైళ్లు రావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వేలో పేదలను పేదరికం నుంచి బయటపడేయటానికి ఆర్థిక వృద్ధిని కొనసాగించాలని అభిప్రాయపడింది. కరోనా విజృంభణ అనేక రంగాలపై ప్రభావం చూపిందని అయితే వ్యవసాయ రంగంపై మాత్రం కరోనా ప్రభావం పడలేదని వెల్లడైంది. వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదైందని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం తగ్గే అవకాశం ఉందని.. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం జీడీపీ 11 శాతం పెరగవచ్చని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెలీ మెడిసిన్ పై ఇన్వెస్ట్ చేసి డిజిటల్ హెల్త్ మిషన్ కు కృషి చేయాలని ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే ప్రీ కోవిడ్ స్థాయికి చేరవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.

ప్రైవేట్ రైళ్ల దిశగా కేంద్రం అడుగులు వేయడంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో నిర్ణయాలు కేంద్రం అమలు చేయనుందని తెలుస్తోంది

రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేసే ఛాన్స్.. వారికి మాత్రమే..?

విద్యార్థులకు, నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచితంగా లేదా రాయితీతో రైలు ప్రయాణాలు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. రైల్వే వెబ్‌సైట్‌లో రైల్వే శాఖ ఉచిత ప్రయాణం, రాయితీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. విద్యార్థులు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను సంప్రదించి ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తరగతి, ప్రయాణం చేసే ఊర్లను బట్టి ఉచిత ప్రయాణం ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 75 శాతం వరకు టికెట్లపై రాయితీ పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎడ్యుకేషన్ టూర్ల కొరకు లేదా సొంత ఊర్లకు ప్రయాణం చేయడానికి విద్యార్థులు 75 శాతం డిస్కౌంట్ పొందవచ్చని సమాచారం.

జనరల్ కేటగిరీ విద్యార్థులు మాత్రం క్వార్టరీ సీజన్, నెలవరీ సీజన్ టికెట్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ లకు 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చని తెలుస్తోంది. బాలురు ఇంటర్ సెకండియర్ వరకు, బాలికలు డిగ్రీ చదివే వరకు నెలవారీ సీజన్ టికెట్ ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు స్టడీ టూర్ కొరకు ఒకసారి 75 శాతం టికెట్లపై రాయితీని పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

మెడికల్, ఇంజనీరింగ్ జాతీయ స్థాయి పరీక్షలను రాసే విద్యార్థులు సైతం సెకండ్ క్లాస్ టికెట్ కొనుగోలుపై 75 శాతం వరకు రాయితీని పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం టికెట్ రేటుపై రాయితీని పొందవచ్చు. ఈ వివరాలపై అవగాహన ఉంటే రైలు ప్రయాణాలు చేసే వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా కొత్త సర్వీసులు..?

రైల్వే శాఖ భారతదేశంలోని రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తరచూ రైలు ప్రయాణాలు చేసే వాళ్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైలోఫీ అనే సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ సర్వీసుల వల్ల రైలు ప్రయాణికులు రియల్ ట్రైమ్ పీఎన్ఆర్ స్టేటస్ ను తెలుసుకోవడంతో పాటు రైలు ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసులను పొందే అవకాశం ఉండటంతో కస్టమర్లు సులువుగా ప్రయాణించే రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ తో పీఎన్ఆర్ స్టేటస్, అప్‌కమింగ్ రైల్వే స్టేషన్, ప్రీవియస్ రైల్వే స్టేషన్, లైవ్ ట్రైన్ స్టేటస్ తో పాటు ఇతర సమాచారాన్ని కూడా సులువుగా పొందవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్‌ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందడంతో పాటు రైలు ఆలస్యమయ్యేలా ఉంటే ఆ వివరాలు కూడా తెలుస్తాయి.

రైలోఫీ తెచ్చిన ఈ సర్వీసుల వల్ల రైలు ప్రయాణికులకు భారీగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. అయితే ఈ సర్వీసులు పొందాలంటే వాట్సాప్ కస్టమర్లు ఖచ్చితంగా యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. +91 – 9881193322 ఫోన్ నంబర్ ను మొబైల్ లో సేవ్ చేసుకుంటే ఈ సర్వీసులను సులభంగా పొందవచ్చు. నంబర్ ను సేవ్ చేసుకున్న తరువాత పీఎన్ఆర్ నెంబర్‌ ను ఎంటర్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది.

ఆ తరువాత వాట్సాప్ నంబర్ కు ఎప్పటికప్పుడు రైలు సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలు సందేశాల రూపంలో వస్తూ ఉంటాయి. ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసే వాళ్లు ఈ సర్వీసులను వినియోదించడం వల్ల రైలు ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని చెప్పవచ్చు.