Tag Archives: intresting comments

Manchu Manoj: డబ్బులు తీసుకొని వారికి ఓటు వేయద్దు.. వారికి మాత్రమే వేయండి: మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి మంచు మనోజ్ తాజాగా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటు ఎవరికి వేయాలనే విషయం గురించి మనోజ్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి మీరు ఓటు వేసే నాయకుడు అందరితో కలిసి ముందుకు వెళుతున్నాడా? దారుణాలకు పాల్పడుతున్నారా అనే విషయాలను గుర్తు పెట్టుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

మనం ఎన్నుకొని నాయకుడు ఎప్పుడు కూడా మనకు అండగా నిలబడాలి పేదలకు సహాయం చేయాలి అందరితో పాటు కలిసి ముందుకు వెళ్లాలి ఇలాంటి వారికే ఓటు వేయాలి. అయితే డబ్బులు ఇచ్చారని దారుణాలకు పాల్పడుతున్నటువంటి వారికి మాత్రం ఓటు వేయద్దు. ఎవరైతే రాష్ట్రాన్ని సురక్షితంగా పరిపాలిస్తారో అలాంటి వారికే ఓటు వేయాలంటూ ఈయన పిలుపు ఇచ్చారు.

అందరితో కలసి ముందుకు వెళ్తున్నారా..
ఈ విధంగా మనోజ్ ఓటు హక్కు వినియోగించుకోవడం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అనే విషయాలు మాత్రం తెలియడం లేదు తన తండ్రి గతంలో వైసిపి పార్టీకి మద్దతు తెలిపారు .కానీ ఇప్పుడు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడుని కలవడంతో ఈయన టిడిపికే మద్దతు తెలుపుతున్నారంటూ కూడా పలువురు భావిస్తున్నారు.

Madhavan: నా కొడుకు వేరే హీరోలా కొడుకులు మాదిరి కాదు.. మాకు అది ఇష్టం లేదు: మాధవన్

Madhavan: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తుకు పొందినటువంటి వారిలో మాధవన్ ఒకరు. ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే హీరోగా ప్రేక్షకులను మెప్పించారు అయితే ఇటీవల కాలంలో మాధవన్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక మాధవన్ కుమారుడు వేదాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సాధారణంగా తల్లిదండ్రులు ఏ రంగంలో కొనసాగుతున్నారో పిల్లలను కూడా అదే రంగంలోకి పంపించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ మాధవన్ హీరో అయినప్పటికీ తన కుమారుడు మాత్రం అథ్లెటిక్ గా మారిపోయారు. వేదాంత్ కి స్విమ్మింగ్ లో ఇప్పటికే ఎన్నో నేషనల్ స్థాయిలో పథకాలు వచ్చాయి. ఇలా స్విమ్మింగ్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేదాంత్ పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా తన కుమారుడి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై మాధవన్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నా కుమారుడు గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. నేను స్టార్ హీరో కాబట్టి తన కొడుకుకి స్విమ్మింగ్లో మెడల్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. నేను స్టార్ హీరో కాదు కేవలం ఒక హీరో మాత్రమే ఆయన తను ఇండస్ట్రీలో కాకుండా వేరే రంగంలో విజయం సాధిస్తున్నారని గుర్తు చేశారు.

వేరే వారితో పోల్చద్దు…
అలాగే వేదాంత్ ను ఇతర హీరోల కొడుకులతో పోల్చి కామెంట్స్ చేస్తున్నారు. మాకు మా అబ్బాయిని వేరే వారితో పోల్చడం ఏమాత్రం ఇష్టం లేదని దయచేసి మా గురించి ఇలాంటి వార్తలు రాసేవారు మా బాధలను అర్థం చేసుకోవాలి అంటూ ఈ సందర్భంగా మాధవన్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashmika: పుష్ప భార్యగా నాపై బాధ్యత పెరిగింది.. రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పుష్ప 2 గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా చిత్ర బృందంతో కలిసి తాను కలిసి షూటింగ్లో పాల్గొనడం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారుని రోజులు నేను పుష్ప రాజ్ ప్రేయసిగా మాత్రమే ఉన్నాను అయితే ఇప్పుడు మాత్రం పుష్ప భార్య. అది చాలా బాధ్యతలతో నిండి ఉన్న పాత్ర. సీక్వెల్ లో చాలా ఎక్కువ డ్రామా, పాత్రల సంఘర్షణలు ఉన్నాయి. అలాగే ఈ లో ఎక్కువగా మసాలా ఉంటుందని తెలిపారు.

భార్యగా నాపై బాధ్యతలు పెరిగాయి…
డైరెక్టర్ సుకుమార్ వంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. పుష్ప 2 పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయని అయితే ఆ అంచనాలను ఈ సినిమా చేరుకుంటుంది అంటూ ఈ సందర్భంగా రష్మిక పుష్ప సీక్వెల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

సమంతది నిజమైన ప్రేమ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా కోడలు!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారంతో ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా నిలిచింది. ఈ విడాకుల వ్యవహారంలో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, సమంతల స్నేహం గురించి అందరికి తెలిసిందే. సమంతకు ఎంతో మందికి తెలిసిన వారు ఉన్నప్పటికీ సన్నిహితుల కొంతమంది మాత్రమే ఉన్నారు.

అలాంటి వారిలో ఉపాసన కూడా ఒకరు. వీరిద్దరూ ఫిట్నెస్, ఆరోగ్యం,మహిళా శక్తి వంటి ఎన్నో విషయాలలో కలిసి పనిచేశారు. వీరిద్దరి పక్కన పెట్టి చూస్తే ఆలోచనలు కూడా ఒకే విధంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే ఉపాసన, సమంతకు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే గతంలో ఉపాసన సొంత వెబ్ సైట్ అయిన యువర్ లైఫ్ కో ఇన్ కు సమంత గెస్ట్ ఎడిటర్ గా కూడా వ్యవహరించింది.

ఇటీవలె ఉపాసన ఒక ఇంటర్వ్యూ సమంత గురించి పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది. తాను తెలంగాణలో పుట్టిన అమ్మాయినని. దసరా లాంటి పండుగల సమయంలో మాంసం తినడం తనకు కూడా చాలా ఇష్టం అని ఆమె తెలిపింది.సమంత ఆర్టికల్ ఎడిట్ చేసిన తర్వాత మాంసం చాలావరకు తగ్గించినట్లు తెలిపారు.

సమంతలో సహాయం చేసే గుణం ఉందని తెలిపింది.అంతేకాకుండా సమంత తనకు ఎన్నో విషయాలలో అండగా నిలిచిందని ఉపాసన చెప్పుకొచ్చింది. సమంత అది నిజమైన ప్రేమ అని ఉపాసన తెలిపింది. ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత విషయానికి వస్తే విడాకుల తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమె తన స్నేహితులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటోంది. తన సినిమాల విషయంఫై కూడా బాగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక తెరపై సందడి చేయలేను సంచలన వ్యాఖ్యలు చేసిన నటి చార్మి..!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో నటి చార్మి ఒకరు. ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ తెరవెనుక బాధ్యతలను చేపట్టారు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలను చేపట్టారు. ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా చిత్రాల నిర్మిస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాలలో హీరోయిన్ గా నటించాలంటే కేవలం ఫిట్ నెస్ పై దృష్టి పెడితే చాలని, అదే నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.

నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క బాధ్యత మనపై ఉంటుంది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుందని ఈమె తెలిపారు. బాధ్యతలు చేపట్టాలని అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది ఈమె తెలిపారు. అయితే తనకు నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఈమె తెలిపారు.

తను ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తున్నాయనీ, అయితే తనకు నటించాలనే కోరికలేదని ఇకపై తాను నటించనని, ఇకపై ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతానని ఈ సందర్భంగా ఛార్మి తెలియజేశారు.

ఆ సినిమాతో కొన్ని కోట్లు నష్టపోయా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్..

మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడిగా.. జయభేరి గ్రూపు అధిపతిగా.. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుంచి గెలిచి ఎన్నో మైలురాళ్లు దాటాడు. తాజాగా అతడు ఓ యూట్యూబ్ చానల్ ఇటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

అవేంటంటే.. మొదటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక బలంగా అతడతికి ఉండేదట. తన తండ్రి పాలిటిక్స్ లో ఉండటంతో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో వర్కింగ్ పార్టనర్ గా వర్క్ చేసేందుకు ఆఫర్ రాగా.. నెలకు రూ.100 జీతం.. లాభాల్లో వాటా కూడా ఇచ్చినట్లు చెప్పాడు. అదే కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పాడు. అందులోనే 10 ఏళ్ల చేసినట్లు చెప్పాడు. అందులో దాదాపు 50 శాతం షేర్ కూడా తెచ్చుకున్నాడట. హీరోగా అతడికి ఆఫర్ రాగా.. వెళ్లినట్లు చెప్పాడు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసినట్లు చెప్పాడు.

తర్వాత రెండో సినిమాకు సంవత్సరం వెయిట్ చేశానని.. తర్వాత దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో చేసిన తర్వాత మంచి గుర్తింపు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తర్వాత దాసరి సినిమాల్లోనే ఎక్కువగా నటించినట్లు పేర్కొన్నాడు. ఈ మధ్యలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరించినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఒక సినిమా హిట్ అయితే అందరూ ఆనందాలను పంచుకుంటారు.. ఒక వేళ ఫెయిల్ అయితే మాత్రం నిర్మాతమీదనే ఎక్కువగా తోసేస్తున్నట్లు చెప్పాడు.

మణిరత్నం సినిమా అయిన ‘ఇద్దరు’ సినిమాలో కరుణానిధి,  ఎంజీఆర్ కు సంబంధించిన సినిమా అని.. అందులో కరుణానిధి క్యారెక్టర్ ను నెగెటివ్ గా.. ఎంజీఆర్ క్యారెక్టర్ ను పాజిటివ్ గా తీశారు. అందులో తమిళనాడులో కరుణానిధి అధికారంలోకి రావడంతో.. ఆ సినిమాలో చాలాసీన్లు కట్ చేసినట్లు చెప్పాడు. దీంతో ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయిందని.. అప్పటి వరకు సంపాదించిన సంపద అంతా పోయిందని చెప్పాడు మురళిమోహన్.

కోటా శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇచ్చి.. తాగి గొడవ చేస్తే ఎమ్మెస్ నారాయణను లాగిపెట్టి కొట్టాను: దర్శకుడు సాగర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చార్మినార్, అన్వేషణ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో డైరెక్టర్ సాగర్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు హలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఒక సినిమా షూటింగ్ జరిగే సమయంలో దర్శకుడికి కోట శ్రీనివాసరావుకు మధ్య మనస్పర్థలు తలెత్తాయటగా ఎందుకు అనే ప్రశ్న ఎదురవడంతో అందుకు దర్శకుడు సమాధానం చెబుతూ.. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం భరణి, మహేష్ ఆనంద్, కోట ముగ్గురిపై ఆ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. ఇక వీరి ఇచ్చిన తేదీ ప్రకారం సెట్లో అందరూ సిద్ధంగా ఉన్నారు.

కానీ కోట శ్రీనివాసరావు ఆ రోజు షూటింగ్ కి రాలేనని తనకు బాగా కావాల్సిన వాళ్ళు మరణించారని చెప్పడంతో ఆ రోజు షూటింగ్ వాయిదా వేసుకున్నాను అదేవిధంగా తనకు ఎప్పుడు కుదురుతుందో కనుక్కొని అదే తేదీన షూటింగ్ ఖరారు చేసాము. అయితే ఆరోజు కూడా కోట షూటింగుకు రాకపోవడంతో ఏంటిదని ఫోన్ చేయగా నేనురాలేనని సమాధానం చెప్పాడు. కోట ఆ మాట అనడంతో ఎంతో కోపం వచ్చిందని నువ్వు చెప్పిన తేదీకి షూటింగ్ ప్లాన్ చేసిన రాకపోవడం ఏంటి నాలో ఉన్న మరొక యాంగిల్ ను చూడకు వచ్చి సెటిల్ చేయండి అని చెప్పడంతో ఆ తర్వాత కోట రావడం ఆ సినిమా షూటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇలా ఇద్దరికీ అభిప్రాయభేదాలు వచ్చాయని తెలిపారు.

అదేవిధంగా ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎమ్.ఎస్.నారాయణ పై చేయి కూడా చేసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ తెలియజేశారు. అందరూ కూర్చుని మాట్లాడుతున్న సమయంలో ఎం.ఎస్.నారాయణ తాగి నిర్మాతలను బూతులు తిట్టడంతో లాగి చెంపపై ఒకటి కొట్టానని అలా ఎందుకు మాట్లాడావ్.. మాట్లాడటం తప్పు కదా.. అంటూ ఎమ్మెస్ నారాయణ పై చేయి చేసుకున్న విషయాన్ని కూడా ఇంటర్వ్యూ సందర్భంగా దర్శకుడు తెలియజేశారు.

బిగ్ బాస్ అయినా… ఎవడైనా ధమ్ ధమ్ చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బోల్డ్ బ్యూటీ..!

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు నిర్వాహకులు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లను ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ వారితో ముచ్చటించి వారిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపించారు.

ఈ విధంగా బిగ్ బాస్ వేదికపైకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది 7 ఆర్ట్స్ సరయు. యూట్యూబ్ ద్వారా పలు సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈమె పచ్చి బూతులు మాట్లాడుతూ బాగా పాపులర్ అయ్యారు. ఈమెను బోల్డ్ బ్యూటీతో పాటు బూతుల బ్యూటీ అని కూడా పిలుస్తుంటారు. బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ బిగ్ బాస్ వేదికపై కూడా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ విధంగా బిగ్ బాస్ వేదికపైకి అడుగుపెట్టిన ఈమె తన మాటలతో నాగార్జునను ఎంతో ఇంప్రెస్ చేశారు. ఈ క్రమంలోనే సరయూతో మాట్లాడుతూ నాగార్జున కొన్ని పదాలు చెప్పి వాటిని తన స్టైల్ లో చెప్పమని సరయుకి చెప్పారు. నాగార్జున చెప్పిన మాటలకు సై అంటూ మింగకు, మింగేయ్ రా, కథలుపడకూ అంటూ తన స్టైల్లో చెప్పి అందరిని సందడి చేసింది.

అదేవిధంగా బిగ్ బాస్ అయినా, ఎవరైనా సరే ధమ్ ధమ్ చేస్తా అంటూ ఈ బ్యూటీ రెచ్చిపోయింది. ఈ వేదికపై సరయూ మాట్లాడుతూ చిన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియో అంటూ తన తల్లి అన్నపూర్ణ స్టూడియోని చూపించడంతో ఎలాగైనా ఇందులోకి అడుగు పెట్టాలన్న కసితో, గట్టిగా నిర్ణయం తీసుకున్నానని, అందువల్లే ఇక్కడ ఈ వేదికపై మీ ముందు ఉన్నానంటూ నాగార్జున గారితో సరదాగా ముచ్చటిస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో పచ్చి బూతులు మాట్లాడుతూ బాగా గుర్తింపు సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ హౌస్ లో మరి ఎలాంటి రచ్చ చేస్తారో వేచి చూడాల్సిందే.