Tag Archives: living together

Siddharth -Aditi Rao: సహజీవనం చేస్తున్న నటుడు సిద్దార్థ్ అదితి రావ్.. మరి పెళ్లి సంగతేంటి..?

Siddharth -Aditi Rao: బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బాయ్స్ వంటి సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొంది ఎంతోమంది యువతకు అభిమాన హీరోగా నిలిచాడు సిద్దార్థ్. ఆ తర్వాత సిద్ధార్థ నటించిన సినిమాలు సరైన హిట్ అందుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో మఖాం వేశాడు. అయితే అక్కడ కూడా సరైన హిట్లు లేక చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.

దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహాసముద్రం సినిమా ద్వారా సిద్ధార్థ హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలి నిర్మాతలకు నష్టాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా ద్వారా నిర్మాతలు నష్టపోయిన కూడా సిద్ధార్థ మాత్రం బాగా లాభపడ్డాడు. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ 8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోవడమే కాకుండా ఇక హీరోయిన్ అదితి రావుతో కూడా మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.

ఆ తర్వాత వీరిద్దరూ కూడ రిలేషన్ లో ఉన్నారని, అంతేకాకుండా సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాకుండా ఇటీవల హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇలా కపుల్స్ లాగా వీరిద్దరూ శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి హాజరు కావడంతో వీరిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి నిజమే కానీ పెళ్ళికి మాత్రం నో చెబుతున్నట్లు తెలుస్తోంది.

Siddharth -Aditi Rao: పెళ్లికి నో అంటున్న సిద్ధార్థ అదితి..

ఎందుకంటే గతంలో కూడా వీరిద్దరికీ వివాహం అయ్యి విడాకులకు కూడా తీసుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి వివాహం చేసుకొని ఆలోచన లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరూ ఎంత కాలం ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తారో చూడాలి మరి.ఇలా వీరి రిలేషన్ గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలపై ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

యువకుడితో వివాహేతర సంబంధం.. చివరకు ఆసుపత్రిలో బాధిత మహిళ.. ఏం జరిగిందంటే..

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పాటు తన కూతురును కాపాడండి అంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. కృష్ణాజిల్లా విజయవాడలోని న్యూరాజరాజేశ్వరి పేటకు చెందిన మహిళ ఓ బ్యాంక్ లో పనిచేస్తోంది.

ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్లకు ఒక పాప కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆమె తన భర్తను వదిలేసి పాపతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే తను ఉంటున్న ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు అఖిల్ తో పరిచయం ఏర్పడింది. అతడు ఆమె కంటే చాలా చిన్న వాడు.

ఆమెను ప్రేమిస్తున్నానంటూ.. నమ్మించి అన్ని రకాలుగా వాడుకున్నాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాట మార్చాడు. తీరా ఆమె మోసపోయినట్లు గ్రహించి ఆత్మహత్య చేసుకోవాని నిర్ణయం తీసుకుంది. దీని కంటే ముందు తన 13 నెలల కుమార్తెను కాపాడాలంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. తర్వాత ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనే భావించి ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఆ మెసేజ్ కు స్పందించిన పోలీసులు 10 నిమిషాల్లోనే బాధిత మహిళ ఉంటున్న ఇంటికి చేరుకొని ఆమెను రక్షించి.. చిన్నారిని వారి బంధువులకు అప్పగించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.