Tag Archives: mahalakshmi

Mahalakshmi: అర్ధరాత్రి భర్త చేసిన పనికి షాక్ లో మహాలక్ష్మి… అదృష్టం అంటూ పోస్ట్?

Mahalakshmi: మహాలక్ష్మి పరిచయం అవసరం లేని పేరు కోలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్ చేసినటువంటి ఈమె సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా సినిమాలలో నటించే సమయంలోనే నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇలా మూడు సంవత్సరాల క్రితం వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు..

ఇకపోతే వీరిద్దరూ కూడా రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక రవీందర్ కాస్త అధిక బరువు ఉండటంతో తన డబ్బు చూసే మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నట్టు వీరిద్దరి పట్ల ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చాయి కానీ వాటన్నింటిని తిప్పి కొడితే వీరు ఎప్పటికప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.

ఇకపోతే తాజాగా మహాలక్ష్మి తన భర్త గురించి సోషల్ మీడియా వేదిక షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల మహాలక్ష్మి పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి కేక్ తో తనని మేల్కొల్పి సర్ప్రైజ్ చేశారు అంటూ తన భర్త గురించి ఈమె తెలియజేసారు. ఇలా అర్థరాత్రి కేక్ కట్ చేయించి తన భర్త పుట్టిన రోజు వేడుకలను జరిపించారని ఈమె సంబరం వ్యక్తం చేశారు.

పుట్టినరోజు వేడుకలు..
ఇలాంటి ఓ గొప్ప వ్యక్తి భర్తగా రావటం నా అదృష్టమని ఈమె సంతోషపడ్డారు. అంతేకాకుండా తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లి తన సోదరుడు మానసిక వికలాంగుల ఆశ్రమానికి తీసుకువెళ్లి వారందరికీ భోజనాలు పెట్టించడం తనని ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఇక బాంగ్లాదేశ్ లో ఉన్నటువంటి తన తండ్రి కూడా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజును మరింత వేడుకగా చేశారంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/C4xc_T6PTGx/?utm_source=ig_embed&ig_rid=d604febd-c3e4-4c97-b2f7-59f832542921

Mahalakshmi: మహాలక్ష్మి రవీందర్ తల్లిదండ్రులు కాబోతున్నారా…. వైరల్ అవుతున్న ఫోటో?

Mahalakshmi: కోలీవుడ్ నిర్మాత లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడైతే వీరి వివాహం జరిగిందో ఒక్కసారిగా సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు. అధిక శరీర కాయం కలిగినటువంటి రవీందర్ ను మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి కేవలం డబ్బు కోసం మాత్రమే ఆయనను పెళ్లి చేసుకుంది అంటూ ఆయనని ట్రోల్ చేశారు.

ఇలా తనని బాడీ షేమింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.ఇలా వీరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తూ సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు. ఇకపోతే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.

గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఇలా వివాహం తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ డిన్నర్ కి వెళ్ళగా అందుకు సంబంధించిన ఫోటోలను రవీందర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

నువ్వు నాకోసమే జీవించావు..

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసినటువంటి ఎంతో మంది అభిమానులు మహాలక్ష్మి తల్లి కాబోతుందా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మహాలక్ష్మి ఈ ఫోటోలలో కాస్త బొద్దుగా కనిపించడమే కాకుండా బేబీ బంప్ లాగా తన పొట్ట ఉండడంతో చాలామంది ఆమె తల్లి కాబోతోందా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ఐ లవ్ యు చెప్పడంలోనే నా సంతోషం లేదు నేను చెప్పకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ రవీందర్ క్యాప్షన్ జోడించారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Ravinder Chandrashekhar: భార్య చేసిన వంటను షేర్ చేసిన రవీందర్.. నా జీవితంలో చూడలేదు అంటూ కామెంట్స్!

Ravinder Chandrashekhar: కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీందర్,టీవీనటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్ అయ్యారు. అధిక శరీర ఖాయం ఉన్నటువంటి రవీందర్ నుమహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నట్టు వీరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే వీటి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ దంపతులు తమ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే తాజాగా ప్రొడ్యూసర్ రవీందర్ తన భార్య మహాలక్ష్మి చేసిన వంటను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తాను తన జీవితంలో ఇలాంటి వంటలు ఎప్పుడు చూడలేదు అంటూ చమత్కారం చేశారు.

రవీందర్ ఉడకబెట్టిన కోడిగుడ్ల ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలా ఉడకపెట్టిన గుడ్డు పగలడం నా జీవితంలో చూడలేదు నేను సన్నబడటం తప్ప మరో మార్గం లేదని మహాలక్ష్మి రాసుకొచ్చింది. ఇలా మాడిపోయిన గుడ్లను షేర్ చేస్తూ న్యూ లైఫ్ మై వైఫ్ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం రవీందర్ షేర్ చేసిన మాడిపోయిన కోడిగుడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ravinder Chandrashekhar: సంతోషంగా కొత్త జీవితం గడుపుతున్న రవీందర్ దంపతులు..

ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజెన్లు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరి పెళ్లి గురించి ఎన్నో ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా రవీందర్ తన భార్య మహాలక్ష్మికి ఖరీదైన కూడా బహుమానంగా ఇచ్చారు.

Actress Jaya Shree: మహాలక్ష్మి నా భర్తతో ఎఫైర్ పెట్టుకుంది.. అందుకే తన భర్త విడాకులు ఇచ్చారు.. నటి షాకింగ్ కామెంట్స్?

Actress Jaya Shree: తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ఇలా అధిక శరీర ఖాయం ఉన్నటువంటి రవీందర్ ను మహాలక్ష్మి ఆస్తి చూసి మాత్రమే పెళ్లి చేసుకుందని పెద్ద ఎత్తున ఈమె పెళ్లిపై ఎంతోమంది ట్రోల్ చేశారు.

ఈ విధంగా రవీందర్ ను పెళ్లి చేసుకునే సమయానికి మహాలక్ష్మికి పెళ్లి జరిగి ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం ఈమె నిర్మాత రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం వీరి గురించి ఎంతోమంది ఎన్నో ట్రోలింగ్స్ చేసినప్పటికీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా తమిళ నటి జయశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నటి మహాలక్ష్మి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటి మహాలక్ష్మి అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారని తెలిపారు. అయితే ఈమె మరొక నటుడు ఈశ్వర్ రఘునాథ్ అనే నటుడితో ఎఫైర్ పెట్టుకుంది అంటూ ఈశ్వర్ భార్య జయశ్రీ మహాలక్ష్మి పట్ల సంచలనం వ్యాఖ్యలు చేశారు.


Actress Jaya Shree: నటుడితో ఎఫైర్ పెట్టుకున్న మహాలక్ష్మి…

ఈ విధంగా తన భర్తతో మహాలక్ష్మికి ఎఫైర్ ఉండటంవల్లే అనిల్ తనకు విడాకులు ఇచ్చారంటూ ఈమె గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా వీరిద్దరి వ్యవహారం వల్ల తన భర్తకు తనకు మనస్పర్ధలు వచ్చాయంటూ జయ శ్రీ వెల్లడించారు. ఈ విషయం గురించి ఒకానొక సమయంలో ఈశ్వర్ తనపై చేయి చేసుకున్నాడని, ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వర్ ను అరెస్టు చేశారంటూ జయశ్రీ మహాలక్ష్మి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

Ravinder -Mahalakshmi: బిగ్ బాస్ లోకి వెళ్లనున్న మహాలక్ష్మి రవీందర్.. వైరల్ అవుతున్న న్యూస్?

Ravinder -Mahalakshmi: ఇటీవల కాలంలో ట్రెండింగ్ కపుల్స్ గా మహాలక్ష్మి రవీందర్ జంట బాగా పాపులర్ అయింది.వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ కాయంతో ఉన్నటువంటి రవీందర్ ను నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ జంట సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.

తాజాగా ఈ జంట హనీమూన్ కోసం అమెరికా వెళ్లి తిరిగి వచ్చారు. వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ జంటకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తమిళంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారం అవుతుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి రవీంద్ర ఇద్దరు పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

మొదటి సీజన్ నుంచి రవీందర్ బిగ్ బాస్ కార్యక్రమాలను వీక్షిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే ఈ సీజన్లో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు వీరిద్దరి పేర్లను పరిశీలించారని వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Ravinder -Mahalakshmi: బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా న్యూ కపుల్స్..

మరి నిజంగానే వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారా లేకపోతే రవీంద్ర మాత్రమే పాల్గొనబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అక్టోబర్ 9వ తేదీ వరకు వేసి చూడాలి. ఇక వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడంతో వీరి పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది.ఇలా ఈ జంట పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున వీరిపై విమర్శలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఆ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఉన్నారు.

Producer Ravinder: భార్యకు భారీ బంగారం కొనిచ్చిన నిర్మాత రవీందర్.. అమ్మడి కోరిక తీరిందంటూ కామెంట్ చేస్తున్న నేటిజన్స్!

Producer Ravindar: గత కొద్ది రోజులుగా కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ నటి మహాలక్ష్మి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో వీరి పెళ్లిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అధిక శరీర బరువు ఉన్నటువంటి రవీందర్ ను కుందనపు బొమ్మలా ఉన్నటువంటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేశారు.

ఇలా రవీందర్ ను మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నది కేవలం డబ్బు కోసమే అంటూ పెద్ద ఎత్తున చాలామంది ఈమెను తప్పుపట్టారు.ఇలా తమ పెళ్లి గురించి వార్తలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన రవీందర్ తను డబ్బు మనిషి కాదని నా మనసు చూసి తను నన్ను పెళ్లి చేసుకుంది అంటూ ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇక వివాహం తర్వాత ఈ జంట హనీమూన్ కి వెళ్ళగా హనీమూన్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవీందర్ తన భార్య మహాలక్ష్మికి భారీగా బంగారం కొనిచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈయన మహాలక్ష్మికి ఏకంగా బంగారు పూత పూసిన మంచంతో పాటు కేజిన్నర బంగారు నగలను కూడా కొనిచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Producer Ravindar: అప్పుడే భారీగా ఖర్చులు పెట్టిస్తున్న మహాలక్ష్మి..

ఈ విధంగా వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజెన్లు ఎట్టకేలకు నటి మహాలక్ష్మి కోరుకున్నదే జరుగుతుంది ఆమె కేవలం అతని డబ్బు చూసే తనని పెళ్లి చేస్తుందని తనపై ఎలాంటి ప్రేమలు లేవంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఇలా పెళ్లయిందో లేదో అప్పుడే అతని చేత భారీగా బంగారు నగలు కొనిపెట్టించుకుంది మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై మరికొందరు స్పందిస్తూ భార్యకు బంగారు కొని ఇవ్వడంలో తప్పేముంది అంటూ సమర్పిస్తున్నారు. మొత్తానికి ఈమెకు బంగారం కొనిచ్చిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Mahalakshmi: నిర్మాతను పెళ్ళాడిన సీరియల్ నటి వైరల్ అవుతున్న ఫోటోలు?

Mahalakshmi: ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వివాహ బంధంతో ఒకటయ్యారు ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రేమలో ఉన్నటువంటి జంటలు పెళ్లి బంధంతో ఒక్కటై వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.. అలాగే మరి కొంతమంది కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి చెందిన మరొక జంట కూడా పెళ్లి పీటలు ఎక్కారు.

అయితే ఈ జంటకు ఇది మొదటి పెళ్లి కాదు రెండో పెళ్లి. ప్రముఖ ని రెండవ వివాహం చేసుకున్నారు.వీరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇకపోతే నటి మహా లక్ష్మికి కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.

ఇదివరకే ఈ జంట పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని మనస్పర్ధలు కారణంగా వారి జీవిత భాగస్వామిలతో విడాకులు తీసుకుని ఒంటరిగా గడుపుతున్నారు.
ఇలా ఒంటరిగా గడుపుతున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది అయితే ఇద్దరు ఒంటరిగా ఉండటంతో వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వీరి వివాహం చెన్నైలో ఎంతో ఘనంగా జరిగింది.

Mahalakshmi: ఇద్దరికీ రెండవ వివాహమే…

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిర్మాత రవీంద్ర పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా స్థిరపడ్డారు. ఇక ఈమె కూడా వాణి రాణి వంటి క్రేజీ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే మహాలక్ష్మి రవీంద్ర నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ఇంట విషాదం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవి శ్రీప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు అధికమవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ మరణించడంతో దేవి ఇంట విషాదం నెలకొంది. తన బాబాయ్ మరణవార్త విన్న దేవి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా ఒక్క మరణవార్త వారిని కృంగదీస్తుందంటే మరొక మరణ వార్త విన్న దేవి శ్రీ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టేసింది. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ మరణవార్త విన్న తన మేనత్త మహాలక్ష్మి గుండెపోటుతో మరణించడంతో దేవి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి రెండు మరణ వార్తలతో దేవి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి పుష్ప సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కాంబోలో తెరకెక్కినటువంటి ఆర్య, ఆర్య 2 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలుగుసిందే. ఈ క్రమంలోనే పుష్ప సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన
దాక్కో దాక్కో మేక పాట విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా, సంతోషంగా ఉన్న దేవి ఇంట తన బాబాయి, మేనత్త మరణవార్తతో విషాదం నిండిపోయింది.

కూతురు పుట్టిందని అంత పని చేసిన వ్యక్తి.. ఏం చేశాడంటే?

ప్రస్తుత కాలంలో కూతురు పడుతుందని తెలియగానే ఎంతో బరువుగా భావించి వారిని పొత్తిళ్లలోనే పరలోకానికి పంపుతున్నారు. మరికొందరికి ముళ్ళ పొదలు, చెత్త కుండీలు ఆశ్రయంగా మారాయి.ప్రపంచం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో ఆడపిల్లల పట్ల ఉన్న ఈ విధమైనటువంటి భావన మాత్రం మారడం లేదు. ప్రతిరోజు ఆడపిల్లల పట్ల వివక్షత చూపిస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సందర్భంలోనే ఓ వ్యక్తి తన కూతురు పుట్టిందని అతడు చేసిన పనికి గ్రామం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఖానాపూర్ లో మరబోయిన నవీన్‌కు శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే తన కూతురు పుట్టిందని ఏమాత్రం కృంగిపోకుండా తనకు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయాడు.ఈ క్రమంలోని తన కూతురు పుట్టిన విషయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలోనే తనకు కూతురు పుట్టిన సంతోషాన్ని ఊరందరికీ నాలుగైదు రోజులకు సరిపడే కూరగాయలను ప్రతి ఇంటికీ పంచి తన ఆనందాన్ని పంచుకొని వేడుకగా జరుపుకున్నారు.

గ్రామంలోని 300 ఇండ్లకు కూరగాయలను పంచుతూ తన కూతురు పుట్టిందని, తన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని నవీన్ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. ఈ విధంగా తనకు కూతురు పుట్టిన సందర్భంగా గ్రామం మొత్తానికి కూరగాయలు పంచడంతో గ్రామస్తులందరూ అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకునే ఈ రోజుల్లో ఈ విధంగా గ్రామస్తులు అందరికీ సహాయం చేయడంతో గ్రామస్తులు అతనిని పొగడ్తలతో ముంచెత్తారు.

ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఈ విధంగా తన మిత్రుల సహాయంతో కూరగాయలు పంచడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ విధంగా గ్రామస్తులు అందరికీ సేవచేసే అదృష్టం రావడం ఎంతో సంతోషంగా ఉందని నవీన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మణిద్వీప వర్ణన చదవడం వల్ల ఎంత ఉపయోగమో తెలుసా?

సాధారణంగామనం ప్రతి రోజూ మన ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అప్పుడు లేదా, ఏదైనా శుభకార్యాలలో పూజ చేస్తున్నప్పుడు ఈ మణిద్వీప వర్ణన చదువుతాము. చాలా మందికి పూజ సమయంలో ఈ మణిద్వీప వర్ణన చదవటం అలవాటుగా ఉంటుంది. అయితే ఈ మణిద్వీప వర్ణన చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ అలా చదవడం వల్ల మంచి జరుగుతుందన్న విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అయితే ఈ మణిద్వీప వర్ణన అంటే ఏమిటి ఇదిచదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

మణిద్వీప వర్ణన అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్న చోటనే మణిద్వీపం అని పిలుస్తారు. ఆ విధంగా మహాలక్ష్మి కొలువై ఉన్న చోట మనం ఇష్ట దైవాను స్తోత్రం చదవటాన్ని మణిద్వీప వర్ణన అని చెబుతారు.ఎంతో మహిమ కలిగిన ఈ మణిద్వీప వర్ణన చదవడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలు తొలగిపోయి మన ఇంటిలో అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.

ఏ రోజైతే మనం మన ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవుడు ముందు కూర్చొని మణిద్వీప వర్ణన చదువుతామో అప్పుడు మన ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా మన ఇంట్లో ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మణిద్వీప వర్ణన చేయడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.