Tag Archives: Mahesh Babu:

Sitara: ఫస్ట్ యాడ్ కోసం సితార తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Sitara:మహేష్ బాబు గారాల పట్టి సితార చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో తనకంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసే సితార ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా నిత్యం పలు పాటలకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇంత చిన్న వయసులోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె తాజాగా ఓ నగల సంస్థకు సంబంధించి యాడ్ లోనటించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన ఫోటోలు టైం స్క్వేర్ పై తలుక్కుమనడంతో ఒక్కసారిగా మహేష్ బాబు అభిమానులు అలాగే మహేష్ బాబు దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ విధంగా సితార ఈ ఫోటోలలో అచ్చం యువరాణి లాగే ఉన్నారు.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి మహేష్ బాబు నమ్రత దంపతులు ఎంతో గర్వపడుతున్నారు. ఇంత చిన్న వయసులోనే తమ కూతురికి ఇలాంటి గౌరవం దక్కడం చూసి ఈ దంపతులు గర్వపడుతున్నారు. ఇకపోతే ఈ నగల సంస్థ కోసం సితార తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Sitara: కోటి రూపాయల రెమ్యూనరేషన్…


ఈ యాడ్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇంత చిన్న వయసులోనే ఒక్క యాడ్ కోసం సెలబ్రిటీల స్థాయిలో సితార రెమ్యూనరేషన్ తీసుకున్నారని విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ వయసులోనే ఈ స్థాయిలో సంపాదిస్తుంటే ఫ్యూచర్లో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకుంటుందని పలువురు భావిస్తున్నారు.

Mahesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్.. రెండేళ్ల చిన్నారికి పునర్జన్మ?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు కేవలం తెరపై మాత్రమే కాకుండా హీరో అని అందరికీ తెలిసిందే. ఈయన సినిమా ఇండస్ట్రీలో సంపాదిస్తూ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మల ప్రసాదిస్తున్నారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులందరికీ కూడా ఈయన ఉచితంగా తన ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే కొన్ని వందల మందికి సర్జరీలు చేయించడం మహేష్ బాబు తాజాగా మరో రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోసారు.

ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన రెండేళ్ల కార్తికేయ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.అయితే తనకు హార్ట్ లో రంద్రం ఉందని సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కు తెలియక మహేష్ బాబు ఫౌండేషన్ ను ఆశ్రయించారు. వెంటనే బాలుడిని తీసుకుని వెళ్లి ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో బాలుడికి హార్ట్ ఆపరేషన్ చేసి బాబు ప్రాణాలను నిలబెట్టారు..

Mahesh Babu: మంచి మనసు చాటుకున్న మహేష్…

ఇక వైద్యుల పర్యవేక్షణ అనంతరం తనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో బాబుని డిశ్చార్జ్ చేశారు. అయితే తమ కుమారుడి ప్రాణాలను నిలబెట్టినందుకు మహేష్ బాబు ఫౌండేషన్ కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఇదే విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో మరోసారి మహేష్ మంచితనం పై అభిమానులు నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Naga Vamsi: మహేశ్ బాబు, త్రివిక్రమ్ మధ్య గొడవ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..?

Naga Vamsi: దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది . ఇప్పటికే సినిమా గురించి అనేక వార్తలు వినిపించాయి. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అతడు, ఖలేజా సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా రూపొందుతోంది. ఎస్ఎస్ఎంబి 28 నే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ వార్తల గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

ఈ క్రమంలో నాగవంశీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో పక్షులు ఆహారం కోసం వెతికేటప్పుడు గట్టిగా శబ్దం చేస్తాయి. అలాగే ఎవరైనా అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు అదే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అయితే వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయడం సులభమే.
అలాగే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సూపర్ ఫ్యాన్స్… SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది.

Naga Vamsi: ఇది గుర్తుపెట్టుకోండి…

మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండని నాగవంశీ ట్వీట్ చేశారు. SSMB 28 సినిమా గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలనీ నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ట్వీట్ వల్ల అయిన SSMB 28 గురించి వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెడుతుందో లేదో చూడాలి మరి.

Mahesh Babu: మహేష్ అందాన్ని కొరుక్కు తినాలనిపిస్తుంది.. బరితెగించిన జాన్వీ కపూర్!

Mahesh Babu:టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ యంగ్ హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అందం అభినయానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇక మహేష్ బాబుకి అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.

మహేష్ బాబు అందానికి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అవుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు సైతం మహేష్ బాబుతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటారు.ఇలా అందానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు పై తాజాగా బాలీవుడ్ నటి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మహేష్ బాబు సర్ అందం చూస్తే కొరుకు తినాలనిపిస్తుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ఎవరికైనా వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ సార్ విషయంలో ఇందుకు విభిన్నం.

Mahesh Babu వయసు పెరిగే కొద్దీ ఆయనకు అందం పెరుగుతుంది…

ఆయనకు వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుందని అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ ఈమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు మహేష్ సార్ వైపు చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు తెలియదని, అలా చూసినప్పుడు తన ఫేస్ మొత్తం బ్లాంక్ అవుతుంది అంటూ ఈమె మహేష్ బాబు అందంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ కాక వెంటనే మహేష్ బాబు అభిమానులు స్పందిస్తూ మహేష్ బాబుకి దిష్టి తీయడం మర్చిపోకండి అంటూ కొందరు అభిమానులు నమ్రతకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం జాన్వి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.